Tirumala: తిరుమల (జనదూత) 23: కలియుగ దైవం ఏడు కొండల వేంకటేశ్వర స్వామి దైవదర్శన టికెట్లను బుధవారం టీటీడీ విడుదల చేసింది. శ్రీవాణి బ్రేక్ దర్శన టికెట్ల జనవరి 2025 కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం బుధవారం ఉదయం విడుదల చేసింది. టికెట్లను రోజుకు కేవలం 500 టికెట్లు, గదులు వంద చొప్పున భక్తులకు అందుబాటులో ఉంచింది. అలాగే, వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని వచ్చే ఏడాది(2025)జనవరి 10 నుంచి 19వ తేది వరకు టికెట్ల విడుదల వాయిదా వేయిసినట్టు టీటీడీ ప్రకటించింది. భక్తులకు ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా కోరింది. మంగళవారం ఒక్క రోజే సుమారు 65వేల మంది భక్తులు దైవ దర్శనం చేసుకున్నారు.
31న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
ఈనెల 31(గురువారం) దీపావళి పర్వదినం సందర్భంగా శ్రీవారి ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ(Tirumala )సన్నద్ధమైంది. పండుగ సందర్భంగా అక్టోబరు 3న ‘దీపావళి ఆస్థానాన్ని’ టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొంది. దీపావళి పర్వదిన వేళ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుందని ఈసందర్భంగా పేర్కొంది. ఆస్థానంలో భాగంగా ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన శ్రీమలయప్పస్వామి దేవేరులతో సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్కు అభిముఖంగా వేంచేస్తారని వెల్లడిరచారు. అలాగే సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా గోవిందుడి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. వేడుకల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక హారతి, పూజ, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. అట్టహాసంగా దీపావళి ఆస్థానం వేడుకలు ముస్తాయని తెలిపారు. అలాగే సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
ఆర్జిత సేవలు రద్దు
తిరుమల తిరుపతి దేవస్థాయంలో జరిగిన దీపావళి ఆస్థానం వేడుకల సందర్భంగా ఆరోజు (అక్టోబరు 31)న తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారని వెల్లడిరచింది.
తిరుమలలో భక్తుల సందడి
తిరుమతి తిరుపతి దేవస్థానంలో భక్తుల సందడి నెలకొంది. బుధవారం పెద్ద సంఖ్యల భక్తులు స్వామి దర్శనానికి వచ్చారు. ఈమేరకు భక్తులతో క్యూ లైన్లు నిండిపోయాయి. దర్శనానికి 4గంటల వరకు సమయం పడుతోంది.
నవంబరు 28 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. నవంబరు 28 నుంచి డిసెంబరు ఆరో తేదీ వరకు కన్నులపండువగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు అమ్మవారి మూలమూర్తి దర్శనం, వాహన సేవలు భక్తులు వీక్షించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో చివరిరోజైన పంచమి తీర్థం వేళ భారీగా వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం రేణిగుంట, పూడి రోడ్డు, మార్కెట్ యార్డ్ ప్రాంతాల్లో స్థలాలను సిద్ధం చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారు సేదతీరేందుకు నవజీవన్ కంటి ఆస్పతి, హైస్కూల్, గోశాల(పూడి రోడ్డు) వద్ద జర్మన్ షెడ్లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పుష్కరిణిలోకి వెళ్లేందుకు గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. తమిళనాడు భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున తమిళంలో సైన్ బోర్డులు చేసే పనిలో పడ్డారు.