Medical War: ఆయుర్వేదం వర్సెస్ అలోపతి.. వైద్య రంగంలో కొత్త చిచ్చుకు దారి తీస్తోంది. పతంజలి తమ ఉత్పత్తులపై చేస్తున్న ప్రకటనపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం ఉంది.. కంపెనీ నిర్వాహకులు క్షమాపణలు చెప్పినా సుప్రీం అంగీకరించడం లేదు.. చర్యలు ఎందుకు తీసుకోవద్దంటూ ఘాటుగానే ప్రశ్నిస్తోంది. అసలు అలోపతి వైద్యంను కించపరిచేలా ఎలా ప్రకటనలు ఇస్తారంటూ ఏప్రిల్ 10(2024)న యోగా గురువు రాందేవ్ బాబా, పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణపై అగ్గిమీద గుగ్గిలం అయింది. కరోనా సమయంలో పంతజలి కంపెనీ కరోలిన్ ఉత్పత్తని తయారు చేసింది.. దాన్ని వాడితో కరోనా తగ్గుతుందని.. ఇక అలోపతి వైద్యంతో అపనిలేదనే ది ఆ ప్రకటన సారాంశం. అలాగే మరికొన్ని ఉత్పత్తులు కూడా దీర్ఘకాలిక రోగాలను నయం చేస్తాయనే ప్రకటనలూ ఉన్నాయి. అలోపతి వైద్యంపై పతంజలి తప్పడు ఆలోచలను కలిగించేలా ఉన్నాయంటూ ఐఎంఏ(ఇండియన్ మెడికల్ అసోసియేషన్) కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు తీవ్రంగా పనిగణించింది. ఏకంగా కోటి రూపాయల పరువునష్టం వేసే అవకాశమూ లేకపోలేదు. క్లుప్తంగా ఇదీ కేసు సారాంశం.
అలోపతి వర్సెస్ ఆయుర్వేదం..
పతంజలి కేసు ఇప్పుడు దేశంలో కొత్త చర్చకు దారితీసింది. అలోపతి వర్సెస్ ఆయుర్వేదం(Medical War) అన్నట్టుగా మారింది. 20వ శతాబ్దం తర్వాత వైద్య రంగంలో పెనుమార్పులు వచ్చాయి. అంతేకాదు కొత్త కొత్త రోగాలూ పుట్టుకొచ్చాయి. ఒక్కో వ్యాధికి ఒక్కో కారణం ఉంది. అలోపతి(ఇంగ్లిష్ వైద్యం) పెనుమార్పులు తీసుకొచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మానవాళి సగటు ఆయుష్షు పెరగడంలో దాని పాత్ర ఎంతో కీలకమైనది. అలాగని ఆయుర్వేదం వైద్యం కూడా కొట్టిపారేలా ఏమీ లేదు. ఇప్పటికీ కొన్ని మొండి రోగాలకు అదే ఉపశమనంగా మారింది. అలోపతి రోగాన్ని త్వరిగతిన నయం చేస్తే, ఆయుర్వేదం కాస్త నెమ్మదిగా ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. కానీ అలోపతితో భవిష్యత్తులో ఆ రోగం తిరగదోడే అవకాశముందని భావించేవారూ ఉన్నారు. ఆయుర్వేదం తక్కువ ఖర్చతోపాటు, ఎలాంటి సైడ్ ఎఫెక్్ట్స ఉండకపోవడంతో ఇప్పటికీ వీటిని ఆశ్రయించేవారు ఎక్కువే. ఇంకా చెప్పలంటే పక్షవాతం, ఎయిడ్స్, కీళ్లవాతం, కొన్ని రకాల క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారు ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తున్నారు. అలోపతి వైద్యం చేయించుకుని, నయంకాని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారూ చివరకు ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తున్నారు. ఆయుర్వేదం… అలోపతి దేని ప్రత్యేక దానిదే అయినా.. ఇప్పుడు కోర్టుకు ఎక్కడం దేనికి దారితీస్తుందోనని వైద్యరంగ నిపుణులు ఆందోళన చెందుతున్నారు..
ఆయుర్వేదంపై చిన్నచూపు ఎందుకు..?
పతంజలి కేసు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయుర్వేద ఉత్పత్తులపై అలోపతి పెత్తనం ఏంటనే విమర్శలూ పుట్టుకొస్తున్నాయి. ఆయుర్వేదం, యునానీ వైద్యం పురాణ కాలం నుంచి ఉందని, దీనికి శాస్త్రీయత ఉందనేది వారి వాదన. అలోపతికి ముందే మొండి రోగాలను నయం చేసే శక్తి ఉందని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. అలోపతితో సమాన గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రకృతి నుంచి లభించే సహజసిద్ధమైన ఆకులు, మూలికలు, చెట్ల నుంచి రోగ నిరోధక శక్తినిచ్చే మందులను తయారుతో భవిష్యత్తులో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని చెబుతున్నారు. ప్రస్తుత ఉరుకులపరుగుల కాలంలో త్వరగా ఉపశమనమిచ్చే అలోపతి వైద్యంపై అందరూ మక్కువ పెంచుకున్నారు. కొత్తగా పుట్టుకొచ్చే రోగాలకు ఎప్పటికప్పుడు పరిశోధనలు చేస్తూ కొత్త మందులను సృష్టించడంతో ప్రపంచ వ్యాప్తంగా అలోపతికి డిమాండ్ పెరిగింది.
ప్రకటనల చిచ్చు…
అలోపతి, ఆయుర్వేదంపై ప్రకటన చిచ్చు రాజుకుంటోంది. ఒకరి ప్రకటనలు ఒకరు ఎత్తిచూపుతూ చర్చ చేస్తున్నారు. ఇందుకు పతంజలి కేసు ఓ ఉదాహరణ. కానీ, లోలోన మాత్రం రెండు వర్గాలమధ్య అంతరం స్పష్టంగా కనిపిస్తోంది. అలోపతి వైద్య ప్రకటనలపై ఎందుకు చర్యలు తీసుకోరనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఇదిలాఉంటే అసలు కొన్ని కంపెనీల ప్రకటనలు నిజంగా వినియోగదారులను పక్కదారి పట్టించేవిగానే ఉన్నాయి. ఓ కంపెనీ తమ ఉత్పత్తులను వినియోగదారులకు చెప్పుకునేందుకు ఈ ప్రకటనలు జారీ చేస్తారు. కానీ , చాలా కంపెనీలు వాస్తవికతకు దూరంగానే ఉంటున్నాయి. ఆ ప్రకటలను నమ్మి కొందరు అనారోగ్యంపాలవగా, మరికొందరు నష్టపోయారు.
ఎక్కువగా చదివినవి:
మానవ మెదడు పెరుగుతోంది.. కానీ..
లిక్కర్ స్కాంలో కవితకు చుక్కెదురు!
కేజ్రివాల్పై మరక.. తీహార్ జైలుకు వెళ్లిన తొలి సీఎం ఆయనే..
వంద రోజుల్లో బీఆర్ ఎస్ సీన్ రివర్స్
వావ్.. కోకో.. ఖమ్మం రైతులు భేష్
మీకు తెలియకుండానే మీ నంబర్ను వాడుతున్నారు..
దేశాన్ని కుదిపేస్తున్న కచ్చతీవు దుమారం
[…] ఆయుర్వేదం vs అలోపతి […]