బరిలో ప్రధాన పార్టీ అభ్యర్థులు వీరే..
MP Candidates/ హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ఘట్టం ముగిసింది. నామినేషన్ స్ర్కూటినీ ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లన్నీ ఒకే అవడంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు బరిలోనివడం ఖాయంగా మారింది. దీంతో వారు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. గెలుపుకోసం పడరానిపాట్లు పడుతున్నారు.
బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే..
- అదిలాబాద్ (ఎస్టీ) : ఆత్రం సుగుణ(కాంగ్రెస్), ఆత్రం సక్కు(బీఆర్ఎస్), జి.నగేష్(బీజేపీ)
- మహబూబాబాద్(ఎస్టీ): బలరాం నాయక్(కాంగ్రెస్), మాలోతు కవిత(బీఆర్ఎస్), అజ్మీర సీతారామ్ నాయక్(బీజేపీ)
- పెద్దపల్లి (ఎస్సీ): గడ్డం వంశీకృష్ణ(కాంగ్రెస్), కొప్పుల ఈశ్వర్(బీఆర్ఎస్), గోమాస శ్రీనివాస్(బీజేపీ)
- నాగర్కర్నూల్ (ఎస్సీ): మల్లు రవి(కాంగ్రెస్), ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (బీఆర్ఎస్), పి. భరత్(బీజేపీ)
- వరంగల్(ఎస్సీ): డాక్టర్ కడియం కావ్య(కాంగ్రెస్), డాక్టర్ సుధీర్ కుమార్(బీఆర్ఎస్), అరూరి రమేష్(బీజేపీ)
- హైదరాబాద్: ఎండీ వలీలుల్లా సమీర్(కాంగ్రెస్), గడ్డం శ్రీనివాస్ యాదవ్(బీఆర్ఎస్), కొంపెల్లి మాధవీలత(బీజేపీ), అసదొద్దీన్ ఓవైసీ (ఎంఐఎం)
- మల్కాజ్గిరి: సునీత మహేందర్ రెడ్డి(కాంగ్రెస్), రాగిడి లక్ష్మా రెడ్డి(బీఆర్ఎస్), ఈటల రాజేందర్(బీజేపీ)
- సికింద్రాబాద్: దానం నాగేందర్(కాంగ్రెస్), పద్మారావు గౌడ్(బీఆర్ఎస్), జి.కిషన్ రెడ్డి(బీజేపీ)
- కరీంనగర్: వెలిచాల రాజేందర్రావు(కాంగ్రెస్), బి.వినోద్ కుమార్(బీఆర్ఎస్), బండిసంజయ్(బీజేపీ)
- నిజామాబాద్: టి.జీవన్ రెడ్డి(కాంగ్రెస్), బాజిరెడ్డి గోవర్థన్(బీఆర్ఎస్), ధర్మపురి అరవింద్(బీజేపీ)
- జహీరాబాద్: సురేష్ షెట్కర్(కాంగ్రెస్), గాలి అనీల్ కుమార్(బీఆర్ఎస్), బీబీ పాటిల్(బీజేపీ)
- మెదక్: నీలం మధు(కాంగ్రెస్), పి.వెంకటరామిరెడ్డి(బీఆర్ఎస్), రఘునందన్రావు(బీజేపీ)
- చేవెళ్ల: జి.రంజిత్ రెడ్డి(కాంగ్రెస్), కాసాని జ్ఞానేశ్వర్(బీఆర్ఎస్), కొండా విశ్వేశ్వర్ రెడ్డి(బీజేపీ)
- మహబూబ్నగర్: వంశీ చంద్ రెడ్డి(కాంగ్రెస్), మన్నె శ్రీనివాస్ రెడ్డి(బీఆర్ఎస్), డీకే ఆరుణ(బీజేపీ)
- నల్గొండ: రఘువీర్ కుందూరు(కాంగ్రెస్), కంచర్ల కృష్ణా రెడ్డి(బీఆర్ఎస్), సైది రెడ్డి(బీజేపీ)
- భువనగిరి: చామల కిరణ్ కుమార్రెడ్డి(కాంగ్రెస్), క్యామ మల్లేష్(బీఆర్ఎస్), బూర నరసయ్య గౌడ్(బీజేపీ)
- ఖమ్మం: రామసహాయం రఘురామ్రెడ్డి(కాంగ్రెస్), నామా నాగేశ్వరరావు(బీఆర్ఎస్), తాండ్ర వినోద్ రావు(బీజేపీ)
నాడు ఓడి.. నేడు బరిలోకి..
ఓటర్లను నాలుగు నెలలక్రితం అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఓడిపోయినవారు ఎంపీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు యత్నిస్తున్నారు. బీఆర్ఎ్సలో చాలాకాలం పనిచేసిన ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచిన ఈటల రాజేందర్ గత అసంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వెల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోగా ఈసారి మల్కాజిగిరి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ సై అన్నారు. అలాగే, బీఆర్ఎ్సకు చెందిన రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నియోజకవర్గం నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. పెద్దపల్లి లోక్సభ స్థానం ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బీజేపీకి చెందిన ఎం.రఘునందన్రావు కూడా దుబ్బాక నుంచి ఓటమిపాలయ్యారు. ఈసారి మెదక్ పార్లమెంటు స్థానం నుంచి అదే పార్టీ నుంచి బరిలో నిలిచారు. ఐపీఎస్ అధికారి, గురుకులాల సొసైటీ కార్యదర్శిగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్వచ్చంద పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. కొంతకాలం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ఈసారి సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయంపాలయ్యారు. తాజాగా నాగర్కర్నూల్ రిజర్వుడ్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన బరిలో నిలిచారు. కాంగ్రెస్నేత నీలం మధు బీఆర్ఎ్సలో పనిచేసినా 2023 అసెంబ్లీ ఎన్నికల కాంగ్రె్సలో చేరారు. కాంగ్రెస్ నుంచి పటాన్చెరు నియోజకవర్గం నుంచి మధుకు రాకపోవడంతో బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తాజాగా కాంగ్రె్సలో చేరి మెదక్ లోక్సభ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్నారు. బీజేపీ నాయకుడు శానంపూడి సైదిరెడ్డి చాలాకాలం బీఆర్ఎ్సలో పనిచేసి, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇటీవల కాలంలో బీజేపీలో చేరి నల్లగొండ పార్లమెంటు స్థానానికి నుంచి పోటీలో నిలిచారు. మరో బీఆర్ఎస్ తరపున వర్ధన్నపేట నుంచి ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు (2014, 2018)ఎమ్మెల్యేగా ఎన్నికైనా అరూరి రమేష్ 2023 ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరి, ప్రస్తుతం బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కరీంనగర్ ప్రస్తుత బీజేపీ ఎంపీగా బండి సంజయ్.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయంపాలయ్యారు. మరోసారి కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన అరవింద్ కూడా నిజామాబాద్ నుంచి మళ్లీ బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.