టీ–20 టీమిండియా తుది జట్టు ఇదే..

న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌ కప్ టీం ఇండియా(T20 World Cup Team India)జట్టు ను జతీయ సెలెక్టర్లు ప్రకటించారు. 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. టీం ఇండియాకు రోహిత్‌ శర్మ సారథిగా వ్యవహరించనున్నాడు. జూన్‌ ఒకటి నుంచి 29 వరకు వెస్టిండీస్‌తోపాటు యూఎ్‌సఏలో ఈ బిగ్‌టోర్నీ జరగనుంది. రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఈ టోర్నీకి తొలి బ్యాచ్‌ మే 21న బయలుదేరుతుంది. కాగా, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఈ టోర్నీలో చోటు దక్కుతుందా అన్ని అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో సెలెక్టర్లు ఏకంగా వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేయడం గమనార్హం. గత టీ20 వరల్డ్‌ కప్‌(2022)లో టీమిండియా సెమీ్‌సలో పరాజయం చెందాక భారత జట్టులో మార్పుల చేస్తూ, దిగ్గజాలు రోహిత్‌, విరాట్‌ లేకుండానే సాగిన విషయం తెలిసిందే. యశస్వీ జైస్వాల్‌ ఓపెనర్‌గా రోహిత్‌తో బ్యాటింగ్‌ చేయనున్నారు. కారు ప్రమాదంలో గాయపడి కోలుకుని ప్రస్తుత ఐపీఎల్‌లో మెరుగ్గా రాణిస్తున్న వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ తిరిగి జట్టులోకి చేరారు. సుదీర్ఘ బ్రేక్‌ తర్వాత జాతీయ జట్టులో ఆడబోతున్నాడు. వికెట్‌ కీపర్‌గా సంజూశాంసన్‌ను ఎంపిక చేశారు. శాంసన్‌కిది తొలి వరల్డ్‌కప్‌ కావడం గమనార్హం. స్పిన్నర్‌ చాహల్‌, అక్షర్‌, జడేజా, కుల్దీప్‌యాదవ్‌లపై మరోసారి సెలెక్టర్‌ నమ్మకముంచారు.

 

  • పాపం కేఎల్‌ రాహుల్‌, అయ్యర్‌..

టీ–20 వరల్డ్‌ కప్‌(T20 World Cup Team India)కు ఓపెన్‌ కేఎల్‌ రాహుల్‌పై సెలెక్టర్లు ఆసక్తి చూపలేదు. తాజాగా జరుగుతున్న ఐపీఎల్‌లోనూ భారీ స్కోర్‌ చేసిన దాఖలాలు లేకపోవడంతో బహుశా అతడిని పక్కకుపెట్టినట్టు తెలుస్తోంది. అలాగే మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ను సైతం విస్మరించారు. సిక్కర్ల రింకూసింగ్‌, ఓపెనర్‌ శుభమన్‌గిల్‌ రిజర్వ్‌ ప్లేయర్లుగా మాత్రమే ఎంపిక చేశారు. దినేష్‌ కార్తిక్‌, ముకేశ్‌ కుమార్‌, తిలక్‌ వర్మలకు నిరాశే మిగిలింది. పేసర్‌ మయాంక్‌ యాదవ్‌ను సైతం పట్టించుకోలేదు.

 

టీ–20 తుది జట్టు ఇదే..

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), యశస్వీ జైస్వాల్‌, కోహ్లీ, సూర్యకుమార్‌ రవీంద్ర జడేజా, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌ సంజూ శాంసన్‌, రిషభ్‌ పంత్‌, జస్ర్పీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌, సిరాజ్‌, యజ్వేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌

రిజర్వ్‌ ఆటగాళ్లు: రింకూ సింగ్‌, శుభ్‌మన్‌ గిల్‌, అవేశ్‌ ఖాన్‌, ఖలీల్‌ అహ్మద్‌,

 

భారత జట్టు గ్రూపు దశ మ్యాచ్‌లివే..

తొలి మ్యాచ్‌ జూన్‌ 5న ఐర్లాండ్‌తో న్యూయార్క్‌లో ఆడనుంది. ఆ తర్వాత జూన్‌ 5న న్యూయార్క్‌లో పాకిస్తాన్‌తో, జూన్‌ 12న నూయార్క్‌లో అమెరికాతో, జూన్‌ 15న లాడర్‌ హిల్‌లో కెనడాతో టీమిండియా తలపడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *