పవన్‌ కల్యాణ్‌కు గుర్తు గండం..

హైదరాబాద్‌: జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్‌ కల్యాన్‌కు పార్టీగుర్తు టెన్షన్‌ పట్టుకుంది. జనసే పార్టీ గుర్తు గాజు గ్లాసు కాగా, ఇప్పుడు గుర్తు కోసం పవన్‌ పోరాటం(Janasena Struggle  for Party Symbal)చేయాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు పొత్తులు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాల్లో పోటు చేస్తోంది. ఎక్కడైతే జనసేన పార్టీ పోటీ చేయడం లేదో.. అక్కడ తమకు గాజు గ్లాస్‌ గుర్తు కేటాయించాలంటూ స్వతంత్రులు కోరుతున్నారు. ఇదిలాఉంటే ఎట్టి పరిస్థితుల్లో గాజు గ్లాసు గుర్తును వారికి కేటాయించవద్దని పవన్‌ కల్యాన్‌ ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాను. గాజుగ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ జనసేన పార్టీ వ్యాజ్యం దాఖలు చేయగా, మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. కేంద్ర ఎన్నికల సంఘం తరపున న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ స్పందిస్తూ.. గాజుగ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించవద్దని పవన్‌ కల్యాణ్‌ వినతిపత్రాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చినట్టు వెల్లడించారు. ఆ పార్టీ ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిశీలించి మరో 24గంటల్లో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

ప్రచారంలో దూసుకుపోతున్న జనసేన..

జన సేన ఆంధ్రప్రదేశ్‌లో తన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకుసాగుతున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందేమి లేదంటూ విమర్శలు గుప్పించారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీపై తన ప్రచారంలో భాగంగా నిప్పులు చెరుగుతున్నారు

——++++++——–

మరిన్ని తాజా వార్తలు, రివ్యూస్ కోసం జన దూత వెబ్ సైట్ చూడండి. హోమ్ పేజి లో న్యూస్ అప్డేట్ .

——–++++

ఎక్కువగా చదివినవి:

T20 World Cup:టీ–20 టీమిండియా తుది జట్టు ఇదే..

ఆయుర్వేదం vs అలోపతి

అరేబియాలో అద్భుతం

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *