Waqf Parliament పార్లమెంట్‌లో వక్ఫ్‌ బిల్లుపై గురువారం వాడీవేడీ చర్చ సాగుతోంది. ప్రతిపక్షాలు ఆందోళన నడమనే వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. వక్ఫ్‌ బోర్డులో అధికారాలను పరిమితం చేయడంతోపాటు బోర్డులో సభ్యుల్లో ముస్లిం మహిళలను, ముస్లింయేతరులను ఇందులో భాగస్వామ్యం చేయడమే బిల్లులు ప్రధాన ఉద్ధేశం. బోర్డులో మహిళలు, ఓబీసీ ముస్లింలు, బోహ్ర, షియా తదితర ముస్లింలకు చోటు కల్పించడమే కొత్త చట్టం ఉద్ధేశమని ప్రభుత్వం పేర్కొంటోంది. వక్ఫ్‌ బిల్లును ప్రవేశ పెడుతున్నట్టు బుధవారమే బీఏసీ(బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ)కి తెలియజేసింది. అయితే టీఎంసీ నేత సుదీప్‌ బందోపాధ్యాయ, కాంగ్రెస్‌ నాయకుడు గౌరవ్‌ గొగోయ్‌లు దీనిని పార్లమెంటరీ స్థాయీ సంఘం పరిశీలనకు పంపాలని కోరగా దీనికి ప్రభుత్వం తనదైన శైలిలో స్పందించింది. బిల్లుపై లోక్‌ సభలో వచ్చిన స్పందన ఆధారంగా పంపిస్తామంటూ బదులులిచ్చింది. కాగా, గురువారం బిల్లును కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖామంత్రి కిరణ్‌ రిజీజు ప్రవేశపెట్టగా ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనికి ప్రభుత్వం కూడా ధీటుగానే సమాధానమిచ్చింది. బిల్లుకు టీడీపీ, జేడీయూ మద్దతు ఇవ్వగా ఇండియా కూటమి, కాంగ్రెస్‌, ఎస్పీ, డీఎంకే, అన్నా డీఎంకే, ఎంఐఎం పార్టీలు తీవ్రంగా అక్షేపించాయి.

చట్టంలో మార్పులొస్తే..

వక్ఫ్‌ చట్టం అమల్లోకి వస్తే తీవ్ర మార్పులు జరగనున్నాయి. ఏదైనా ప్రభుత్వం భూమిని వక్ఫ్‌ Waqf Parliament భూమిగా నిర్ధారించినా, లేదంటే ప్రకటించినా ప్రస్తుత బిల్లు ప్రతిపాదన ప్రకారం వక్ఫ్‌ స్థిరాస్థిగా భావించరు. ఇది ఎవరి భూమి అన్నది తేలాలంటే కలెక్టర్‌ విచారణ జరిపి నివేదిక ఇచ్చేదాక వక్ఫ్‌ ఆస్తిగా భావించరు. ఒకవేళ కలెక్టర్‌ సదరు భూమి ప్రభుత్వానిదని గుర్తిచేస్తే ఆ నివేదికను ప్రభుత్వానికి పంపిస్తారు. అప్పుడు సర్కారు వక్ఫ్‌ బోర్డుకు పంపిస్తుంది. అప్పుడు బోర్డు దానిని ప్రభుత్వ భూమిగా గుర్తించాల్సి ఉంటుంది. ఆ తర్వాత బోర్డు దానిని ప్రభుత్వ స్థలంగానే రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉంటుంది.

వక్ఫ్‌ బోర్డుకు ఆ హక్కు లేనట్టే..

కొత్త చట్టం అమల్లోకి వస్తే వక్ఫ్‌ బోర్డులో చాలా మార్పులు రానున్నాయి. కొత్త చట్టం Waqf Parliament అమలైతే 1995 యాక్ట్‌ ప్రకారం భూమి ప్రభుత్వానిదా, వక్ఫ్‌ బోర్డుదా అనే తేల్చే అధికారం ఇక వక్ఫ్‌ ట్రిబ్యునల్‌కు ఉండది. అంతేకాదు, తనది కాని ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లో వక్ఫ్‌ దానం చేయడానికి వీల్లేదు. ప్రస్తుతం వివాదంలో ఉన్న ఆస్తులపై కొత్తగా విచారణ చేపట్టడం అనివారం కానుంది. కొత్త చట్టం అమలైతే వక్ఫ్‌బోర్డు వివరాలను తప్పనిసరిగా ప్రభుత్వ పోర్టల్‌లో వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది.

ఇది ముస్లింలు మెచ్చుకునే బిల్లు: రిజీజు

సభలో మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజీజు మాట్లాడుతూ ఇది ముస్లింలకు నచ్చేబిల్లు లని పేర్కొన్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం చట్టాన్ని రూపొందించిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలోఅందరికీ ఒకే న్యాయం ఉండేలా సవరణలు చేస్తున్నామని, దీని ప్రకారం మతాలవారీగా నాయం ఉండదని స్పష్టం చేశారు. బిల్లుపై ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించామని, ముస్లిం పెద్దలు, ముస్లిం సంస్థలు ఇందుకు మద్దతు ఇచ్చాయని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *