MEGASTAR -CHIRANJEEVI: హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి తన 50 ఏళ్ల క్రితం నాటి మధుర జ్ఞాపకాన్ని శనివారం(25`10`24)నాడు నెమరువేసుకున్నారు. ఆ అనుభూతిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. చిరంజీవి పోస్టు చూసి అభిమానులు దటీజ్ మెగస్టార్ అంటూ సంబరపడిపోతున్నారు. విషయంలోకి వెళితే..
తెలుగు రాష్ట్రాలేకాదు బాలీవుడ్కు పరిచయం అక్కరలేని పేరు మెగస్టార్ చిరంజీవి (కొణిదెల శివశంకర వర ప్రసాద్) స్వశక్తితో సినీ రంగంలో ధృవతారగా నిలిచిన స్టార్ అతడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్, గాడ్ ఫాదర్ లేకుండానే స్వయం కృషితో ఉన్నతస్థాయికి ఎదిగిన స్టార్ చిరంజీవి. సినిమాలతోనే రాజకీయ ఆరంగేట్రం చేసి తన సత్తా చాటిన ప్రజా పార్టీ అధినేత చిరంజీవి(MEGASTAR -CHIRANJEEVI).
చిరంజీవి సినీ రంగ ప్రవేశానికి ముందు రంగస్థలంపై పలు నాటకాలు వేసిన విషయం తెలిసిందే. సరిగ్గా 50 ఏళ్ల క్రితం చిరంజీవి తన తొలి నాటకాన్ని ప్రదర్శించారు. ఆయన వేసిన తొల నాటకానికే ఉత్తమ నటుడి అవార్డు వచ్చిందని మురిసిపోతు నాటి ఫొటో సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తన ఆనందం పంచుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నర్సపూర్లో వైవీఎం కాలేజీలో 1974`75లో బీకాం సెకండ్ ఇయర్ చదువుతుండగా, రంగస్థలం మీద రాజీనామా నాటకాన్ని ప్రదర్శించారని పేర్కొన్నారు. కోట గోవిందరావు రచనలో నటించిన తనకు బెస్ట్ యాక్టర్గా అవార్డు వచ్చిందని, తొలి నటనకే అవార్డు రావడం ఆనందం ఉందని రాసుకొచ్చారు. 1974 నుంచి 2024 వరకు తన నట ప్రస్థానం ఎనలేని ఆనందాన్ని తెచ్చిపెట్టిందని ఆనందం వ్యక్తం చేశారు.
చిరంజీవి తన 50ఏళ్ల జ్ఞాపకాన్ని ఎక్స్లో పోస్టు చేయడంతో ఆయన అభిమానులు ఫిదా అయ్యారు. తమ కామెంట్లను పెడుతూ విషెష్ చెప్పారు. చిరంజీవి పోస్టు వైరల్గా మారింది.
- మరిన్ని లేటెస్ట్ న్యూస్, రివ్యూస్, ప్రత్యేక కథనాలకు జనదూత హోం పేజీని క్లిక్ చేయడం