ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టని మన్కిబాత్ దశాబ్దం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ పౌరుల నుంచి దశాబ్ద ఉత్సవా ల్లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నారు. ఈమేరకు ఆన్లైన్ ద్వారా క్విజ్ పోటీను నిర్వహిస్తోంది. పది సంవత్సరాల మన్ కీ బాత్పై లో అడిగే పది ప్రశ్నలకు 300 సెన్లలో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్విజ్ అక్టోబరు ఒకటో తేదీన ప్రారంభం కాగా ఈనెల(నవంబరు)10 మధ్యాహ్నం 11.45గంటలకు ముగియనుంది. పదేళ్ల మన్ కీ బాత్పై క్విజ్ ద్వారా ప్రత్యేక దేశ నిర్మాణ ప్రయాణంలో చేరాలని కేంద్రం కోరుతోంది. MyGov account తో మీ మెయిల్తో లాగిన్ అవగానే ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత ప్రశ్నలు వస్తాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, అస్సామీ, , కన్నడ, గుజరాతీ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం భాషల్లో పోటీ నిర్వహిస్తున్నారు. పోటీల్లో పాల్గొనేవారు భారతీయులై ఉండాలి. ప్రశ్నలన్నీ మల్టీపుల్ ఛాయిస్లో ఉంటాయి.
దేవ్ సే దేశ్, అవయవ దానం జీవిత బహుమతి,ఇండియా ది మదర్ ఆఫ్ డెమోక్రసీ,వంటి 10 సంవత్సరాల మన్ కీ బాత్లో చర్చించబడిన అంశాలు, వివిధ కార్యక్రమాలపై పౌరులకు వారి జ్ఞానాన్ని పరీక్షించుకోవడానికి ఈ క్విజ్ ఏర్పాటు చేశారు. హర్ ఘర్ తిరంగ, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్ వంటి అంశాలపై పోటీలో ప్రశ్నించనున్నారు.
విజేతలకు రివార్డులు
ఫస్ట్ ప్రైజ్ రూ.లక్ష, రెండో బహుమతి రూ.75వేలు, మూడో బహుమతి రూ.50వేలు అందించనున్నారు. అలాగే 200 మంది ఉత్తమ ప్రదర్శనకారులకు రూ.2,000 చొప్పున కన్సోలేషన్ బహుమతులు కూడా అందజేయనున్నారు.
––ఎక్కవగా చదివినవి––
మహేష్ బాబు కోసం రాజమౌళి వెతుకులాట
న్యూ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీయార్