AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారుతున్నాయా.. జనసేన, టీడీపీ మధ్య అంతర్గత కలహాలు ముమ్మరం అయ్యాయి.. ఆధిపత్య పోరు ఆరంభమైందా.. ఇరు పార్టీల శ్రేణుల్లో అంతరం పెరిగిందా.. అన్న అనుమానాలు ఆంధ్రనాట పెరిగిపోతున్నాయి. ఇందులోనూ కాస్త ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి. అంత ఈజీగా కొట్టిపారేయలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ఇందుకు ఆజ్యం పోస్తున్నాయి. టీడీపీ వర్గానికే పెద్ద పీట వేస్తున్నారని, జనసేన శ్రేణులను తక్కువ చూస్తున్నారని పలు ఘటనలు వెలుగులోకి రావడంతో అంతర్గత కుమ్ములాటలు ఆరంభమయ్యాయనే అనుమానాలకు బలం చేకూర్చినట్టయింది. వైసీపీ నేతలు కూడా ఇదే విషయాన్ని నొక్కినొక్కి చెబుతున్నారు. ప్రతిపక్షం కాబట్టి విమర్శలు మామూలే అని కొట్టి పారేసినా ప్రస్తుత పరిస్థితులు అదే నిజమనే భావన కలిగిస్తున్నాయి.
పవన్ కల్యాణ్ విమర్శలకు అర్థమేమిటి..
టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య గ్యాప్ పెరిగిందని ఓ వైపు జోరుగా ప్రచారం జరుగుతుంటే తాజాగా ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసినట్టయింది. సాక్షాత్తు రాష్ట్ర హోం మంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేయడం ఏపీలో కూటమిలో ఏదో జరుగుతోందన్న విషయం చెప్పకనే చెప్పినట్టయిందన్న ప్రచారం సాగుతోంది. ఒక దశలో హోం మంత్రిపై ఆవేశంతో ఊగిపోతూ నేను తలచుకుంటూ హోం మంత్రి పదవి తీసుకోవడం పెద్ద లెక్కకాదన్న హెచ్చరికలు దేనికి సంకేతమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే జనసేన శ్రేణులు మాత్రం పవన్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. కూటమిలో తమను చిన్న చూపు చూస్తున్నారనే విషయాన్ని బహిర్గతంగానే చెబుతున్నారు. తమపై టీడీపీ శ్రేణులు పెత్తనం చెలాయించడానికే చూస్తున్నారని వాపోతున్నారు.
అగ్గికి ఆజ్యం పోసిన పవన్ సంచలన వ్యాఖ్యలు…
టీడీపీ, సేనసేన పొత్తుపై కొత్త రచ్చకు దారితీస్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కూటమి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన హోం మంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఏపీలో రాజకీయం వేడెక్కింది. సోమవారం(నవంబరు –4) పిఠాపురం నియోజకర్గంలోని గొల్లప్రోలులో పవన కల్యాణ్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభలో పవన్ ప్రసంగిస్తూ అధికారుల్లో అలసత్వం పెరిగిపోయిందని, పోలీసు తీరు మరి అధ్వానంగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రేప్ చేస్తామంటూ కొందరు నేతలు బెదిరిస్తున్నా పోలీసులు ఏం చేస్తున్నారు.. అసలు హోం మంత్రి చేస్తున్నారంటూ సూటిగా ప్రశ్నించారు. కులం పేరుతో నేరగాళ్లను విడిచిపెడతారా.. పోలీసులు ఏం చేస్తున్నారు అంటూ పరోక్షంగా మళ్లీ హోం మంత్రినే టార్గెట్ చేశారు. తాను తలుచుకుంటే హోం మంత్రి తీసుకోగలనని, నేనే హోం మంత్రినైతే పరిస్థితితులు వేరుగా ఉంటాయని హెచ్చరించడం అంతర్గత యుద్ధం మొదలైందనే చర్చ మొదలైంది.
బీజేపీ ప్లాన్ను పవన్ అమలు చేస్తున్నారా..
ఇటీవల పవన్కల్యాణ్ తీరులో పెనుమార్పులు కనిపిస్తున్నాయి. పార్టీ కార్యకలాపాలను (AP POLITICS)మరింత ముమ్మరం చేశారు. అంతేకాదు హిందుత్వ వాదాన్ని కూడా గతంలోకంటే కాస్త ఎక్కువగా ఎత్తుకున్నట్టు కనిపిస్తోంది. తన కుటుంబాన్ని బయటికి అంతగా పరిచయం చేయని పవన్ ఆ మధ్య తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి వెంకన్నను దర్శించుకున్నారు. తన పిల్లలకు హిందుత్వం గురించి వివరించడం అందరికీ తెలిసిందే. నిన్న గొల్లప్రోలులో జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి, రేప్లు తగ్గాలంటే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగిలో వ్యవహరించాలంటూ పేర్కొన్నారు. అంటే బీజేపీ ప్లాన్లో భాగంగా పవన్ దూకుడు పెంచారా అన్న చర్చ ఆంధ్రనాట వినిపిస్తోంది.
–ఎక్కువ మంది చదివినవి.. మీరు క్లిక్ చేసి చదవండి–
మన మెదడు పెరుగుతోంది.. లాభమా .. నష్టమా..
తెలుగు వారిని అంత మాటంటావా.. నటి కస్తూరిపై ఫైర్
మబ్బుల్లో విహారం.. కొత్త చిక్కుతో విచారణం
ఇంటింటి సర్వే డేటా భద్రమేనా.. అసాంఘిక శక్తుల చేతిలోకి వెళ్తే..
కేదార్నాథ్ ఆలయం మూసివేత..ఎప్పుడు.. ఎందుకంటే..
విస్తరిస్తున్న షుగర్ డాడీ.. ఆ పనికోసమేనా..
మహేష్ బాబు కోసం రాజమౌళి వెతుకులాట
న్యూ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీయార్
బీజేపీలో ముసలం.. నెక్ట్స్ బాస్ ఎవరంటే..?
మెడికల్ వార్: ఆయుర్వేదం వర్సెస్ అలోపతి