CM REVANTH REDDY: అన్ని విధాలా వెనుకబడిన పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తుంటే కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని, అభివృద్ధిని అడ్డుకుంటే ఈ ప్రాంత ప్రజలు చూస్తూ ఊరుకోని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావును ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. రూ.110 కోట్లతో నిర్మించే అమ్మాపురం ఘాట్ రోడ్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను అట్టహాసంగా ప్రారంభించారు. కురుమూర్తి ఆలయానికి ఘాట్రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. కేసీఆర్ను గెలిపించి ఢిల్లీకి పంపితే పట్టించుకోలేదని, కనీసం ముఖ్యమంత్రిగా పదేళ్లు అధికారంలో ఉండి కూడా పాలమూరు జిల్లాను పట్టించుకోలేదని విమరించారు. కేసీఆర్ తన జిల్లాకు భారీగాని నిధులు కేటాయించకున్నా పట్టించుకోలేదన్నారు. కానీ, ఈ జిల్లా బిడ్డగా అభివృద్ధికి కృషి చేస్తుంటే అడ్డుపడడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ రెండు ముఖ్యమంత్రి చేసిన ఘనత పాలమూరిదని,అయినా ఆయన ఏనాడూ పట్టించుకోలదని ఆరోపించారు. తనను ముఖ్యమంత్రిని చేసిన గడ్డని అభివృద్ధి చేసి చూపిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏమైనా రాజకీయ కక్షలు ఉంటే తనపై చూడాలికానీ, అభివృద్ధి విషయంలో అడ్డుపడొద్దని కోరారు. తాను ఈ జిల్లాకు రావడం లేదని బాధపడొద్దని, తాను ఎక్కడ ఉన్నా నిత్యం జిల్లా అభివృద్ధి విషయంలో చర్చిస్తున్నట్టు పేర్కొన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను ఇచ్చిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుంటే ఈ ప్రాంత బిడ్డలు తనను క్షమించరన్నారు.
అమరరాజాతో ఉపాధి..
జిల్లాలో ప్రముఖ బ్యాటరీ తయారు సంస్థ అమరరాజ జిల్లా యువతకు ఉద్యోగావకాశాలు సుముఖంగా ఉందన్నారు. తాను విజ్ఞప్తి మేరకు వారు ముందుకువచ్చారన్నారు. ఈ ప్రాంత నిరుద్యోగులకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు. ఇందుకోసం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి కోసమే పాలమూరు యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ప్రతీ గ్రామానికి రోడ్డు..
CM REVANTH REDDY: జిల్లాని పల్లె, తండా లేకుండా ప్రతీ ప్రాంతానికి తారురోడ్డు వేస్తామన్నారు. ఎన్ని నిధులైనా మంజూరు చేస్తామని, ఇందుకు అర్ అండ్ బీ అధికారులు తగిన ప్రణాళికలు వెంటనే రూపొందించాలని వేదికపై నుంచి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎక్కడా మట్టిరోడ్డు కనబడొద్దన్నారు.
ప్రాజెక్టులను పూర్తి చేస్తాం..
పాలమూరు బిడ్డగా ఈ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని సీఎం(CM REVANTH REDDY) స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతోనే వలసకు కారణమన్నారు. కృష్ణమ్మ పారుతున్నా పరిస్థితి మారడం లేదన్నారు. జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి కృషి చేస్తానన్నారు. దేశంలో ఏ ప్రాజెక్టు నిర్మించినా అందులో పాలకూరి కూలీల శ్రమ ఉందన్నారు. తాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటే ఈ ప్రాంత యువత ఊరుకోదన్నారు. నారాయణ, కొడంగల్ ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామన్నారు.
కురుమూర్తి ఆలయానికి వచ్చిన తొలిసీఎం..
అనంతరం సీఎం కురుమూర్తి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. మెట్ల మార్గం గుండా గుట్టపై వెలిసిన స్వామివారిని సీఎం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ సిబ్బంది పూర్ణకుంభ స్వాగతం పలికింది. అనంతరం స్వామివారి శేష వస్త్రాలను అందించారు. కురుమూర్తి ఆయానికి వచ్చిన తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలిచారు. అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తూ కురుమూర్తి ఆలయానికి అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్య మంత్రి( వెంట మంత్రులు కోమటి రెడ్డి వెంకట్రెడ్డి, దామోదర రాజనర్సింహా ఉన్నారు.
–ఎక్కువ మంది చదివినవి.. మీరు క్లిక్ చేసి చదవండి–
మిస్త్ ఎర్త్ 2024 విజేతగా జెస్సికా లేన్
విషాదంలో సినీ ఇండస్ట్రీ.. ప్రముఖ నటుడు కన్నుమూత
నేడే బిగ్ ఫైల్.. ఇండియ బిగ్ ప్లాన్.. సౌతాఫ్రికాతో రెండో టీ20..
మహేష్ బాబు కోసం రాజమౌళి వెతుకులాట
వంద రేప్లు చేశాడు.. వారంతా టాప్ హీరోయిన్స్ అయ్యారు..
తెలుగు వారిని అంత మాటంటావా.. నటి కస్తూరిపై ఫైర్
ఎలాన్ ముస్క్ కు ట్రంప్ బిగ్ ఆఫర్..
సర్వే డేటా భద్రమేనా.. ప్రజలకు అనుమానాలు.. ముప్పు ఇదేనా..
వాటిని.. డ్రీమ్ గర్ల్ హేమామాలిని బుగ్గలుగా మారుస్తా..
టీడీపీ- జనసేన మధ్య ముదిరిన వార్
మన మెదడు పెరుగుతోంది.. లాభమా .. నష్టమా..
మబ్బుల్లో విహారం.. కొత్త చిక్కుతో విచారణం
ఇంటింటి సర్వే డేటా భద్రమేనా.. అసాంఘిక శక్తుల చేతిలోకి వెళ్తే..
కేదార్నాథ్ ఆలయం మూసివేత..ఎప్పుడు.. ఎందుకంటే..
విస్తరిస్తున్న షుగర్ డాడీ.. ఆ పనికోసమేనా..
న్యూ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీయార్
బీజేపీలో ముసలం.. నెక్ట్స్ బాస్ ఎవరంటే..?
మెడికల్ వార్: ఆయుర్వేదం వర్సెస్ అలోపతి
పడిపోతున్న ఇండియా గ్రాఫ్.. కానీ..