CM BIG PLAN: హైదరాబాద్‌లో హైడ్రా, మూసీ నది ప్రక్షాళనతో పేదల నుంచి ప్రభుత్వానికి కాస్త వ్యతిరేకత రావడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్రమత్తమైనట్టు కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీకి ఏమైనా నష్టం చేకూరుతోందా అన్నకోణంలో బాగానే కసరత్తు చేసినట్టుంది. ఈసారి పకడ్బందీగా ప్లాన్‌ బీతో ముందుకుసాగాలని రేవంత్‌ సర్కారు భావించినట్టు అర్థమవుతోంది. కాంగ్రెస్‌ పార్టీ మైలేజ్‌ పెంచడమేకాక, విపక్షాల నోరు మూయించేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి మం ప్లాన్‌ వేశారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌పైనే ఫోకస్‌ చేసిన సీఎం. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని విజయోత్సవ సభల పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని ప్లాన్‌ చేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనను ముమ్మరం చేశారు. అదే స్థాయిలో అభివృద్ధి పనులకు భారీగా నిధులను గుమ్మరిస్తున్నారు. ఈనెల 19 నుంచి డిసెంబరు 9 వరకు జిల్లాల్లో పర్యటించేందుకు సీఎం ఇప్పటికే స్కెచ్‌ వేశారు. దాంతో క్యాడర్‌లో కొత్త జోష్‌ నెలకొంటోంది. అసలే సంక్షేమ పథకాలు అందడంలేదని జనంలోకి వెళ్లలోని పరిస్థితిలో ఉన్న శ్రేణులకు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, జిల్లాలో సీఎం పర్యటనలతో వారి ముఖాలు వెలిగిపోతున్నాయి.

READ MORE: సెల్ఫ్‌గోల్‌లో కాంగ్రెస్‌.. సమీపిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు

వరంగల్‌కు నిధుల వరదతో…

తాజాగా (నవంబరు19)న వరంగల్‌ పర్యటనలో సీఎం వరాల జల్లు కురిపించారు. భూగర్భ డ్రైనేజీ కోసమే రూ.4,170కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. మామునూరులో ఎయిర్‌పోర్ట్‌, కాకతీయ టెక్స్‌టైల్‌ పార్క్‌ ఇలా మొత్తం రూ.4,601.15కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వరంగల్‌ మెట్రో రైల్‌కు రూ.1,341కోట్ల అంచనా వ్యయంతో రూపకల్పన అదనం. మొత్తానికి రెండో రాజధాని వరంగల్‌ అని పేర్కొంటూనే.. ఆ మేరకు నిధులు కేటాయిస్తుండడంతో ఇన్నాళ్లు నిరాశతో ఉన్న వరంగల్‌ వాసుల్లో ఒక్కసారిగా సర్కారుపై సానుకూల వాతావరణం పెరిగింది.

READ MORE: తిరుమ‌ల ర‌హ‌స్యాలు ఇవిగో.. స్వామి వారి మహిమ.. లేక‌..

మొన్న అమ్మాపూర్‌.. నేడు వేములవాడ… రేపు..

CM BIG PLAN: సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల మహబూబ్‌నగర్‌ జిల్లా అమ్మాపూర్‌ ఘట్‌రోడ్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం కోసం రూ.110 కోట్లు మంజూరు చేశారు. అక్కడి పెండింగ్‌ సాగు నీటి ప్రాజెక్టుల పూర్తికి త్వరలోనే ప్రణాళిక రూపొందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు వేములవాడ అభివృద్ధి కోసం రూ.127.65కోట్లను మంజూరు చేశారు. నేడు(నవంబరు 20)న వేములవాడలో పనులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అలాగే ముసీ పరీవాహక ప్రాంతాల్లో భారీగా నిధులు కేటాయించేందుకు సీఎం బిగ్‌ ప్లాన్‌ వేసినట్టు తెలుస్తోంది. ఆయా ప్రాంతాలకు నిధుల వరద పారించి, పలు అభివృద్ధి పనులను చేపట్టి వచ్చే స్థానిక ఎన్నికల్లో తమ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులను పెద్దసంఖ్యలో గెలుపించుకోవాలనే ప్లాన్‌లో ఉంది.

విపక్షాలకు షాక్‌..

జిల్లాలకు భారీగా నిధులు కేటాయిస్తుండడం, వరసగా జిల్లాల పర్యటనలు చేపడుతుండడంతో విపక్షాలకు సీఎం జలక్‌ ఇచ్చినట్టయింది. హైదరాబాద్‌పై ఎగిరిపడుతున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు ఈ దెబ్బతో షాక్‌ తగిలినట్టయింది. కాంగ్రెస్‌ ఇదే జోరు కొనసాగిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీలకు ఎదురుదెబ్బ తప్పదు. అంతేకాదు తెలంగాణ సెంటిమెంట్‌ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సీఎం(CM BIG PLAN)అండ్‌ కో భారీ కసరత్తు చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *