HIV MEDICINE: హెచ్‌ఐవీకి మందు దొరికినట్టేనా.. క్లినికల్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌ అయిందా.. త్వరలోనే అన్ని దేశాల్లో అందుబాటులోకి రానుందా.. అంటే అవుననే అంటున్నారు మేధావులు. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి ఎయిడ్‌. ఎయిడ్స్‌ అంటే (అక్వైర్డ్‌ ఎమ్యూనో డెఫీసియెన్సీ) ఇది హెచ్‌ఐవీ (హుమన్‌ ఇమ్యూనోడెఫిసియన్సీ వైరస్‌తో సోకుతుంది. ఇప్పటివరకు ఈ వ్యాధికి మందు లేకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా వేలాదిమంది మృత్యువాతపడ్డారు. ఇప్పటికీ ఎంతోమంది ఈ మహమ్మారి బారినపడి నరకయాతన అనుభవిస్తున్నారు. ఎయిడ్స్‌కు మందు లేకపోవడంతో నియంత్రణ మందులతో ఆయుష్షును పెంచుతూ వస్తున్నారు వైద్యులు. ఎట్టకేలకు శాస్త్రవేత్తల కలలు ఫలించాయనే తెలుస్తోంది. ఎట్టకేలకు ఈ మహమ్మారికి మందును కొనుగొన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే క్లినికల్‌ ట్రయల్‌రన్‌ విజయవంతమైనట్టు తెలుస్తోంది.

READ MORE: తిరుమ‌ల ర‌హ‌స్యాలు ఇవిగో..

మందును కనుగొన్న గిలియడ్‌కంపెనీ..

HIV MEDICINE: ఎయిడ్స్‌ వ్యాధి నివారణకు గిలియడ్‌ కంపెనీ కొన్నేళ్ల నుంచి పరిశోధనలు చేస్తోంది. ఎట్టకేలకు వారి శ్రమ ఫలించినట్టు పేర్కొంది. ఈ కంపెనీ గల 35 ఏళ్ల నుంచి వ్యాధిపై నిరంతర పరిశోధనలు చేస్తూనే ఉంది. ఇప్పటికే తొలుత సింగిల్‌ టాబ్లెట్‌, తర్వాత ప్రీ ఎక్స్‌పోజర్‌ ప్రొఫిలాక్సిస్‌ కోసం యాంటీరెట్రో వైరల్‌తో సహా 12 హెచ్‌ఐవీ మందులను అభివృద్ధి చేసినట్టు సంస్థ పేర్కొంది. గలియడ్‌ కంపెనీ మాంటీవైరల్‌ వెసాటోలియోడ్‌తో కలిపి వ్యాక్సిన్‌పై అధ్యయం చేయడానికి ఎలిక్స్‌ తో 2018లో భాగస్వామ్యం చేశారు. దశ–2 ట్రయల్‌లో బలమైన టీ–సెల్‌ ప్రతిస్పందనను చూపినట్టు తెలుస్తోంది. కాగా, గిలియడ్‌ కంపెనీ లెనాకాపవిర్‌ (సన్‌లెన్‌కా బ్రాండ్‌)తో ఏడాది రెండు టీకాలు తీసుకుంటే ఎయిడ్స్‌ను పూర్తిగా నివారించవచ్చని తెలిపింది. కంపెనీ సుమారు ఐదు వేల మంది మహిళలపై జరిపిన క్లినికల్‌ ట్రయల్స్‌ వందశాతం ప్రభావితం చూపినట్టు వెల్లడించింది. ఈ మందులు ఎయిడ్స్‌ను నివారించడంలో కీలక మలుపని కంపెనీ పేర్కొంటోంది. ఇప్పటికే అమెరికా, కెనెనాడు, ఐరోపా వంటి దేశాల్లో వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది. 120 పేద దేశాల్లో తక్కువ ధరకు అందిస్తామని కంపెనీ పేర్కొంటోంది.

తెలంగాణలో 1.58 లక్షల మంది

తెలంగాణలో 1.58 లక్షల మంది హెచ్‌ఐవీ బాధితులు ఉన్నారు. వారిలో 1.54లక్షల మంది బాధితులు 15 ఏళ్లు పైడినవారే ఉన్నారు. 2023లో తెలంగాణ వ్యాప్తంగా 2820 మంది చనిపోయినట్టు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 421 మంది చనిపోయారు.

READ MORE: చ‌లో శుక్రయాన్ !

భారతదేశంలో..

HIV MEDICINE: భారతదేశంలో ప్రస్తుతం సుమారు 25 లక్షల మంది (2.5 మిలియన్లు) హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌తో బాధ‌ప‌డుతున్నారు. గ్లోబల్ డేటా ప్రకారం, భారతదేశంలో హెచ్‌ఐవీ వ్యాప్తి 0.2% స్థాయిలో ఉంది. దేశవ్యాప్తంగా 2023 వరకు హెచ్‌ఐవీ రేటు 44% తగ్గడం, అలాగే ఎయిడ్స్ మృతుల సంఖ్యలో 79% తగ్గుదల ఉంది. హెచ్‌ఐవీ పాజిటివ్ వ్యక్తులు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఉండ‌డం క‌ల‌వ‌ర పెడుతోంది. కేంద్ర ప్రభుత్వం 725 ఆర్టీ సెంటర్లు ద్వారా ఉచిత చికిత్సను అందిస్తోంది. 2023లో 16.06 లక్షల మందికి చికిత్స అందించింది.

READ MORE: ఇండియా..  ట‌మాటా వైన్ త‌యారీ ..

SILKSMITHA: మ‌ళ్లీ రాబోతున్న సిల్క్‌స్మిత

CHIRANJEEVI : మెగస్టార్‌ చేతికి రక్తపుమరక.. టాలీవుడ్‌ షాక్‌..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *