INDIA SPACE CENTER: అంత‌రిక్షంలో ఇండియా త‌న స్థానాన్ని అగ్ర‌దేశాల‌కు ధీటుగా నిలిచేందుకు రెడీ అయింది. అప్ప‌టికే అంత‌రిక్షంలో అద్భుత విజ‌యాలు సాధిస్తూ ప్ర‌పంచ దేశాల దృష్టిని త‌న వైపు తిప్పుకుంది. ఇప్పుడు మ‌రో చ‌రిత్ర లిఖించేందుకు సిద్ధ‌మ‌యింది. అమెరికా, చైనాల‌కు మాత్ర‌మే సాధ్య‌మైన అంత‌రిక్షంలో స్పేస్ సెంట‌ర్ ఏర్పాటు చేస్తే, ఇప్పుడు భార‌త్ కూడా స్పేస్ సెంట‌ర్ ఏర్పాటుకు రెడీ అయింది. ఇదే జ‌రిగితే స్పేస్ సెంట‌ర్ ఉన్న మూడో దేశంగా ఇండియా అంత‌రించ‌నుంది. ఈమేరకు శాస్త్ర వేత్త‌లు ప్ర‌ణాళిక‌లు ముమ్మ‌రం చేశారు. అంత‌రిక్షంపై ఫోక‌స్ చేసిన ఇండియా 2035 నాటికి సొంత స్పేస్‌ స్టేషన్ ఏర్పాటు అడుగులు వేస్తోంది. ఇదే విష‌యాన్ని తాజాగా కేంద్ర సెన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్ వెల్ల‌డించ‌డంతో ప్రాజెక్టు ప‌నులు శ‌ర‌వేగంగా సాగుతున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

READ MORE: చ‌లో శుక్రయాన్ !

చంద్రుడికి భార‌తీయుడు..
INDIA SPACE CENTER: ఓవైపు స్పేస్ సెంట‌ర్ ఏర్పాటుకు స‌మాయ‌త్త‌మ‌వుతూనే.. 2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు కాలు మోపేందుకు స‌న్నాహాలు చేస్తోంది. తిరువనంతపురంలో గగన్‌యాన్‌ మిషన్‌ను సంబంధించిన వ్యోమగాముల పేర్లను ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. 2035 నాటికి స్పేస్‌ స్టేషన్ ఏర్పాటు చేసి, 2040 నాటికి తొలుత ముగ్గురు వ్యోమగాములు, ఆ త‌ర్వాత ఆరుగురు వ్యోమ‌గాములను పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. బెంగళూరులోని యూఆర్‌రావు శాటిలైట్‌ సెంటర్‌లో జరిగిన కన్నడ సాంకేతిక సదస్సులో ఇందుకు సంబంధించిన ప‌లు విష‌యాలు వెల్ల‌డ‌యిన విష‌యం తెలిసిందే. బీఏఎస్‌ అనేది లైఫ్‌ సైన్సెస్‌, మెడిసిన్‌ రంగాల్లో శాస్త్రీయ పరిశోధనలకు మద్దతు ఇచ్చేందుకు, అంతరిక్ష పరిశోధనలను మెరుగుపరిచేందుకు భారత్‌ అభివృద్ధి చేస్తున్న మాడ్యులర్‌ స్పేస్‌ స్టేషన్‌. తొలి మాడ్యుల్‌ 2028లో ఎల్‌వీఎం3 వాహకనౌక ద్వారా ప్రారంభించనున్నట్లు భావిస్తున్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత స్పేస్‌స్టేషన్‌ రూపుదిద్దుకుంటుంది.

ప్రస్తుతం విశ్వంలో ఒకే స్పేస్‌స్టేషన్‌ ఉన్నది. దీన్ని నానా అనేక దేశాల సహకారంతో నిర్మించింది. ప్రస్తుతం చైనా సైతం సొంతంగా INDIA SPACE CENTER: ఇంటర్‌నేషనల్‌ స్పేస్‌స్టేషన్‌ను నిర్మిస్తున్నది. భారత్‌ సైతం బీఎస్‌ఏని నిర్మిస్తే మూడోదేశంగా నిలువనున్నది. ఇప్ప‌టికే ఈ స్టేషన్‌కు భారత అంతరిక్ష కేంద్రంగా నామకరణం చేశారు. భవిష్యత్తులో అంతరిక్ష యాత్రల కోసం మైక్రోగ్రావిటీ, మానవ ఆరోగ్యం, లైఫ్‌ సస్టెయినింగ్‌ టెక్నాలజీస్‌పై అధ్య‌యనం చేయ‌నున్నారు. ఇప్పటికే అమెరికా, చైనా దేశాలు తమ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపుతుండ‌గా, తాజాగా భారత్ వ్యోమ‌గాముల‌ను పంపేందుకు రెడీ అవుతోంది.

READ MORE: ఎడారి మాయం.. సౌదీ అరేబియాలో వింత‌..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *