SSC EXAM: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2025లో జరిగే టెన్త్ వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రధాన పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు కొనసాగుతాయి. అలాగే, ఏప్రిల్ 3, 4, తేదీల్లో ఒరియంటల్ సబ్జెక్టుల పరీక్షలు జరుగుతాయి. అన్ని పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతాయి. సైన్స్ను రెండు భాగాలుగా విభజించారు. భౌతిక, రసాయన శాస్త్రాలను వేర్వేరు రోజుల్లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈరెండు పరీక్షలు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే నిర్వహిస్తారు. గత సంవత్సరం గ్రేడింగ్ విధానం అమలుచేశారు. ఇటీవల దానిని తొలగించిన విషయం తెలిసిందే. దాని స్థానంలో మార్కుల పద్ధతిని తీసుకొస్తామని సర్కారు జీవో జారీ చేసిన విషయం విదితమే. ఈసారి వంద శాతం ఉత్తీర్ణత తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు.
READ MORE: ఒళ్లుమండి పెళ్లి నిరాకరించిన ఐపీఎస్..
SSC EXAM: ఈ సంవత్సరం కూడా ఇంటర్నల్ మార్కులు ఒక్కో సబ్జెక్టుకు 20 మార్కుల విధానం యథావిధిగా కొనసాగనుంది. విద్యార్థులు జవాబులు రాసేందుకు 24 పేజీల బుక్లెట్ను ఇవ్వనున్నారు. కాగా, ఇంగ్లిష్, సైన్స్ మినహా అన్ని సబ్జెక్టుల ఆబ్జెక్టివ్ పేపర్లోని పార్ట్–బి చివరి 30 నిమిషాల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఫిజికల్, బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్కు సంబంధించిన ఆబ్జెక్టివ్ పేపర్కు మాత్రం చివరి 15 నిమిషాల్లో జవాబులు రాయాల్సి ఉంటుంది.
READ MORE: సిరియాల ఇజ్రాయిల్ మధ్య వార్ ఎందుకు?
SSC EXAM: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ (2025)
మార్చి 21: ప్రథమ భాష (తెలుగు)
మార్చి 22: ద్వితీయ భాష (హిందీ)
మార్చి 24: ఇంగ్లీష్
మార్చి 26: గణితం
మార్చి 28: సైన్స్ పార్ట్–1 (భౌతిక శాస్త్రం)
మార్చి 29: సైన్స్ పార్ట్–2 జీవ శాస్త్రం
ఏప్రిల్ 2: సాంఘిక శాస్త్రం
ఏప్రిల్ 3: ఓరియంటల్ పేపర్–1, ఒకేషనల్ కోర్సు,
ఏప్రిల్ 4: ఓరియంటల్ పేపర్–2
READ MORE: సంధ్య థియేటర్కు పోలీసుల షాక్