Mahakumbha mela-sagaramathanam

Mahakumbha mela: హిందువుల అత్యంత పవిత్రమైనది కుంభమేళ. ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరుపుకునే దాన్ని మహా కుంభమేళ అంటారు. ఆరు నెలలకు ఒకసారి అర్ధ, నాలుగేళ్లకోసారి కుంభమేళా నిర్వహిస్తారు. అదేవిధంగా 144 ఏళ్లకు ఓసారి జరిగేదానిని మహా కుంభమేళగా హిందువులు జరుపుకుంటారు. దీనినే పూర్ణ కుంభమేళా అంటారు. ఎందుకంటే 12ఏళ్ల ఒకసారి చొప్పున 12 పుష్కరాల తర్వాత జరిగే పుష్కరం ఇది. భూలోకంలో ఒక ఏడాది అంటే దేవతలకు ఒక రోజుతో సమానం. ఈ లెక్కన సాగరమథనం సురులు, అసురుల మధ్య 12ఏళ్లపాటు సాగింది. అందుకే 12ఏళ్లకు మేళా నిర్వహిస్తారు. అదే దేవతలకు 12ఏళ్లు అంటే భూలోకంలో 144 ఏళ్లతో సమానం. ఆరోజు పూర్ణ కుంభమేళా జరుపుతారు.

అమృతాన్ని కాపాడింది వారే..

Mahakumbha mela: అమృతం కోసం జరిగిన పోరాటంలో చంద్రుడు అది వృథా కాకుండా పాకాడాడు. గురువు అమృత కళశాన్ని కాపాడితే, సూర్యుడు అది భగ్నం కాకుండా రక్షించాడు. శని ఇంద్రుడి కోపం నుంచి సురక్షితం కాపాడాడు. విష్ణమూర్తి సాయంతో దేవతలు అమృతాన్ని సేవించారు. అందుకే ఆరోజు చేసే స్నానాన్ని రాజస్నానం అంటారు. ఆర ోజు నదికి అమృత లక్షణాలు వస్తాయని, ఆ వేళ స్నానం చేస్తే మంచిదని భక్తుల విశ్వాసం. ఈ గ్రహ సంచారం కలిపి ప్రతీ సమయంలో కుంభమేళా నిర్వహిస్తారు. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగలో సుమారు 850 ఏళ్ల క్రితం ఆదిశంకారాచార్యులు మేళాను ప్రారంభించినట్టు చరిత్రకారులు చెబుతుంటారు.

ఆ ప్రాంతాల్లో అమృతం..

Mahakumbha mela: అమృతం పుట్టాక శ్రీమహా విష్ణు దానిని తీసుకెళ్తున్న సమయంలో ఉత్తర ప్రదేశ్‌లోని హరిద్వార్‌, ప్రయాగ, మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జయిని, నాసిక్‌లో అమృతాన్ని చిలకరించాడని పురాణాలను బట్టి తెలుస్తోంది. అందుకే ఆ ప్రాంతాల్లో కుంభమేళాలను నిర్వహించడం ఆచారంగా వస్తోంది. అందుకే ప్రతీ నాలుగేళ్లు, 12 ఏళ్లకోసారి హరిద్వార్‌, ప్రయాగ, ఉజ్జయిని, నాసిక్‌లో మేళా హిందువులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

హరిద్వార్‌లో..

సుర్యుడు మేష రాశిలో ఉన్నప్పుడు హరిద్వార్‌లోని గంగానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఆ సమయంలోనే ఇక్కడ కుంభమేళా జరుగుతోంది.

ఉజ్జయిని..

బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో మేళా నిర్వహిస్తారు.

నాసిక్‌..

సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్‌లో కుంభ మేళాలా నిర్వహిస్తారు. అంతేకాదు, రాముడు వనవాస సమయంలో అప్పటి దండకారాణ్యమైన నాసిక్‌లో గడిపినట్టు పురాణాలు చెబుతున్నాయి.

ప్రయాగ…

బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మరకరాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో కుంభ మేళాను ప్రయాగలో నిర్వహిస్తారు. మహాభారతం, భాగవతం, రామాణయంలోనూ ఈ కుంభ మేళా ప్రస్తావన కనిపిస్తుంది.

ప్రస్తుతం ప్రయాగలో మహాకుంభమేళా పవిత్రమైవి..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ మహాకుంభమేళాకు రెడీ అయింది. ఈనెల 13 నుంచి ఫిబ్రవరి 26వరకు కొనసాగనుంది. ఇందులో ఆరు రోజులు రోజులు పవిత్రమైవిగా పండితులు పేర్కొంటున్నారు. జనవరి 13 పుష్యపూర్ణిమ, 14 మరక సంక్రాంతి, 29 మోని అమావాస్య, ఫిబ్రవరి 3 వసంత పంచమి, 12 మాఘ పూర్ణిమ, 26న మహా శివరాత్రి.

READ MORE: అవమానకర ఓటమి

READ MORE:   హైడ్రా మరో కీలక నిర్ణయం

READ MORE: జ‌పాన్ లో వైర‌స్ విధ్వంసం.. ఇండియాకు..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *