First Gau Mutra Dairy: అన్ని గ్రామాల్లో ఉదయం పాల బిందెలు, క్యాన్లతో పాడి రైతులు హడావుడిగా కనిస్తుంటారు. కానీ, ఆ గ్రామంలో మాత్రం రోజంతా గో మూత్రం సేకరణతో సందడిగా కనిపిస్తారు. మూత్రం సర్వరోగ నివారిణి అంటూ వృద్ధులు చెబుతుంటారు. ఆయుర్వేదంలో గో మూత్రం ఎంతో కీలకమైనది. అంతేకాదు, దానిని అమృతంతో పోలుస్తారు. గుజరాత్ రాష్ట్రం బనస్కాంత జిల్లా భాభర్ తాలూకాలోని అబాలా గ్రామంలో ప్రపంచంలోనే మొట్టమొదటి గౌ మూత్ర డైరీని స్థాపించారు. ధేనుప్రసాద్ అగ్రోవట్ పేరుతో ప్లాంట్ను ఏడేళ్ల క్రితం శ్యామ్ పురోహిత్ స్థాపించారు. ప్లాంట ఏర్పాటు చేసిన తొలినాళ్లో ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా దేశవాళీ ఆవులను సంరక్షించడంలో ఇవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కోట్లలో వ్యాపారం..
First Gau Mutra Dairy: అబాలా కేంద్రంలో గో మూత్ర విక్రయంతో కోట్ల రూపాయల వ్యాపారం సాగుతోంది. గ్రామంలో ఎక్కువ మంది రైతులు గోవులను పోషిస్తూ జీవినం సాగిస్తున్నారు. కేవలం పాల విక్రయం ద్వారా సరైన ఆదాయం రావడం లేదని గుర్తించారు. దాన్ని అధిగమించేందుకు అక్కడి వారి గో మూత్రంతో ఎరువుల తయారుకు పూనుకున్నారు. అది సక్సెస్ కావడంతో రైతులకు అటు పాలు, ఇటు గో మూత్రం ద్వరా ఆదాయం పొందుతున్నారు. ఇతర రాష్ట్రఆలకు గో మూత్ర ఉత్పత్తులను విక్రయిస్తూ అధిక లాభాలు ఘడిస్తున్నారు.
సేంద్రియ ఎరువు..
First Gau Mutra Dairy: అబాలలో రోజుకు దాదాపు 1000 లీటర్ల ఆవు మూత్రాన్ని సేకరిస్తున్నారు. జిల్లాలోని 700 మందికి పైగా రైతులు ఈ డెయిరీకి గోమూత్రాన్ని సరఫరా చేస్తున్నారు. లీటరుకు రూ. 5 వసూలు ఇస్తున్నారు.
ఒక ఆవు రోజుకు 15 నుంచి 16 లీటర్ల మూత్రాన్ని ఇస్తుంది. ఫలితంగా పశువుల పెంపకందారులు రూ. రోజుకు 75 లీటర్ల చెప్పున డెయిరీకి విక్రయిస్తున్నారు. మూత్రాన్ని ప్రాసెసింగ్ చేస్తున్నారు. గో మూత్రం సేకరించిన ధునుప్రసాద్ అగ్రో వాట్ సంస్థ అధిక ఊష్ణోగ్రత వద్ద ఆగా మరిగించి, పొటాషియం, అమోనియా, మైక్రో న్యూట్రియంట్లను వేరు చేస్తారు. తర్వాత వాటితో సంప్రదాయ ఎరువుల తయారుకు ఉపయోగిస్తారు. మొదట 50 లీటర్లతో ప్రారంభించి, ఇప్పుడు 1000 లీటర్లు సేకరిస్తున్నట్టు గౌముత్ర డెయిరీ నిర్వాహకుడు మదన్భాయ్ పురోహిత్ చెబుతున్నారు. ఆవు మూత్రం ఉత్పత్తులు పంజాబ్, హర్యానా, కాశ్మీర్, మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో విక్రయిస్తున్నారు.
అబాలా గ్రామ స్వరూపం..
First Gau Mutra Dairy: జనగణన 2011 సమాచారం ప్రకారం అబాలా గ్రామ విస్తీర్ణం 712.7 హెక్టారులు. మొత్తం జనాభా 1,753 మంది ఉన్నారు. వీరిలో పురుషుల జనాభా 900 కాగా స్త్రీ జనాభా 853. అబాల గ్రామం అక్షరాస్యత రేటు 44.67% అందులో 58.00% పురుషులు మరియు 30.60% స్త్రీలు అక్షరాస్యులు. అబాల గ్రామంలో దాదాపు 281 ఇళ్లు ఉన్నాయి.
READ MORE: ఇండియాలో తొలికేసు నమోదు
READ MORE: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 312 కి.మీ.
READ MORE : ఇండియా 6జి విప్లవం
READ MORE: మన మెదడు పెరుగుతోంది.. ఇప్పుడెల?
మీకు తెలియకుండానే మీ నంబర్ను వాడుతున్నారు..