Hmpv virus in india:ఇండియాలో కొత్త వైరస్ విస్తరిస్తోంది. ఇప్పటికే బెంగుళూరు, 3, 8 ఏళ్ల చిన్నారులకు వైరస్ సోకగా, గుజరాత్లో మరో కేసు నమోదైంది. దీంతో ఇండియాలో మెటాప్న్యూ మో వైరస్ (హెచ్ ఎంపీవి)కేసుల సంఖ్య మూడుకు చేరింది. దాంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్కు పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో ఈ వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతోందని అక్కడి మీడియా చెబుతోంది. క్రమక్రమంగా హెచ్ఎమ్పీవీ వైరస్ ఇతర దేశాలకు వేగంగా వ్యాపిస్తోంది. భారత్లో మూడో పాజిటివ్ కేసుతో ఆందోళన నెలకొంది. గుజరాత్ రాష్ట్రంలో రెండు నెలల చిన్నారికి వైరస్ పాజిటివ్గా తేలింది. ఆ శిశువు అహ్మదాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. శిశువు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బాధిత కుటుంబానికి రాజస్థాన్లోని దుంగార్పూర్గా తెలిసింది.
అప్రమత్తమైన కర్నాటక ప్రభుత్వం
Hmpv virus బెంగుళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్ ఎంపీవీ పాజిటివ్ రావడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. బాప్టిస్ట్ ఆస్పత్రిలో 3, 8 నెలల చిన్నారులకు పాజిటివ్గా రావడంతో వైద్యారోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు స్పందించారు. వెంటనే ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మరియు వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించారు.
2001లోనే బయటపడిన వైరస్ లక్షణాలు..
హ్యూమన్ మెటా న్యూమోవైరస్ను 2001లో గుర్తించారు. 2011-12లో అమెరికా, కెనడా, ఐరోపా దేశాల్లో ఈ కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఈ వైరస్ సోకితే దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియా వంటి సమస్యలకు దారి తీయొచ్చని వైద్యలు చెబుతున్నారు. వైరస్ బారిన మూడు నుంచి ఆరు రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. దగ్గు, తుమ్ముల నుంచి వచ్చే తుంపరల ద్వారా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వారినిగానీ, వైరస్తో కలుషితమైన వస్తువులనుగానీ తాకి.. ఆ చేతులతో ముక్కు, మూతి, కళ్లను తాకితే వైరస్ సోకుతుంది. వృద్ధులు, పిల్లలు, , రోగ నిరోధక తక్కువగా ఉన్న వారికి వైరస్ త్వరగా సోకే ప్రమాదముంద.
హెచ్ఎంపీవీ ఎలా నివారించాలి?
తరచూ సబ్బుతో చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. అనారోగ్యంతో ఉన్నవారికి కాస్త దూరం పాటించాలి. అలాగే ఎక్కువగా ట్టుకునే వస్తువులను శానిటైజ్ చేయాలి. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ముక్కు, నోరుకు కర్చీఫ్ను అడ్డుపెట్టుకోవాలి.
ఇండియాలో..
క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో లాక్డౌన్ తప్పదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా సమయంలో తీవ్ర ఇబ్బందులు మళ్లీ ఎక్కడ వస్తుందోనని జంకుతున్నారు. ఈనెలాఖరు వరకు వైరస్ ఇండియాకు వైరస్ వచ్చే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ ఇప్పటికే మూడు కేసులు నమోదవడం బాధిస్తోంది. మరోవైపు భారత ప్రభుత్వం వైరస్ వ్యాప్తిపై అప్రమత్తమైంది.
READ MORE: ఇండియాలో తొలికేసు నమోదు
READ MORE: జపాన్ లో వైరస్ విధ్వంసం.. త్వరలోనే ఇండియాకు