తెగులు సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించి తెలుగువారిపై ఓ నటి నోరుపారేసుకుంది. సీనియర్‌ తమిళ నటి, బీజేపీ నాయకురాలు కస్తూరి శంకర్‌ తెలుగుజాతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో తెలుగునాట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు పాతికేళ్లుగా తెలుగు సినీరంగంలో వెలుగొందడమేకాక, బుల్లి తెరపై పలు సీరియల్స్‌లో కూడా ఆమె నటిస్తోంది. అలాగే రియాలిటీ షోలలో అలరిస్తోంది నటి కస్తూరి. ప్రజా ప్రతినిధి అయి ఉండీ బాధ్యతగా మెలగాల్సిన కస్తూరి ఇలా నోరు పారేసుకోవడంతో తెగులు వారు సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాంగ్‌వార్‌తో తెలుగు తెరపై అడుగుపెట్టిన కస్తూరి తెలుగు, రథసారథి, చితక్కొట్టుడు, కలెక్టర్‌గారు, అన్నమయ్య, గాడ్‌ఫాదర్‌ వంటి పలు చిత్రాల్లో నటించారు.

వివాదానికి కారణం..

తమిళనాడులో కస్తూరి మాట్లాడుతూ బ్రాహ్మణులకు మద్దతు తెలిపే విషయంలో ద్రావిడ సిద్ధాంతాలపై ఆమె విమర్శలు గుప్పించే క్రమంలో తెలుగువారి ప్రస్తావన తీసుకువచ్చారు. తమిళనాడులో ఓ వివాదం ఏళ్ల నుంచి రగులుతోంది. అదే బ్రాహ్మణులు తమిళులు కాదనే వాదన తరచూ వివాదస్పదంగా మారుతోంది. ఈ అంశంపై ఆమె వివరించే క్రమంలో 300ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర స్ర్తీలకు సేవ చేసేందుకు తెలుగువారు వచ్చారని, రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చినవారు తమది తెలుగు జాతి అంటూ ఘంటాపథంగా చెబుతుంటే.. మరి ఎప్పుడో వచ్చి.. ఇక్కడ స్థిరపడిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. అయితే బ్రాహ్మణులు తమిళులు కాదని చెప్పడానికి మీరెవరంటూ నిలదీశారు. ఆస్తులు లూటీ ఈచేయకుండా, ఇతరుల భార్యలపై మోజు పడకుండా, బహు భార్యత్వాన్ని వీడాలని చెబుతుండడంతోనే బ్రాహ్మణులపై తమిళనాడులో వారికి వ్యతిరేక ప్రచారం సాగుతోంది అంటూ కస్తూరి శంకర్‌ వ్యాఖ్యానించారు. ఇదే తెగులు ప్రజల ఆగ్రహానికి కారణమైంది. బ్రాహ్మణులను కాపాడేందుకు, తమిళలను విమర్శించేందుకు తమకు అభ్యంతరం లేదని, మధ్యలో తెలుగు ఆడపడుచులను చులకన చేసి మాట్లాడడం ఏంటంటూ నెటిజన్స్‌ అగ్గిమీదగుగ్గిలం అవుతున్నారు. కస్తూరి ఇకనైనా తెగులు వారికి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ కూడా వస్తోంది. మరి ఈ విషయంపై కస్తూరి ఎలా రియాక్ట్‌ అవుతుందోవేచి చూడాలి.

గతంలోనూ వివాదస్పద వ్యాఖ్యలు..

కస్తూరి నోరు పారేసుకోవడం ఇదేం కొత్తకాదు. గతంలోనూ సోషల్‌ మీడియాలో ఓ ట్వీట్‌ చేసి కాంట్రవర్సికీ తెరలేపారు. సరోగతి పద్ధతిపై మాట్లాడుతూ చర్చకు తెరలేపారు. అప్పట్లో నటి నయనతార, విఘ్నేశ్‌శివన్‌ సరోగతి పద్ధతిలో తల్లిదండ్రులు అయ్యారు. వారిని ఉద్దేశించి ఓ ట్వీట్‌ చేశారు. 2022లో దేశంలో సరోగసి పద్ధతి అమల్లోకి వచ్చిందని, ఆరోగ్య, క్లిష్ట పరిస్థితిలో తప్ప ఈ పద్ధతి సరైంది కాదనంటూ ట్వీట్‌ చేశారు. దీంతో నయనతారు అభిమానులు కస్తూరిపై గరంగరం అయ్యారు.

టాప్‌లెస్‌ ఫొటో షూట్‌తో మరో కాంట్రవర్సీ..

కస్తూరి ఓ ఫొటో షూట్‌ దేశ వ్యాప్తంగా కాంట్రవర్సికి దారితీసింది. 2014లో జెడ్‌ బెల్‌ పుస్తకం బాడీస్‌ ఆఫ్‌ మదర్స్‌: ఏ బ్యూటిఫుల్‌ బాడీ ప్రాజెక్టులో భాగం ఆమె అర్ధనగ్న ఫోటో షూట్‌ చేయడం అప్పట్లో వివాదాస్పదమైంది.

కస్తూరి కెరీర్‌..

కస్తూరి 1970లో జన్మించగా, 2000లో డాక్టర్‌ రవికుమార్‌ను వివాహం చేసుకుంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. తమిళం, తెలుగు, మళయలం, కన్నడ భాషా చిత్రాల్లో నటిస్తోంది. పలు భాషల్లో సీరియల్స్‌లో కూడా లీడ్‌రోల్‌ చేస్తోంది. ప్రస్తుతం బీజేపీలో చేరి ప్రజా సేవ చేస్తున్నారు. కస్తూరి మద్రాసులో ఉన్నత పాఠశాలలో చదువుతుండగానే మోడల్‌లో అడుగుపెట్టారు. అంతేకాదు 1992లో మిస్‌ మద్రాస్‌ టైటిల్‌ గెలుచుకొంది. 1991లో ఆతా ఉన్‌ కోయిలిలే తమిళ చిత్రంతో ఆమె వెండితెరకు పరిచయం అయ్యారు. అంతేకాదు రాష్ట్రస్థాయి హాకీ చాంపియన్‌, మైమానిక దళ విభాగంలో ఆర్డీ క్యాడెట్‌గా పనిచేయవడం విశేషం.

 

– క్లిక్ చేసి ఇవి కూడా చ‌ద‌వండి-

మ‌బ్బుల్లో విహారం.. కొత్త చిక్కుతో విచార‌ణం

ఇంటింటి స‌ర్వే డేటా భ‌ద్ర‌మేనా.. అసాంఘిక శ‌క్తుల చేతిలోకి వెళ్తే..

కేదార్‌నాథ్ ఆల‌యం మూసివేత‌..ఎప్పుడు.. ఎందుకంటే..

విస్త‌రిస్తున్న షుగ‌ర్ డాడీ.. ఆ ప‌నికోస‌మేనా..

మహేష్‌ బాబు కోసం రాజమౌళి వెతుకులాట

రికార్డు సృష్టించిన అయోధ్య

న్యూ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీయార్‌

దొరికిన కుంభకర్ణుడి ఖడ్గం

రామగుండం కొత్త చరిత్ర

బీజేపీలో ముస‌లం.. నెక్ట్స్ బాస్ ఎవ‌రంటే..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *