హైద‌రాబాద్ : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ (KTR)బావమరిది ఇంట్లో జరిగిన పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఇది మందు పార్టీనా, రేవ్‌ పార్టీనా అంటూ చర్చకు దారితీసింది. రాష్ట్రంలో డ్రగ్స్‌ మాఫియా వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే డ్రగ్స్‌ (DRAUGS) కేసులు, రేవ్‌ పార్టీలు, గంజాయి మాఫియా కారణంగా రాష్ట్ర ప్రతిష్ట రోజురోజుకూ దిగజారుతోంది. తాజాగా కేటీఆర్‌ బంధువు ఇంట్లో డ్రగ్స్‌ వ్యవహారం మరోసారి సంచలనం సృష్టించింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన కేసులో సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు, వారి వారసులు, రాజకీయ నేతలూ ఉండడం ఆప్పట్లో పెనుదుమారం రేపింది. తాజాగా, కేటీఆర్‌(KTR) బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్‌ అలియాస్‌ రాజ్‌ పాకాలకు చెందిన ఫాంహౌస్‌లో శనివారి అర్ధరాత్రి పోలీసుల దాడులు రాజకీయ దమారం రేపింది. పోలీసుల దాడిలో ఎవరికీ డ్రగ్స్‌ పాజిటివ్‌ రాలేదు. కానీ రాజ్‌ స్నేహితుడు మద్దూరి విజయ్‌ మాత్రం డ్రగ్స్‌ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించడంతో ఇది నిజంగా మందు పార్టీయా, రేవ్‌ పార్టీనా, డ్రగ్‌ పార్టీనా అంటూ అనుమానాలు రేకెత్తాయి. ఈ దాడిలో టాక్స్‌ చెల్లించని 12 విదేశీ, ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం బాటిళ్లతోపాటు, క్యాసినో వినియోగించే కాయిన్స్‌, పేకముక్కలు దొరికాయి. దివాలీ దావత్‌ పేరుతో సాగిన ఈ పార్టీలో ఇవన్నీ ఎందుకనే చర్చసాగుతోంది. ఇదిలాఉండగా, మోకిల పోలీసులు రాజ్‌, విజయ్‌లపై నార్కొటిక్‌ డ్రగ్స్‌(DRAUGS) అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌ స్టాన్సెస్‌(ఎన్‌డీపీఎస్‌) యాక్ట్‌తోపాటు, గేమింగ్‌ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు ఈమేరకు నగర డీసీపీ సీహెచ్‌ శ్రీనివాస్‌ వెల్లడించారు. కేటీఆర్‌ బావమరిది రాజ్‌ హైదరాబాద్‌లో ఈటీజీ పేరుతో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నిర్వహిస్తున్నారు. రాజ్‌కు శంకరపల్లి మండలం జన్వాడలో శ్రీమాత్రే ప్రాపర్టీలో ఓ ఫాంహౌస్‌ ఉందని పోలీసులు వెల్లడించారు. ఇందులో దివాలీ పార్టీ పేరుతో రాజ్‌ తన స్నేహితులకు పార్టీ ఏర్పాటు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే ఇందులో 21 మంది పురుషులు, 14 మహిళలు పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు.

టెస్ట్‌కు సహకరించని మహిళలు

కాగా డ్రగ్స్‌ టెస్ట్‌కు పార్టీలో పాల్గొన్న మహిళలు నిరాకరించినట్టు పోలీసులు అధికారులు వెల్లడించారు. డ్రగ్స్‌ పరీక్ష కోసం బ్లడ్‌ షాంపిల్స్‌ ఇచ్చేందుకు నిరాకరించినట్టు పోలీసులు వెల్లడించారు. ఆ పార్టీలో 14 మంది మహిళలు పాల్గొన్నట్టు తెలిపారు. అయితే వారెవరూ పరీక్షలకు సహకరించలేదని పేర్కొన్నారు.

పరారీలో రాజ్‌…

జన్వాడ డ్రగ్స్‌ కేసులో మోకీల పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేటీఆర్‌ బావమరిది రాజ్‌ ప్రస్తుతం పరారాలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, రాజ్‌ పై ఏ–1 నిందితుడిగా చేర్చారు. రాజ్‌ ఫోన్‌ స్విచాఫ్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాజ్‌ పోలీసుల అదుపులో లేడని పోలీసులు వ్లెడించారు. రాజ్‌ స్నేహితుడు మద్దూరి విజయ్‌కు రాజ్‌నే డ్రగ్స్‌ ఇచ్చారా.. లేక మరెక్కడి నుంచైనా తెచ్చారా అన్న కోణంలో పోలీసులు వెల్లడిస్తున్నారు.

 

One thought on “కేటీఆర్‌కు మరో తలనొప్పి.. ఆయన బావమరిది ఇంట్లో రేవ్‌ పార్టీ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *