AYODYA: అయోధ్య: ప్రపంచ రికార్డు దిశగా దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన అయోధ్య నగరంలో అడుగులు వేస్తోంది. దీపావళి వేళ లక్షలాది దీపాలు ఒకేసారి వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించేందుకు రెడీ అయింది. ప్రతీఏటా దీపావళి పర్వదినానికి ముందు రోజు అయోధ్యలోని సరయూ నదీ తీరంలో ’దీపోత్సవ్’ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే నిరుడు 25 లక్షల దీపాలు ఒకేసారి వెలిగించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది… సృష్టించింది. అయితే ఈ ఏడాది 28 లక్షల దీపాలతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగానే రేపు (అక్టోబర్ 30) పెద్ద ఎత్తున దీపోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసింది. దివాళి వేళ దీపోత్సవంలో అయోధ్యపురి వెలిగిపోనుంది. సరయూ నదీ తీరంలో దీపోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 51 ఘాట్లలో 28 లక్షల దీపాలు ఒకేసారి వెలిగించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. సుమారు 30 వేల మంది వలంటీర్లు ఈ దీపోత్సవం లో భాగస్వామ్యం కానున్నారు. ఇక రామ మందిరం నిర్మాణం తర్వాత తొలి సారి జరుగుతున్న దీపావళి పండుగ కావడంతో ఈ దీపోత్సవాన్ని మరింత అద్భుతంగా నిర్వహించాలని అక్కడి రాష్ట్ర సర్కార్ సమాయత్తమైంది.
=================
క్లిక్ చేయండి: వరంగల్లో అద్భుతం
=================
అలాగే, అయోధ్య(AYODYA)రామ మందిర సముదాయాన్ని పూలు, విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. రేపు(బుధవారం) సాయంత్రం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సరయూ హారతి ఇవ్వనున్నారు. అలాగే ఈ దీపోత్సవాన్ని అట్టహాసంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు హాజరుకానున్నారు. వేడుకల్ని డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించనున్నారు. చిత్రీకరిస్తూ దీపాలను లెక్కించనున్నారు. దీపాలను కూడా లెక్కించనున్నారు. ఈ వేడుకలకు మంత్రులు, ప్రభుత్వ అధికారులు హాజరుకానున్నారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా లేజర్ షో ను ఏర్పాటు చేసేందుకు సర్వం సిద్దంచేశారు. ఈ వేడుకల కోసం ప్రపంచం మొత్తం ఆస్తకిగా ఎదురు చూస్తుండడం విశేషం.
తాజా వార్తలకు ఇవి క్లిక్ చేయండి
3. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.. వెతుకులాట
4. సన్న ధాన్యం కోసం కొత్త ఎత్తు
-మరిన్ని తాజా వార్తలకోసం హోం పేజీకి వెళ్లండి-
[…] రికార్డు సృష్టించిన అయోధ్య […]