Brain increase: అవును మాన‌వ మెదడు ప‌రిణామం క్ర‌మంగా పెరుగుతోంది. గ‌తంలో పోలిస్తే దీని మార్పు ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఈ మార్పుపై శాస్త్ర‌వేత్త‌లు నిత్యం అధ్య‌య‌నాలు చేస్తూనే ఉన్నారు. అమెరికాకు చెందిన‌ ప‌రిశోధ‌కులు ఓ అధ్య‌య‌నంలో మార్పును గ‌మ‌నించిన‌ట్టు స్ప‌ష్టం చేస్తున్నారు. కాలిఫోర్నియా యూనివ‌ర్స‌టీలోని డెవిస్ హెల్త్‌కు చెందిన ప‌రిశోధ‌కులు మెదడు ప‌రిణామం కాలక్ర‌మంలో పెరుగుతోంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల జామా న్యూరాల‌జీ జ‌ర్న‌ల్‌లో ఇవే విష‌యాన్ని వెల్ల‌డించారు. వారి జ‌ర్న‌ల్ లో ప్ర‌చురిత‌మైన క‌థ‌కం ప్ర‌కారం ..

వేలాది మందిపై 75 ఏళ్ల అధ్య‌య‌నం..

యూసీ డెవిస్ అల్జిమ‌ర్స్ డిసీస్ రీసెర్చ్ సెంట‌ర్ డైరెక్ట‌ర్‌, డికార్లీ న్యూరాల‌జీ ్ర‌పొఫెస‌ర్ చార్లెస్ డికార్లీ దీనిపై మొద‌టి నుంచి అధ్య‌యనం చేస్తున్నారు. శాస్త్ర‌వేత్త‌లు ఎఫ్‌హెచ్ఎస్‌ (ఫ్లేమింగ్ హార్ట్ స్ట‌డీ)లో భాగంగా 1930లో జన్మించిన వారిపై.. అలాగే 1970లో జ‌న్మించిన వారిపై వీరు అధ్య‌య‌నం చేశారు. మెద‌డును ఎంఐఆర్ (మాగ్నెట్ రెసొనెన్స్ మాగ్న‌టిక్ ఇమేజింగ్‌) చేశారు. ఇందులో అనూహ్యంగా 1930లో పుట్టిన వారి కంటే 1970లో పుట్టిన వారి మెదడు ప‌రిణామం సుమారుగా 6.6శాతం పెద్ద‌దిగా ఉన్న‌ట్టు గుర్తించారు. అంతేకాదు 1948లో మెదడు(Brain increase)మార్పుపై అధ్యయ‌నాలు ముమ్మ‌రం చేశారు. కానీ ఇది స‌హ‌జంగా పెరిగిన‌ట్టు గుర్తించారు. మెదడు నిర్మాణంలో భాగ‌మైన వైట్ మ్యాట‌ర్‌, గ్రే మ్యాట‌ర్‌, హిప్పో క్యాంప‌స్ సైజు కూడా పెరిగిన‌ట్టు గుర్తించారు. 1930లో జ‌న్మించిన వారి మెదడు ప‌రిణామం 1,234 గ్రాములు ఉండ‌గా, 1970 వారిలో 1,321 గ్రాములు ఉన్న‌ట్టు తేల్చారు. అలాగే 1999 నుంచి 2019 వ‌ర‌కు 3,226 మందిపై( ఆడ‌వారు 53శాతం, మ‌గ‌వారు 47శాతం) ప‌రిశోధ‌న‌లు చేశారు.

అంతా మంచికే…

మెదడు పెరుగుద‌లతో ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని ప‌రిశోధ‌కులు స్ప‌ష్టం చేస్తున్నారు. అంతేకాదు ఇది ఎంతో శుభ సూచిక‌మ‌ని పేర్కొంటున్నారు. వ‌య‌సుతో పాటు వ‌చ్చే మ‌తిమ‌రుపును త‌గ్గిస్తుంద‌ని, అలాగే, చిత్త వైక‌ల్యం ముప్పును చాలా వ‌ర‌కు త‌గ్గిస్తుంద‌ని పేర్కొంటున్నారు. అంతేకాదు మాన‌సికంగా ఆరోగ్యంగా ఉంటార‌ని స‌ద‌రు జ‌ర్న‌ల్‌లో వెల్ల‌డించారు. రానున్న రోజుల్లో దీనిపై మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు జ‌రిగే అవ‌కాశ‌ముంద‌ని భావిస్తున్నారు.

UC డేవిస్ అల్జీమర్స్ డిసీజ్ సెంటర్:

యుసి డేవిస్ అల్జీమర్స్ డిసీజ్ సెంటర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ అల్జీమర్స్ వ్యాధిని నివారించడానికి లేదా నయం చేయడంపై దీర్ఘకాలిక ప‌రిశోధ‌న‌లు చేస్తోంది. చిత్తవైకల్యాన్ని నివారించ‌డంపై ఈ కేంద్రం దృష్టి సారించింది. కాలిఫోర్నియా రాష్ట్రం ద్వారా కూడా నిధులు సమకూరుస్తుంది, ఈ కేంద్రం ప్రత్యేకంగా విభిన్న జనాభాపై వ్యాధి యొక్క ప్రభావాలను అధ్యయనం చేస్తోంది. చేయడానికి పరిశోధకులను అనుమతిస్తుంది.

నోట్‌: UC డేవిస్ నుంచి సేక‌ర‌ణ‌

 

ఎక్కువ‌గా చ‌దివిన‌వి:

లిక్క‌ర్ స్కాంలో క‌విత‌కు చుక్కెదురు!

కేజ్రివాల్‌పై మ‌ర‌క‌.. తీహార్ జైలుకు వెళ్లిన తొలి సీఎం ఆయ‌నే..

వంద రోజుల్లో బీఆర్ ఎస్ సీన్ రివ‌ర్స్‌

వావ్‌.. కోకో.. ఖ‌మ్మం రైతులు భేష్‌

మీకు తెలియ‌కుండానే మీ నంబ‌ర్‌ను వాడుతున్నారు..

దేశాన్ని కుదిపేస్తున్న క‌చ్చ‌తీవు దుమారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *