CHAITHU ENGAGEMENT: అక్కినేని నాగచైతన్య నిశ్చితార్థం గురువారం ఉదయం 9.42 గంటలకు నటి , మోడల్ శోభితా ధూళిపాలతో జరిగినట్టు అక్కినేని నాగార్జున ఎక్స్లో ట్వీట్ చేశారు. మా అబ్బాయి నాగచైతన్యం నిశ్చితార్థం శోభిత ధూలిపాళతో జరగడంతో ఆనందంగా ఉందంటూ పోస్టులో పేర్కొన్నారు. ఆమెను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నట్టు వెల్లడించారు. సంతోషకరమైన జంటకు అభినందనలు, వారికి జీతాంతం ప్రేమ, సంతోషం కలగాలని కోరుకుంటూ, దేవుడు ఆశీర్వాదం అందించాలని కాంక్షిస్తూ పోస్టు చేశారు. చివరగా 8.8.8 అనంతమైన ప్రేమకు నాంది అంటూ ముగించారు. ఈమేరకు రెండు ఫొటోలను ఆయన విడుదల చేశారు. ఇందులో చైతు, శోభితా జంటతో నాగార్జున ఉన్న ఫొటోతోపాటు, కొత్త జంత మరో ఫొటోలను ఎక్స్ లో పోస్టు చేశారు. ఎక్కడా కుటుంబ సభ్యులు కనిపించలేదు. ఇది ఓ విలాసవంతమైన ఇంట్లో సన్నిహితుల మధ్య ఈ ఎంగేజ్మెంట్ జరిగినట్టు తెలుస్తోంది. దీంతో చైతు, శోభితా కొద్ది రోజుల నుంచి లవ్లో ఉన్నట్టు వచ్చిన వార్తలకు నాగార్జున ట్వీట్తో చెక్ పడింది. గతేడాది సెప్టెంబరులోనే చైతు, శోభితా పెళ్లి జరిగినట్టు ప్రచారం జరిగింది. కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కాగా, సమంతతో విడాకులు అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. ఇదిలాఉంటే సమంతం 2021లో రూత్ ప్రభుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ఎవరీ శోభితా ధూళిపాల..
ఆంధ్ర ప్రదేశ్లోని తెనాలికి చెందిన శోభితా ధూళిపాల మోడల్, నటి. 1993 మే 31న వేణుగోపాల్రావు, శాంతరావు దంపతులకు జన్మించారు. శోభితా ముంబై యూనవర్సిటీ, హెచ్ఆర్ కాలేజీలో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తిచేశారు. భరతనాట్యం, కూచిపూడిలో ఆమెకు ప్రావీణ్య ఉంది. 2016లో రామన్ రాఘవ్ 2.0 హిందీ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టారు. ఇప్పటిరకు 12 సినిమాల్లో నటించారు. తెలుగులో వచ్చిన గూడచారి, మేజర్ చిత్రాలతో ఆమె మంచి గుర్తింపు పొందారు. పలు వెబ్ సిరీస్లలో కూడా నటించారు. ఆమె 2013లో మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. అంతేకాదు 2013లో జరిగిన మిస్ ఎర్త్ ఇండియాలో పాల్గొంది.
సమంతతో చైతు వివాహంతో…
జోష్ సినిమాతో నాగచైతన్య(CHAITHU ENGAGEMENT)తెరంగేట్రం చేశారు. గౌతమ్మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏ మాయ చేసావేలో సమంతతో కలిసి నటించారు. ఆ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించి, పెళ్లివరకు వెళ్లింది. ఇదిలాఉండగా స్టార్ హీరోయిన్ అనుష్కతో చైతన్యకు ఎంగేజ్మెంట్ అయినట్టు అప్పట్లో సోషల్ మీడియాలో పుకార్లు వచ్చారు. పుకార్లకు తెరదించుతూ 2017 అక్టోబరు 6న చైతు, సమంతల వివాహం జరిగింది. ఆ తర్వాత టాలీవుడ్లో స్టార్కపుల్గా మంచి గుర్తింపుపొందారు. 2021లో వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నటు చైతు, సమంత జంట సోషల్ మీడియా ద్వారా వెళ్లడించి అభిమానులకు షాక్ ఇచ్చారు.