CM-CINEMA: సినిమా వాళ్లకు సీఎం రేవంత్రెడ్డి స్ర్టాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శనివారం అసెంబ్లీ సాక్షిగా హెచ్చరికలు జారీ చేశారు. తాను సీఎంగా ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితిలో బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలను పెంచేది లేదని తెల్చి చెప్పడంతో తెలుగు ఇండస్ట్రీ షాక్కు గురైంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఊరుకునేది లేదని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. మీరు వ్యాపారం చేసుకోవచ్చని, కావాలంటే సబ్సిడీలు ఇస్తామని.. అంతేకాని ఇలా ప్రాణాలు తీస్తామంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో ఆయన కీలక ఈ వ్యాఖ్యలు చేశారు. సినీ హీరో నిర్లక్ష్యంతోనే తొక్కిసలాట జరిగిందని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్రోడ్లోని సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగిన విషయాన్ని కూలంకషంగా వివరించారు. అల్లు అర్జున్ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నారు. అల్లు అర్జున్ను పరామర్శించడానికి సినీ ఇండస్ట్రీ నుంచి ప్రతీ ఒక్కరు వెళ్లడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఆయనకు ఏమైనా కాలు విరిగిందా.. చేయి విరిగిందా ..అంటూ ప్రశ్నించారు. ఒకరు చనిపోయి, మరొకరు చావు బతుకుల మధ్య ఉంటే బాధిత కుటుంబాన్ని కనీసం ఇండస్ర్టీకి చెందిన ఒక్కరు కూడా పరామర్శించ లేదని, ఇదేనా నైతిక బాధ్యత అంటూ చురకలు అంటించారు.
CHIRANJEEVI : మెగస్టార్ చేతికి రక్తపుమరక.. టాలీవుడ్ షాక్..
ఇండస్ట్రీపై సీఎం ఎందుకు ఫైర్ అయ్యారు…
CM-CINEMA: తాజా సీఎం రేవంత్రెడ్డి సినీ ఇండస్ట్రీపై కీలక వ్యాఖ్యల వెనుక అనేక కారణాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. రేవంత్ సర్కారుకు సినీ ఇండస్ట్రీ నుంచి మొదటి నుంచి అంతగా సపోర్టు లభించలేదు. ఎన్నికల సమయంలో వారి నుంచి మద్దతు అంతంత మాత్రమే. దీనికి తోడు ఇటీవల నాగచైతన్య, సమంత విడిపోవానికి గల కారణాలు మీడియా సాక్షిగా మంత్రి కొండా సురేఖ బయట పెట్టడంతో ఇండస్ర్టీ అంతా ఒక్కటై.. ప్రభుత్వ తీరుపై ఎండగట్టారు. దాంతో ప్రభుత్వంపై మరింత అంతరం పెరిగింది. కొద్దిరోజుల క్రితం పుష్పా–2 మీటింగ్లో అల్లు అర్జున్ తెలంగాణ సీఎం పేరు మరిచిపోయాడు. ఇదే విషయాన్ని తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇండస్ర్టీ ప్రముఖులకు కూడా సీఎం పేరు తెలియడం లేదంటూ ఎద్దేవా చేశారు. దాంతో సహజంగా సీఎంకు ఆగ్రహాన్ని తెప్పించి ఉంటుంది.
SILKSMITHA: మళ్లీ రాబోతున్న సిల్క్స్మిత
ఇండస్ర్టీ నుంచి రియాక్షన్ ఉంటుందా…
CM-CINEMA: సీఎం బెనిఫిట్ షోలు, ధరల పెంపునకు అనుమతి ఇవ్వమని తేల్చిచెప్పడంతో ఇండస్ట్రీ షాక్లో ఉంది. కొన్నేళ్ల నుంచి టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. సినిమా కోసం వేల కోట్ల ఖర్చు పెడుతున్నారు. ఈక్రమంలో సీఎం నిర్ణయం పెద్ద హీరోలు, దర్శక నిర్మాతలను కలవరానికి గురి చేస్తోంది. ఈ విషయంపై సీనీ పెద్దలు ఏ మేరకు స్పందిస్తారో చూడాలి.
నటులు బాధ్యత విస్మరిస్తున్నారా…
CM-CINEMA: అభిమాన నటులను చూసేందుకు అన్నివర్గాల ప్రజలు సహజంగా ఉత్సాహం చూపిస్తుంటారు. బాధ్యతగా వ్యహరించాల్సిన వారే తమ దర్పం చూపించుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తారా అన్న చర్చ సహజంగానే అభిమానుల్లో సాగుతోంది. ఇటీవల కాలంలో చాలా మంది హీరోలు తమ అభిమానులను అవమానించడం, లేదంటే అసహనం వ్యక్తం చేయడం తెలిసిందే. వారి కారణాలు ఏమైనా ఉండొచ్చు. ఇలాంటి దుందుడుకు ప్రవర్తన అంత మంచిది కాదంటున్నారు.