CONGRESS SELF GOLE: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీరు ఆసక్తిగామారుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు అధికార పార్టీని సెల్ఫ్గోల్లో పడేస్తున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితంగా కొన్ని సందర్భాల్లో ఆ పార్టీ నేతలు ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లలేపోతున్నారు. పేదల పార్టీగా ముద్రపడిన కాంగ్రెస్ ఇప్పుడు అదే పేద వర్గాల నుంచి అతితక్కువ కాలంలోనే వ్యతిరేకత రావడం బహుశా ఊహించకపోవచ్చు. బీఆర్ఎస్పై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత కాంగ్రెస్కు వరంలా మారి అధికారంలోచ్చేలా చేసింది. ఇటీవల ప్రభుత్వ నిర్ణయాలు పేదలను పార్టీ దూరం చేస్తోంది.
హైడ్రాతో.. హైరానా..
హైదరాబాద్లో హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎస్సెట్ ప్రొటెక్షన్ ఎజెన్సీ) దూకుడు పేదల్ని కలరపెడుతోంది. హైడ్రా కూలుస్తున్న ఇళ్లు ఎక్కువగా పేద, మధ్యతరగతి కుటుంబాలవే. దాంతో ఆ వర్గాలు ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నాయకులపై మండిపడుతున్నాయి. పైసాపైసా కూడబెట్టుకుని ఇల్లు కట్టుకున్నామని, తమకు స్థలం అమ్మిన వారిని వదిలేసి, కబ్జా అంటూ శిక్ష వేస్తారా అంటూ సూటిగానే ప్రశ్నిస్తున్నారు. హైడ్రాపై వెనక్కి తగ్గేది లేదని ప్రభుత్వం చెబుతుండడంతో కాంగ్రెస్ నాయకులపై పేదలు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. హైడ్రా పరిధిలోని కాంగ్రెస్ నేతలకు నిరసన సెగ తగులుతుండడంతో వారు జనంలోకి రాలేని పరిస్థితి నెలకొంది.
READ MORE: తిరుమల తిరుపతి 15 రహస్యాలు
మూసీతో మరో దెబ్బ..
హైడ్రా సమస్య రగులుతుండగానే పేద, మధ్య తరగతి వర్గాలకు మూసీ ప్రక్షాళన అంశం పిడుగులా మారింది. మూసీ పరీవాహక ప్రాంతాన్ని సుందరీకరించడం, కబ్జాలను నిర్దయగా తొలగించేందుకు సర్కారు సమాయత్తమైంది. దాంతో ఈ మూసీ దెబ్బ మూడు నాలుగు జిల్లాకు తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పేదల నుంచి వ్యతిరేకత ఎటు దారి తీస్తుందోనని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. మూసీ చుట్టు ఉన్న ఇళ్లను కూలుస్తే ఆగ్రహంతో ఊగిపోయే జనంతో రేపు ఓట్లను ఎలా రాబట్టేదంటూ తలలు పట్టుకుంటున్నారు. అంతిమంగా పార్టీకే ఎదురుదెబ్బ తగిలే ప్రమాదముందని అనుమానిస్తున్నారు.
READ MORE: ఇంటింటి సర్వే డేటా భద్రమేనా.. అసాంఘిక శక్తుల చేతిలోకి వెళ్తే..
ఆరు గ్యారెంటీలు అమలులేక..
ఎన్నికల వేళ కాంగ్రెస్ (CONGRESS SELF GOLE) ఆరు గ్యారెంటీ పేరుతో పెద్దపెద్ద హామీలను ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రైతులకు రూ.లక్షలోపు రుణ మాఫీ చేసింది. మిగతా గ్యారెంటీలేవీ అమలు కాకపోవడంతో కాంగ్రెస్ నేతలు ఇప్పుడెలా అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రూ.4వేల ఆసరా పెన్షన్, ఇంటి స్థలం ఉన్నవారికి రూ.5లక్షల సాయం వంటివి ఇంకా అమలు కాలేదు.
READ MORE: బీజేపీలో ముసలం.. నెక్ట్స్ బాస్ ఎవరంటే..?
కుటుంబ సర్వే ఫలితం అంతంత మాత్రమేనా…
ప్రభుత్వం ప్రస్తుతం కుటుంబ, కులగణన సర్వే చేపట్టింది. ప్రజా పాలను దరఖాస్తుల మాటేమిటని ఎదురు ప్రశ్నిస్తుండడం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారిందనే చెప్పాలి. కుటుంబ సర్వే అంటూ ఆస్తుల వివరాలు ఎందుకు ఇవ్వాలంటూ నేరుగా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం కూడా వివరాల స్వీకరణలో ఒత్తిడి చేయొద్దని ఆదేశించింది. ఈ మాత్రం దానికి సర్వే అందుకనే మరో వాదన కూడా తెరపైకి వచ్చింది.