INDIA: దేశ ద్ర‌వ్యోల్బ‌ణం క‌లవ‌ర‌పెడుతోంది. పటిష్టమైన చర్యలు తీసుకోక‌పోవ‌డంతో స‌మ‌స్య జ‌టిల‌మ‌వుతోంది. రూపాయి మారకం విలువ నానాటికి దిగజారుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం రూ.84 ప‌డిపోయింది. ఫ‌లితంగా దేశంలో ధరలు స్వారీ చేస్తున్నాయి. బియ్యం,ఉప్పు,పప్పుల ధరలు ఆకాశానంటాయి. ధరలను అదుపు చేయ‌డంలో ప్ర‌భుత్వాలు ఘోరంగా విఫ‌ల‌మ‌వుతున్నాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పాలన‌లో గత పదేళ్లుగా అన్నిరకాల వస్తువుల ధరలు, మందుల ధరలు పెరిగిపోయాయి. ధ‌ర‌ల్ని నియంత్రించ‌డంలో భార‌త ప్ర‌భుత్వం విఫ‌ల‌మ‌వుతోంది. దారిద్య సూచికలో భారతదేశం 107వ స్థానానికి పడిపోయింది. ఇండియా డెవ‌ల‌ప్‌మెంట్ గ్రాఫ్ నానాటికీ దిగ‌జారుతోంది.

ప‌థ‌కాల దెబ్బ‌..

పథకాల పేరుతో తప్ప, ఆదాయం పెంచే మార్గాలను కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అన్వేషించడం లేదు. నీటి వనరులను సద్వినయోగం చేసే దిశగా సాగడం లేదు. వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించి.. విదేశీ మారక ద్రవ్యం సంపాదించేలా ప్రణాళికలు క‌రువ‌య్యాయి. వ్యవసాయ అభివృద్ధి, పరిశ్రమల అభివృద్ధి కుంటుపడటమే ధరలు నానాటికీ పెరగడానికి కారణంగా చూడాలి. ఇబ్బడిముబ్బడిగా ఉచిత పథకాలు, డబ్బుల పందేరంతో స‌మ‌స్య‌లు పెరుగుతున్నాయి. పేదరికానికి మూలం ప్రభుత్వ విధానాలే అన్నది గుర్తించడం లేదు.

ప‌ట్టించుకోని ఆర్థిక వ్యవస్థ బలోపేతం ..

వ్యవసాయ పశుగుణాభివృద్ధి ద్వారా భారతదేశ(INDIA) ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అవకాశాలను ఎవరు కూడా పట్టించు కోవడం లేదు. గ్రావిూణ అర్ధిక వ్యవస్థకు ఊతంగా ఉండే వ్యవసాయ రంగాన్ని,పాడి పరిశ్రమను శాస్త్రీయంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వాలు కృషి చేయడం లేదు. రైతులను, రైతు కూలీలను నిరంతరం సంక్షోభంలో ముంచుతున్నారు. దేశంలో వ్యవసాయ భూమి విస్తరించట్లేదు. పేద ప్రజలకు భూములు ఇవ్వడంలేదు. పాలకవర్గాలు వీటన్నింటినీ విస్మరించడం వల్లే ఈ రోజున పేదరికం పెరిగిపోతోంది. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తి సాధించడం, ఆహార వస్తువుల ధరలస్థిరీకరణ సాధించడం,పేద ప్రజలకు ఆహార భద్రత కలిగించడం, వ్యవసాయదారులు, వినియోగదారుల ప్రయోజనాల మధ్య సమతూకం సాధించడం వంటివి ముందుకు సాగడం లేదు.

ముఖ్యంగా సంస్కరణలు వృద్ధిరేటు  పెంచి

ముఖ్యంగా సంస్కరణలు వృద్ధిరేటును పెంచినప్పటికి నిరుద్యోగ నిర్మూలనకు పెద్దగా తోడ్పడలేదు. సంఘటిత రంగంలో ఉపాధి తగ్గిపోతున్నది. రెగ్యులర్‌ ఎంప్లాయీస్‌ తగ్గుతూ క్యాజువల్‌ లేబర్‌ పెరుగుతున్నారు. క్యాజువల్‌ లేబర్‌ను, ప్రభుత్వ ఉద్యోగులను రెగ్యులర్‌ ఉద్యోగులుగా మార్చకపోవడం వలన వారు అభద్రతలో వున్నారు.సమగ్రాభివృద్ధి చెందాలి అంటే పారిశ్రామిక అభివృద్ధి ద్వారానే సాధ్యమని గుర్తించి ముందుకు సాగాలి. వ్యవసాయఅభివృద్దికి చర్యలు తీసుకోవాలి. విప్లవాత్మక చర్యలకు పూను కోవాలి. అలాగే పాడి రంగాన్ని, కోళ్ల పరిశ్రమల అభివృద్ది తదితర రంగాలను ప్రోత్సహించాల్సి ఉంది. దేశంలో ఉత్పత్తి రంగాల్లో మాంద్యం పెరిగింది.పారిశ్రామికాభివృద్ధి పూర్తిగా పడకేసింది. పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, ఉపాధి కల్పన లేదు. మరోవైపు పెద్దఎత్తున ఉద్యోగాలు పోయాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీ చేసిన పాపాన పోలేదు. విద్యాధికులైన యువతకు సంపాదనా మార్గాలను పూర్తిగా మూసేశారు. మరీ ముఖ్యంగా బడుగు, బలహీనవర్గాల ఆర్థికస్థితిని చావుదెబ్బ తీశారు. వాళ్ల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టారు.

 

–ఎక్కువ మంది చదివినవి.. మీరు క్లిక్‌ చేసి చదవండి–

ఒలింపిక్ కు ఇండియా స‌న్నాహాలు

వంద రేప్‌లు చేశాడు.. వారంతా టాప్ హీరోయిన్స్ అయ్యారు..

టీడీపీ- జ‌న‌సేన మ‌ధ్య ముదిరిన వార్‌

మ‌న మెద‌డు పెరుగుతోంది.. లాభ‌మా .. న‌ష్ట‌మా..

తెలుగు వారిని అంత మాటంటావా.. న‌టి కస్తూరిపై ఫైర్‌

మ‌బ్బుల్లో విహారం.. కొత్త చిక్కుతో విచార‌ణం

ఇంటింటి స‌ర్వే డేటా భ‌ద్ర‌మేనా.. అసాంఘిక శ‌క్తుల చేతిలోకి వెళ్తే..

కేదార్‌నాథ్ ఆల‌యం మూసివేత‌..ఎప్పుడు.. ఎందుకంటే..

విస్త‌రిస్తున్న షుగ‌ర్ డాడీ.. ఆ ప‌నికోస‌మేనా..

మహేష్‌ బాబు కోసం రాజమౌళి వెతుకులాట

రికార్డు సృష్టించిన అయోధ్య

న్యూ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీయార్‌

దొరికిన కుంభకర్ణుడి ఖడ్గం

రామగుండం కొత్త చరిత్ర

బీజేపీలో ముస‌లం.. నెక్ట్స్ బాస్ ఎవ‌రంటే..?

మెడిక‌ల్ వార్‌: ఆయుర్వేదం వ‌ర్సెస్ అలోప‌తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *