DUBAI: దుబాయ్.. ఈ పేరు తెలియనివారు ఈ ప్రపంచంలోనే ఉండరు. అత్యంత ఖరీదైన దేశాల్లో ఇదీ ఒకటి. ఇక్కడి ఒక్కో భవనం ఒక్కో ఆకృతితో ఆశ్చర్యపరుస్తుంటాయి. విశాలమైన రోడ్లు.. పగలు, రాత్రి తేడా తెలియని జనజీవనం.. ఆకాశానంటే భవంతులు.. ఉల్లాసపరిచే బీచ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో.. పర్యాటకంగానూ ఎంతో అభివృద్ధి చెందింది ఈ ఎడారి దేశం. ఒకప్పుడు పూర్తిగా చమురు బావుల వచ్చే ఆదాయంపైనే ఆధారపడిన దుబాయ్.. క్రమంగా రియల్ ఎస్టేట్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి కోసం వేలాది మంది ఆ దేశం వెళ్తుంటారు. దుబాయ్కే వన్నెతెచ్చి, ఎన్నో ప్రత్యేకతలకు నిలయమైన ఓ కట్టడం గురించి తెలుసుకుందాం.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మానవ నిర్మితాల్లో ఒకటి బుర్జ్ఖలీఫా(DUBAI). 2004 జనవరి 6న దుబాయ్లో దీని నిర్మాణ పనులను ప్రారంభించి కేవలం ఐదేళ్లలో పూర్తి చేయడం విశేషం. 154 అంతస్థులతోపాటు మేయింటనెన్స్ పేరుతో మరో తొమ్మిది అంతస్థులను కలిపి నిర్మించారు. ఇందులో 57 సూపర్ ఫాస్ట్ లిఫ్టులు, 8ఎస్కలేటర్లను ఏర్పాటు చేశారు.
బుర్జ్ఖలీఫాను స్కిడ్మోర్, ఓవింగ్ అండ్ మెర్రిల్ ఆర్టిటెక్చర్ సంస్థ భవన నిర్మాణానికి రూపకల్పన చేసింది. అంతకు ముందు ఈ సంస్థకు విల్లిస్ టవర్, వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ను డిజైన్ చేసిన అనుభవం ఉంది. బుర్జ్ ఖలీఫా కోసం సమర్రాలోని గ్రేట్ మసీదు వంటి ప్రాంతంలోని ఇస్లామిక్ అర్కిటెక్చర్ను అవలంబించారు. దుబాయ్లో ఎక్కువ వేడి ఉంటుందన్న విషయం మీకు తెలిసిందే. ఆ వేడిని తట్టుకునేలా డిజైన్ను రూపొందించడం గమనార్హం. ఇందుకోసం నిర్మాణంలో కాంక్రీట్, స్టీలు, అల్యూమినియ్ ఉపయోగించారు. నిర్మాణ ఇంజనీర్గా విలియం ఎఫ్.బేకర్, వాస్తు శిల్పగా ఆడ్రియాన్ స్మిత్, ప్రధాన కాంట్రాక్టర్గా సామ్సంగ్ సి అండ్ టీ కార్పొరేషన్వ్యహరించింది. బుర్జ్ ఖలీఫా కట్టడానికి 1.5బిలియన్ అమెరికన్ డాలర్లు వ్యయం కావడం విశేషం. ఇంత పెద్దమొత్తంలో ఖర్చుచేయడం ప్రపంచంలోనే మొదటిసారి కావడం విశేషం. బుర్జ్ఖలీఫా ఎత్తు 828మీటర్లు. వై ఆకారలో మూడు విభాగాలు నిర్మించారు. ఇందులో హోటళ్లు, వ్యాపార, నివాస యోగ్యంగా ప్లాట్లను నిర్మించారు.
అంతేకాదు…
– ఇందులో అత్యధిక ప్లాట్లను కొనుగోలు చేసినవారిలో భారతీయులే అధికంగా ఉండడం గమనార్హం.
-దుబాయ్ ఎక్కుగా చమురు రంగంపై ఆధారపడిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రత్యామ్నాయ మార్గంగా ఎదిగేందుకు దుబాయ్ ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే బుర్జ్ఖలీఫా నిర్మాణానికి పూనుకుంది. ఈ భవనానికి అంతర్జాతీయ గుర్తింపు రావడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించి సక్సెస్ అయింది.
– ఈ భవనానికి మొదటి బుర్జ్ దుబాయ్ అని నామకరణం చేశారు. కానీ నిర్మాణ సమయంలో పెరిగిన వ్యయంతో నిర్వాహకులు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే అబుదాబి పాలకుడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆర్థికసాయం అందించారు. దీంతో ఆయన గౌరవార్థం ఆయన పేరు వచ్చేలా ఖలీఫా అని పేరు పెట్టారు. ఎన్నో ప్రత్యేకతలతో నిర్మించిన ఈ భవనం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ప్రపంచంలో ఎత్తైన భవనంగా గుర్తింపు పొందింది.
–ఎక్కువ మంది చదివినవి.. మీరు క్లిక్ చేసి చదవండి–
మహేష్ బాబు కోసం రాజమౌళి వెతుకులాట
వంద రేప్లు చేశాడు.. వారంతా టాప్ హీరోయిన్స్ అయ్యారు..
తెలుగు వారిని అంత మాటంటావా.. నటి కస్తూరిపై ఫైర్
ఎలాన్ ముస్క్ కు ట్రంప్ బిగ్ ఆఫర్..
సర్వే డేటా భద్రమేనా.. ప్రజలకు అనుమానాలు.. ముప్పు ఇదేనా..
వాటిని.. డ్రీమ్ గర్ల్ హేమామాలిని బుగ్గలుగా మారుస్తా..
టీడీపీ- జనసేన మధ్య ముదిరిన వార్
మన మెదడు పెరుగుతోంది.. లాభమా .. నష్టమా..
మబ్బుల్లో విహారం.. కొత్త చిక్కుతో విచారణం
ఇంటింటి సర్వే డేటా భద్రమేనా.. అసాంఘిక శక్తుల చేతిలోకి వెళ్తే..
కేదార్నాథ్ ఆలయం మూసివేత..ఎప్పుడు.. ఎందుకంటే..
విస్తరిస్తున్న షుగర్ డాడీ.. ఆ పనికోసమేనా..
న్యూ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీయార్
బీజేపీలో ముసలం.. నెక్ట్స్ బాస్ ఎవరంటే..?
మెడికల్ వార్: ఆయుర్వేదం వర్సెస్ అలోపతి
పడిపోతున్న ఇండియా గ్రాఫ్.. కానీ..