GLASS BRIDG: ఇండియాలో అద్భుతం ఆవిష్కృతమైంది. ఇండియాలో తొలిగాజు వంతెన అందుబాటులోకి వచ్చింది. దేశ చివరి ప్రాంతమైన కన్యాకుమారిలో ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో సందడి నెలకొంది. కన్యాకుమారిలోని వివేకానంద మండపం, తిరువళ్లువర్ విగ్రహాన్ని కలుపుతూ ఈ బ్రిడ్జి నిర్మించారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అట్టహాసంగా ఆరంభించడంతో పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరువల్లువర్ విగ్రహం ఏర్పాటు చేసి రేపటి(జనవరి–1) నాటికి పాతికేళ్లు కానుంది. ఈనేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో నగరంలో సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఈ సందర్భంగానే గాజు బ్రిడ్జి అందుబాటులోకి తేవడం విశేషం. ఆ ఈ బ్రిడ్జిని రూ.37కోట్లతో నిర్మించారు. దీని పొడవు సుమారు 77 మీటర్లు కాగా, వెడల్పు 10 మీటర్లు ఉంది. బ్రిడ్జి మధ్యలో 2.4 మీటర్ల మందం కలిగిన గాజు పట్టీలు అమర్చారు. సముద్రం అలల కల్లోలాన్ని తట్టుకునేలా దీనిని నిర్మించారు. ఈ వంతెనపై నడుస్తూ పర్యాటకులు సముద్రం మధ్యలో సూర్యోదయం, సూర్యాస్తమయాలను ఆస్వాదించడం పర్యాటకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం సంగమాన్ని ఈ వంతెన ద్వారా అవకాశం దక్కనుంది. సముద్రం మధ్యలో, 30 అడుగుల ఎత్తులో బండపై 133 అడుగుల తిరువళ్ళువర్ విగ్రహం2000 లో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ప్రారంభించారు.
1892లో నిర్మించిన విగ్రహ ప్రత్యేకతలు
GLASS BRIDG: స్వామి వివేకానందుడు 1892లో ఈ దీవికి వచ్చి మూడు రోజులు తపస్సు చేశారని చరిత్రకారులు చెబుతుంటారు. అప్పటి నుంచే ఆయనలో ఆధ్యాత్మిక భావనలు పెరిగాయని పేర్కొంటున్నారు. 1964లో వివేకానందుడి విగ్రహ నిర్మాణం పనులు ప్రారంభమై 1970లో పూర్తయింది. ప్రముఖ హిందూ ధార్మిక చిహ్నాలతో పాటు, భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా ఈ నిర్మాణం రూపుదిద్దుకుంది. ప్రధాన హాల్ లో వివేకానంద విగ్రహం సందర్శకులకు ఆకట్టుకుంటుంది. నిర్మాణ శైలి తమిళ, బంగాళీ ఆర్కిటెక్చర్ కలయికతో దీన్ని రూపొందించబడింది.
పార్వతీ మాత ఆలయం
GLASS BRIDG: సమీపంలో కన్యామాత ఆలయం ఉంది, ఇది విశిష్టమైన పర్యాటక ఆకర్షణ.ఈ ప్రదేశానికి బోటు ద్వారా మాత్రమే చేరుకోవచ్చు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే సందర్శకులకు అనుమతిస్తారు. వివేకానంద రాక్ మెమోరియల్ భారతీయ ధార్మిక, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతిరూపం అది.
READ MORE: మహా కుంభమేళకు ముస్తాబు
READ MORE: లేటెస్ట్ /అప్డేట్/వైరల్/ ట్రెండింగ్/ న్యూస్ కోసం క్లిక్ చేయండి