Tamilisi/ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సుందర్రాజన్ ఊహించని షాక్ ఇచ్చారు. సోమవారం(మార్చి18)న గవర్నర్గా తన పదవికి రాజీనామా చేశారు. అయితే తాను కొద్ది రోజులుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న ఆకాంక్షను వెల్లడిస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రజలు ఊహించని విధంగా రాజీనామా చేయడం హాట్ టాపిక్గా మారింది. దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత తమిళసై రాజీనామా చర్చనీయాంశమైంది. తాజా పరిణామాలు చూస్తుంటే ఆమె ఎన్నికల బరిలో దిగడం ఖాయమని తెలుస్తోంది. బీజేపీ దేశ వ్యాప్తంగా 400 పార్లమెంట్ సీట్లు సాధించడమే లక్ష్యంగా ముందుసాగుతోంది. ఈక్రమంలో తమిళిసైని ప్రత్యక్ష ఎన్నికల్లో తిరిగి తీసుకువాలని భావిస్తున్నట్టు స్పష్టమవుతోంది. అయితే ఆమెకు ప్రత్యక్ష రాజకీయాలు అంతగా కలిసిరాలేదు. 2006, 2011 శాసనసభ్యురాలిగా, 2009, 2019లో పార్లమెంట్ సభ్యురాలిగా పోటీ చేసి అన్నిసార్లు ఓటమి చవిచూశారు.
పోటి ఎక్కడి నుంచి?
తమిళిసై రాజీనామా చేశాక ఇప్పుడు ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తుందనే చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది. దీని ఇప్పటివరకు బీజేపీ అధిష్ఠానం స్పష్టత ఇవ్వకపోయినా అమె ఎన్నికల బరిలో దిగడం ఖాయమని తెలుస్తోంది. ముఖ్యంగా తమిళనాడుకు చెందిన తమిళసై చెన్నై సెంట్రల్, తిరునల్వేలి, కన్యాకుమారి నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. లేదంటే తుత్తుకుడి నుంచి బరిలో దింపే అవకాశాన్ని అధిష్ఠానం యోచిస్తోంది. తుత్తుకుడి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తమిళసై (Tamilisi)2019లో పోటి చేసి ఓడిపోయారు. అంతకుముందు 2009 చెన్నైనార్త్ నుంచి కూడా ఓటమి చెందారు. ఇదిలాఉంటే తుత్తుకుడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె కనిమొళిపై పోటీకి దింపేలా బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. గతంలో ఆమె పనిచేసిన అనుభవ రీత్యా అగ్రనేతలు ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. తప్పదనుకుంటే కన్యాకుమారి నుంచి పోటీకి దిగొచ్చు. తమిళసైది కన్యాకుమారిలోని నాగర్కోయిల్ కాబట్టి దీని మరో ఆప్షన్గా భావించే ఛాన్స్ఉంది.
రాజకీయ అనుభవమూ పుష్కలమే..
తమిళిసై గతంలో ప్రత్యక్ష రాజకీయాలు చేసిన అనుభవం పుష్కలంగా ఉంది. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారు. విద్యార్థి దశ నుంచి ఆమెకు నాయకత్వ లక్షణాలు అలువడ్డాయి. 2013లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉంది. అలాగే, 2014లో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా, 2007 పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. ఇవేకాకుండా మద్రాస్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతుండగా విద్యార్థి సంఘం నాయకురాలిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై ఆ పార్టీలో చేరారు. తెలంగాణ గవర్నర్గా ఉంటూనే కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్గా అదనపు బాధ్యలు స్వీకరించారు.
కుటుంబ నేపథ్యం
తమిళిసై 1961 జూన్ 2న తమిళనాడులోని నాగర్కోలయిల్ లో కుమారి అనంతన్, కృష్ణకుమారి దంతపులకు పుట్టారు. ్రపముఖ డాక్టర్ సౌందర్జాన్తో వివాహం జరిగింది. వీరికి సుగనాథన్ కుమారుడు ఉన్నాడు. తెలంగాణ తొలి మహిళా గవర్నర్గా 2019 సెప్టెంబరు 8న బాధ్యతల స్వీకరించి చరిత్ర సృష్టించారు.
- నోట్: ఈ సైట్పై మీ సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం.