hmpv virus india: భారతీయులు భయపడినట్టే చైనాలో పుట్టుకొచ్చిన కొత్త హ్యూమన్ మెటానిమో వైరస్(హెచ్ఎంపీవీ) ఇండియాలోకి చొరబడింది. కొద్ది రోజుల నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఒక్కోదేశానికి పాకుతోంది. ఇప్పటికే జపాన్ లాంటి దేశాలను అతలాకుతలం చేస్తోంది. మనదేశంలో తొలికేసు నమోదైంది. హెచ్ఎంపీవీ లక్షణలు బెంగుళూరులో రెండు కేసులు నమోదైనట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) పేర్కొంది. వారిలోవైరస్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. బెంగుళూరులోని బిప్టిస్టు ఆస్పత్రిలో రెండు కేసులు నమోదయ్యాయి. మూడు నెలల బేబి, ఎనిమిది నెలల శిశువులో లక్షణాలు కొనుకొన్నారు. జ్వరంతో బాధపడుతున్న 8నెలల చిన్నారి జనవరి 2న పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. అయితే సదరు చిన్నారి కుటుంబం ఇంతముందు ఎలాంటి ప్రయాణాలు చేయలేదని తెలుస్తోంది. మరి వైరస్ లక్షలు ఉండడం కలవరపెడుతోంది. రెండో కేసు బెంగుళూరుకే చెందిన మూడు నెలల బేబికి సోకింది. ప్రస్తుతం బేబి బెంగుళూరులోని బిప్టిస్టు ఆస్పత్రి నుంచి డిచ్చార్జి అయి, కోలుకుంటోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
చైనాలో చేదాటిన పరిస్థితులు
hmpv virus india: హ్యూమన్ మెటానిమో వైరస్(హెచ్ఎంపీవీ) చైనాలు శరవేగంగా విస్తరిస్తోంది. వైరస్ సోకి వేలాది మంది ఆస్పత్రులపాలయ్యారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జన్సీ చైనా ప్రకటించింది. వైరస్ నివారణ చర్యలు అక్కడి ప్రభుత్వం చేపట్టింది. హెచ్ఎంపీవీ వైరస్ జపాన్ మరియు ఆసియా దేశాలను కలవరపెడుతోంది.
hmpv virus india: ఇన్ఫ్లుఎంజా -ఏ, హెచ్ ఎంపీవీ, మైకోప్లాస్మా న్యుమోనియా, మరియు కొవిడ్ -19 వంటి వైరస్లు ఏకకాలంలో వ్యాప్తి చెందుతున్నాయంటూ చైనాలో సోషల్ మీడియా కోడై కూస్తోంది. దానికి సంబంధించిన పలు వీడియోలు కలవరపెడుతున్నాయి. బాధితులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రలు వీడియోలు అక్కడి పరిస్థితికి అద్దంపడుతున్నాయి. చైనా అత్యవసర పరిస్థితిని ప్రకటించిందని వాదనలు ఉన్నప్పటికీ, చైనా అధికారులు లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిని ధృవీకరించలేదు. HMPV ఫ్లూ-వంటి లక్షణాలను కలిగిఉన్నట్టు సమాచారం. అయితే చైనా బాధితుల సంఖ్యను తగ్గించి చెబుతుందనే ్రపచారం సాగుతోంది. ఆ కేసుల కేవలం చలికాలంలో సాధారణంగా వచ్చే వైరస్ లక్షణాలు అంటూ పేర్కొంటోంది.
మలేషియాలోనూ పెరుగుతున్న కేసులు..
hmpv virus india: చైనా తర్వాత మలేషియా ఇటీవలి HMPV ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారి సంఖ్య అధికమవుతోంది. శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. మలేషియా, స్ట్రెయిట్ టైమ్స్ నివేదిక ప్రకారం 2024లో ఈ కేసులలో గణనీయమైన పెరుగుదల కనిపించింది, 327 కేసులు నమోదయ్యాయని సమాచారం. వైరస్ వ్యాప్తి కట్టడికి అక్కడి గవర్నమెంట్ తగిన చర్యలుతీసుకుంటోంది. తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవడం, ఫేస్ మాస్క్లు ధరించడం మరియు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోరు మరియు ముక్కును కప్పుకోవడం వంటివి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.
ఇతర దేశాల్లో..
హాంకాంగ్లో కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. దక్షిణాఫ్రికా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (SABC) న్యూస్ రిపోర్ట్ ప్రకారం, జపాన్తో సహా పొరుగు దేశాలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. జపాన్లో, ఇన్ఫ్లుఎంజా వ్యాప్తి ఇప్పటికే వేలాది కేసులకు కారణమైంది, డిసెంబర్ 15, 2024 వరకు వారంలో 94,259 ఫ్లూ రోగులు నమోదయ్యారని జపాన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ నివేదిక పేర్కొంది.
READ MORE: చైనాలో మరో కొత్త వైరస్
READ MORE: జపాన్ లో వైరస్ విధ్వంసం.. ఇండియాకు..
READ MORE: హైడ్రా మరో కీలక నిర్ణయం
READ MORE: అవమానకర ఓటమి
READ MORE: భారీ స్కాంలో టాప్ క్రికెటర్లు
READ MORE: జక్కన్న–ప్రిన్స్ మూవీ అప్డేట్స్
READ MORE : అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ?
READ MORE : టవల్ తో హాట్ డాన్స్ చూశారా..
READ MORE : ప్రిన్స్ ఫ్యాన్కు రాజమౌళి గుడ్న్యూస్
READ MORE : భారత్కు సొంత స్పేస్ స్టేషన్
READ MORE : టమాటా వైన్ తయారీకి ఇండియా సన్నాహం
READ MORE : ఇండియాలో అందుబాటులోకి హైస్పీడ్ రైళ్లు
[…] READ MORE: ఇండియాలో తొలికేసు నమోదు […]
[…] READ MORE: ఇండియాలో తొలికేసు నమోదు […]