HYDRA: సంచలనంగా మారన హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యలను పరిష్కరించేందుకు హైడ్రా గ్రీవెన్స్ను ఏర్పాటు రంగంసిద్ధం చేసింది. ఈనెల ఆరునుంచి నుంచి హైడ్రా ప్రధాన కార్యాలయం బుద్ధ భవన్లో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదు స్వీకరించనున్నారు. తొలిసారిగా దరకాస్తులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీసుకోనున్నారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్న 2:00 గంటల వరకు బాధితులు ఫిర్యాదులను సమర్పించవచ్చు. అంతేకాదు వారం రోజుల్లో హైడ్రా పోలీస్స్టేషన్ను ఏర్పాటుకు సర్వం రెడీ చేశారు. సంక్రాంతి నుంచి హైడ్రా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి తెచ్చేంకు సమాయత్తమయ్యారు.
నేడో, రేపో పీఎస్ ఏర్పాటుపై అధికారికంగా ఉత్తర్వులు వెలువడతాయని తెలుస్తోంది.
వారం రోజుల్లో పరిష్కారం..
HYDRA : హైడ్రా గ్రీవెన్స్ ప్రతీ సోమవారం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. హైడ్రా గ్రీవెన్స్లో వచ్చిన ఫిర్యాదులను కేవల 10 రోజుల్లోపు పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నారు. హైదరాబాద్లో కబ్జాకు గురైన కుంటలు, చెరువులు, నాలాల ఫిర్యాదులపై హైడ్రా ప్రత్యేక ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. న్యాయ వివాదాలకు తావు లేకుండా ఫిర్యాదులను పరిష్కరించాలని హైడ్రా భావిస్తోంది. ఎమ్మార్వోలు, రెవెన్యూ సిబ్బంది గ్రీవెన్స్లో పాల్గొనే లా ఏర్పాట్లు చేస్తున్నారు. వారు హాజరుకానిపక్షంలో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమాచారం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
సంక్రాంతికి హైడ్రా పోలీసు స్టేషన్…
HYDRA NEW DECISION: హైడ్రా పోలీసు స్టేషన్ ఏర్పటుకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ఇకనుంచి హైడ్రాకు సంబంధించిన కార్యకలాపాలన్నీ హైడ్రా పోలీస్స్టేషన్ ద్వారా నిర్వహించేందుకు హైడ్రా కమిషన్ రంగనాథ్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. సంక్రాంతి నుంచే పోలీస్స్టేషన్ ద్వారా సేవలను అందుబాటులో భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఫిర్యాదు స్వీకరణకు ఈమేరకు అన్ని శాఖల అధికారులు గ్రీవెన్స్లో పాల్గొననున్నారు. డీఎస్పీ స్థాయి అధికారి, ఎస్పీ స్థాయి అధికారి, సీఐలు, ఎస్ఐలు పోలీస్స్టేషన్లో అందుబాటులో ఉంటారని సమాచారం. హైడ్రా ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు దాదాపు ఐదువేలకు పైగా ఫిర్యాదు వచ్చాయి.
[…] READ MORE: హైడ్రా మరో కీలక నిర్ణయం […]