india bullet train

INDIA BULLET TRAIN: అతి త్వ‌ర‌లోనే ఇండియాలో బుల్లెట్ రైళ్ల ప‌రుగెత్తనున్నాయి. చైనా, జ‌పాన్‌, ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇవి దూసుకెళ్తున్నాయి. గంట‌కు 300 కిమీ. నుంచి 350కిమీతో ప‌ట్టాల‌పై ప‌రుగెడుతున్నాయి. తొంద‌ర‌లోనే మ‌నం కూడా బుల్లెట్ రైలులో ప్ర‌యాణించే దూరం ఎంతో దూరంలో లేదు. ఈ ఇదే విష‌యాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కూడా ధ్రువీక‌రించారు. తాజాగా చ‌ర్ల‌ప‌ల్లి రైలు టెర్మిన‌ల్‌ను ఆయ‌న వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తి రేపుతున్నాయి. ఇండియాలో కూడా బుల్లెట్ రైళ్లు, వందేభార‌త్ వంటి హైస్పీడ్ రైళ్లు మ‌రిన్ని అందుబాటులోకి వస్తాయంటూ హింట్ ఇచ్చారు. థాయిలాండ్, ఇండోనేషియా, ఇండియా: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు అభివృద్ధి దశలో ఉన్నాయి.

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..

INDIA BULLET TRAIN: బుల్లెట్ ట్రైన్ త‌యారులో ఇండియా వేగం మ‌రింత పెంచింది. 2025 లోనే ప్రాజెక్ట్ మొదటి దశ పూర్తయ్యే అవకాశం ఉంది. ముంబై-అహ్మదాబాద్ మార్గంలో తొలిసారిగా బుల్లెట్ ట్రైన్‌ను న‌డ‌పనుంది. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ (MAHSR) పేరుతో దీన్ని ప్రారంభించారు. 508 కిలోమీటర్లు దూరాన్ని గంట‌ల‌కు గ‌రిష్టంగా 320 కిమీ వేగంతో ప‌రుగెత్తేలా ప్రాజెక్టు నిర్వ‌హిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు జపాన్ నుంచి షింకన్‌సెన్ టెక్నాలజీ అందిస్తోంది. 2017లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. 2028 నాటికి అందుబాటులో కి వ‌చ్చేలా ల‌క్ష్యం నిర్ధేశించుకున్నారు. ముంబై, థానే, సూరత్, అహ్మదాబాద్ క‌లిపి మొత్తం స్టేషన్లు 12ను తొలి విడ‌త‌లో అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణ సమయం: 7 గంటల సమయాన్ని 2 గంటల 7 నిమిషాలకు తగ్గిస్తుంది.

రూ.ల‌క్ష కోట్ల వ్య‌యం…

ఇండియాలో రూ.1.1ల‌క్ష‌ల కోట్ల‌తో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును చేప‌ట్టారు. దీనికి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA) 80% నిధులు తక్కువ వడ్డీ రుణంగా అందిస్తోంది.

ప‌రిశీల‌న‌లో ఇతర ప్రాజెక్టులు ..

భారతదేశంలో ప‌లు ప‌లు ప్రాంతాల్ల్లో హై స్పీడ్ రైళ్ల‌ను న‌డిపేందుకు ఇండియ‌న్ రైల్వే యోచిస్తోంది. ఈమేర‌కు ప‌లు ప్రాంతాల‌ను ప‌రిశీలిస్తున్నారు.
దిల్లీ – వారణాసి: పొడవు: 865 కిమీ, ముంబై – నాగ్‌పూర్: పొడవు: 753 కిమీ, దిల్లీ – అమృతసర్ 459 కిమీ., చెన్నై – మైసూరు: పొడవు: 435 కిమీ. హైద్రాబాద్ – బెంగళూరు: పొడవు: పరిశీలన దశలోఉంది. మార్గాల్లో వేగంగా న‌డిచే రైళ్ల‌ను రైల్వే శాఖ ప‌రిశీలిస్తోంది.

బుల్లెట్ ట్రైన్లు క‌లిగిన దేశాలు..

INDIA BULLET TRAIN: బుల్లెట్ రైలును మొట్ట‌మొదటిసారిగి జపాన్ ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. షింకన్‌సెన్ 1964లో ప్రారంభించింది. అతిపెద్ద హైస్పీడ్ రైల్వే నెట్‌వ‌ర్క్‌ను చైనా సొంతం చేసుకుంది. గంట‌కు 350 కిమీ వేగంతో బీజింగ్-షాంగ్హై మార్గంలో న‌డుస్తోంది.  ఫ్రాన్స్  Train à Grande Vitesse బుల్లెట్ రైలు గంట‌కి 320 కిమీతో ప్యారిస్ – లియోన్, ప్యారిస్ – మార్సెల్ దూసుకుపోతోంది. జర్మనీICE (InterCity Express) 300 కిమీ/గం. బెర్లిన్ – మ్యూనిక్, హాంబర్గ్ – కొలొగ్న్ మార్గంలో న‌డుస్తోంది. ఇక దక్షిణ కొరియా KTX (Korea Train Express) 305 వేగంతో సియోల్ – బుసాన్ మార్గంలో. ఇటలీ Frecciarossa (Red Arrow) 300 కిమీ/గం రోమ్ – మిలాన్, రోమ్ – ఫ్లోరెన్స్ రూట్‌లో న‌డుస్తున్నాయి. స్పెయిన్ AVE (Alta Velocidad Española) కూడా 310 కిమీ/గంతో న‌డుస్తున్నాయి. మాడ్రిడ్ – బార్సెలోనా. యునైటెడ్ కింగ్‌డమ్, HS1 మరియు HS2 (ప్రస్తుతం అభివృద్ధి దశలో) 300 కిమీ/గం., తైవాన్ Taiwan High-Speed Rail (THSR) 300 కిమీ/గంతో న‌డుస్తున్నాయి.

 

READ MORE: ఒక్క‌సారి చార్జింగ్ చేస్తే 312 కి.మీ. ఇక బైక్‌ల‌తో ప‌నేంటి.. 

READ MORE: మ‌న మెద‌డు పెరుగుతోంది.. లాభ‌మా .. న‌ష్ట‌మా..

 

One thought on “INDIA BULLET TRAIN: ఇండియా బుల్లెట్ ట్రైన్‌”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *