హనుమకొండ జిల్లా కేంద్రం జూనియర్ డాక్టర్ల నిరసనలో హోరెత్తింది. హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి నుంచి కలెక్టరేట్ వరకు ప్లకార్డులతో నిరసన కార్యక్రమాలు చెప్పటారు. జూడాల నినాదాలతో శుక్రవారం నగరం దద్దరిల్లింది. వివరాల్లోకి వెళితే…
ఇటీవల ఓ వైద్య విద్యార్థి ని పై జరిగిన హత్యాచారాన్ని నిరసిస్తూ శుక్రవారం హనుమకొండ జిల్లా కేంద్ర లో జూడాల నిరసన తెలిపారు. హత్యాచారానికి పాల్పడిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కాకతీయ మెడికల్ కళాశాల జూనియర్ డాక్టర్లు డిమాండు చేసారు. ఈ మేరకు హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జూడాల రక్షణ కల్పించే కఠినమైన చట్టాలు తేవాలని నినదించారు.
నిరసన కార్యక్రమం లో వందలాది మంది జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు.
ఇటీవల కోల్ కత లోని జీఆర్ కర్ ఆస్పత్రిలో ఇటీవల 31 ఏళ్ల వైద్య విద్యార్థిని పై హత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ సంఘటనపై సోషల్ మీడియాలో జనం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇది ఎలా ఉండగా బుధవారం అర్ధరాత్రి జీ ఆర్ కర్ ఆస్పత్రిపై గురుతు తెలియని దుండగులు దాడి చేసారు. ఫర్నిచర్ , ల్యాబ్, విలువైన మిషన్లను ధ్వంసం చేసారు. ఈ ఘటనపై కేంద్రం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది
దేశ వ్యాప్తంగా నిరసనకు జూనియర్ డాక్టర్లు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బెంగాల్లో 24 గంటల బంద్ కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఆందోళనను జూడాల ముమ్మరం చేస్తున్నారు.