అవినీతి, అక్రమాలపై పోరాడిన వ్యక్తే.. అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. ఓ సామాన్యుడు(అన్నాహజారే) అవినీతి రహిత సమాజం కోసం పోరాడితే.. దానికి మరింత ముందుకు తీసుకెళ్లారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్(kejriwal). అవినీతిపై పోరుబాట పట్టిన కేజ్రివాల్ తాజాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఏకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అతడిని అరెస్టు చేయడం రాజకీయ దుమారం రేపుతోంది. ఇందులో అతడి పాత్ర ఉందా… లేదా.. అన్న విషయాన్ని పక్కనపెడితే ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో జైలు పాలవడం దేశవ్యాప్తంగా ప్రతీ సామాన్యుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజాయితీ పరులమని చెబుతూ ఇలా అడ్డదారులు తొక్కడాన్ని జీర్ణించుకోవడం కష్టమే. నిప్పులేందే పొగరాదు. మరోవైపు కేజ్రివాల్ అవినీతికి పాల్పడ్డారంటూ ఈడీ ఘంటా పథంగా చెబుతోంది. దీనికి కేజ్రీవాల్ షరామామూలే అన్నట్టు నాకేం తెల్వదు అంటూ సమాధానమిస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా అరెస్టు అయ్యారు. ఢిల్లీవాసులు నమ్మకంతో గెలిపిస్తే, ఈ రచ్చపై వారి మనసు కలతచెందుతోంది. కేజ్రివాల్ లాంటివారే ఇలా చేస్తే.. ఇంకా ఎవరిని నమ్మేదని వాపోతున్నారు.
తొమ్మిది సార్లు సమన్లు… ఎందుకు స్పందించ లేదు..
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో నిజంగా కుట్రదారుడేనా.. లేదంటే రాజకీయ కుట్రలో బలిఅయ్యారా.. అన్న ప్రశ్న దేశంలోని ప్రతీ ఒక్కరిలో మెదులుతున్న ప్రశ్న. సరే కేజ్రీవాల్ తప్పు చేయలేదనే అనుకుందాం.. ఆరోపణలు వచ్చిన ప్రతీసారి ఇదంతా తనపై కుట్ర అని చెబుతూ వచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఏకంగా తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసినట్టు ప్రకటించింది. వీటికి ఆయన ఎందుకు స్పందించ లేదు. ఈడీ పిలిచినప్పుడు ఎందుకు హాజరుకాలేదు.. వారి విచారణకు ఎందుకు సహకరించలేదు. ఇదే కేజ్రివాల్పై వైపు వేలెత్తి చూపేలా చేసింది. దీంతో పదోసారి సమన్లతోవచ్చిన ఈడీ ఏకంగా అతడిని అరెస్టు చేయాల్సి వచ్చింది. ఇప్పడు కేజ్రివాల్ ఏమి చెప్పినా విశ్వసనీయత ఉంటుందా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
ఏమిటీ మద్యం పాలసీ..
నూతన మద్యంపాలసీని తీసుకురావాలి ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ఢిల్లీ ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ 2021–22 సంవత్సరానికి ఈ మద్యం పాలసీని తీసుకురావాలని భావించారు. ఈ పాలసీ ప్రకారం మద్యం వ్యాపార రంగంలోకి ప్రైవేటు సంస్థలకు పెద్దపీట వేస్తూ.. నిబంధనలు సులభతరం చేయడం.. రుసుంలు తగ్గించడం, ఇతర వసతులు కల్పించడమే లక్ష్యం. మద్యం పాలసీతో రూ.9,500కోట్ల ఆదాయ టార్గెట్గా దీనికి క్యాబినెట్ ఆమోదించడం.. లెఫ్టినెంట్ గవర్నర్కు పంపినప్పుడు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ అనుమతితో విక్రయాలు జరపాలని పేర్కొన్నారు. దీంతో ఈ సమస్య జటిలంగా మారింది.
కేజ్రివాల్పై ఆరోపణలు
కొత్తమద్యం పాలసీతో కేజ్రివాల్(kejriwal)పై పలు ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీలో జరిగిన ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్యే కవిత సుమారు వంద కోట్ల వరకు వివిధ రూపాల్లో ముడుపులు ఇచ్చారన్నది ఈడీ వాదన. ఈ ముడుపులు ప్రభుత్వ ముఖ్యులకు అందాయని పేర్కొంటోంది. సౌత్ లాబీకి కల్వకుంట్ల కవిత ప్రాతినిధ్యం వహిస్తోందని, ఇందుకు శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసులు రెడ్డి సహకారం ఉందనేది ఈడీ వాదన. వీరితో కేజ్రివాల్ కుమ్మక్కయ్యారని తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయంటూ ఈడీ తాజాగా కేజ్రివాల్ను అరెస్టు చేసింది. 2015లో కేంద్ర హోం శాఖ అధికారుల బదిలీలు, భూమి, పోలీస్ విషయాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)కు అధికారం కట్టబెట్టడంతో కేంద్రం, ఆప్ ప్రభుత్వానికి మధ్యవైరం తారస్థాయికి చేరింది. చివరకు హైకోర్టు, సుప్రీంకోర్టులో సుదీర్ఘ న్యాయ పోరాటానికి కారణమైంది.
కేజ్రివాల్ ఘనకీర్తికి మరక..
హర్యానాలో పుట్టిన కేజ్రివాల్ ఐఐటీ ఖరగ్పూర్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. తర్వాత భారతీయ రెవెన్యూ సర్వీసులో పనిశారు. ప్రముఖ సామాజిక కార్యకర్తల అన్నాహజారే చేపట్టిన లోక్పాల్ బిల్లు, సమాచార హక్కు చట్టం పోరులో అరవింద్ కేజ్రివాల్ విశేషంగా పాల్గొన్నారు. దీంతో కేజ్రివాల్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. అంతేకాదు సమాచార హక్కు చట్టం తీసుకురావడం, పేదల ఆర్థికాభివృద్ధికి కృషి చేసినందుకుగాను 2006లో ఆయన్ను రామన్ మెగసేసె పురస్కారం వరించింది. ఆ తర్వాత 2012లో ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఏర్పాటు చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తర్వాత ఏడాది(2013)లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతోపాటు ఢిల్లీ సీఎంగా చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత 2014లో రెండో సారి పార్టీ అధికారంలోకి రావడంతో రెండోసారిగా సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అరవింద్ ఎన్నో సంక్షేమ పథకాలతో అనతికాలంలో ఢిల్లీవాసులు మదిని దోచుకున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా లిక్కర్ స్కాం కేసులో అరెస్టవడం బాధాకరం.
పార్టీ పరిస్థితి ఏంటి?
అరవింద్ కేజ్రివాల్ అరెస్టుతో ఢిల్లీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మొదటి నుంచి బీజేపీకి వ్యతిరేకంగా ఆప్ వ్యవహరిస్తూ వస్తోంది. కేజ్రివాల్ను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు ఎప్పటినుంచే బీజేపీ ఎదురుచూస్తోంది. ఈక్రమంలో మద్యం స్కాంలో ఆయన అరెస్టు కావడంతో ఇదే అదునుగా బీజేపీ అధిష్ఠాన పావులుకదుపుతోంది. పదేళ్లుగా అటు కేంద్రంలో బీజేపీ, ఇటు ఢిల్లీ రాష్ట్రంలో ఆప్ అధికారంలోన్నా.. కేజ్రివాల్ బీజేపీని గట్టిగానే ఢీకొట్టారు. అంతేకాదే ఏకంగా ప్రధాన మోది స్వరాష్ట్రంలో గుజరాత్తోపాటు పంజాబ్, గోవాలోనూ పార్టీకి విస్తరించారు. ఇది బీజేపీకి మరింత మింగుడు పడకుండా చేసింది. ఇప్పుడు అందివచ్చిన అవకాశాన్ని ఆ పార్టీ కచ్చితంగా అందిపుచ్చుకుంటుందనడంలో సందేహం లేదు. మరి ఆప్ ఏ దిశగా అడుగులు వేస్తుందో అన్నది ఆసక్తిగామారింది. అవసరమైన కేజ్రివాల్ జైలు నుంచే పాలన సాగిస్తారంటూ ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇది ఎంతవరకు సాధ్యమనేది తేలాల్సి ఉంది. గతంలో బీహార్లో దాణా కుంభకోణంలో లాలూప్రసాద్ యాదవ్ అరెస్టు అయినప్పుడు తన భార్య రబ్డీ దేవిని సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. మరి ఇదే సూత్రాన్ని కేజ్రీవాల్ టీం అమలు చేస్తుందా అన్నది వేచిచూడాలి.
ఎక్కువగా చదివిన వారు:
1. బీజేపీకి 400 ఎంపీ సీట్లు గెలవడం సాధ్యమేనా?
2. తెలంగాణ తాజీ మాజీ గవర్నర్ తమిళిసై పోటీ చేసేది అక్కడి నుంచేనా..
3. ఆంధ్ర ప్రదేశ్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తప్పటడుగు వేశాడా..
4. వరంగల్ ఎంపీ సీటుపై కాంగ్రెస్ -సీపీఐ మల్లగుల్లాలు
[…] […]
[…] […]