kerala-rain  ప్రకృతి అందాలతో అలరారే కేరళ రాష్ట్రం ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడుతోంది. అందాల గుట్టలను చూసిన కేరళ శవాల గుట్టలను చూసి కన్నీరుపెడుతోంది. సోమవారం అర్ధరాత్రి కొండచరియలు విరుచుకుపడడంతో బుదరతో కూడిన వరదనీరు వందలాది మందిని పొట్టన పెట్టుకుంది. ఎటుచూసినా తమ వారిని కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న బంధువుల ఆర్తనాదాల దృశ్యాలు దేశ వ్యాప్తంగా కలిచివేస్తోంది. ఇదిలాఉంటే వరదలో కొట్టుకుపోయిన మృతుల సంఖ్యరోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం నాటికి దాదాపు 204 మంది మృతి చెందినట్టు కేరళ వైద్య ఆరోగ్యశాఖా పేర్కొంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పేర్కొంది. కాగా, 200 మంది గల్లంతైనట్టు పేర్కోగా, మరో 200 మంది గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు పేర్కొంది. ఇప్పటి వరకు 5,592మందిని రక్షించగా, 8వేలకు పైచిలుకు మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే టీ, కాఫీ తోటలో పనులకు వెళ్లిన కూలీల చాలా మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. నేవీ, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ తదితర సహాయక బృందాలు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నాయి. మృతదేహాలను గుర్తించేందుకు జాగిలాలను వినియోగిస్తున్నారు. ఎటుచూసినా బురదతో నిండిపోవడంతో ప్రత్యేక విమానంలో తాత్కాలిక వంతెలను తరలించి, క్షతగాత్రులను సురక్షిత ప్రాంతాలకు సహాయక బృందాలు తరలిస్తున్నాయి. మృతులకు నివాళిగా కేరళ ప్రభుత్వం రెండు రోజుల సంతాప దినాలను ప్రకటించింది.

నామరూపాల్లేనే గ్రామాలు

kerala-rain కేరళ రాష్ట్ర వయనాడ్‌ జిల్లా మండక్కై, అట్టామల, చూరాల్‌మల, నూల్‌పూజా, మొప్పడి గ్రామాలు నామరూపాల్లేకుండా పోయాయి. సోమ, మంగళవారం భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడడంతో ఆయా గ్రామాలు ఆనవాళ్లు లేకుండాపోయాయి. మెప్పడిలోని మండక్కైలోనే మృతుల సంఖ్య ఎక్కువగా ఉండడం విషాదాన్ని నింపుతోంది. చూరాల్‌మల వద్ద నున్న ఎకైక వంతెన వరదకు కొట్టుకుపోవడంతో పాటు రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సహాయక సిబ్బంది హెలికాప్టర్లను వినియోగించి, సిబ్బందిని తరలించాల్సి, సహాయక చర్యలు తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

అరేబియానే కారణమా?

ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడి గ్రామాలపై విరుచుకుపడిన వరద దెబ్బకు కారణాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. అరేబియా సముద్ర ఉష్ణోగ్రతలు, దట్టమైన మేఘాల ఏర్పాటుకు దారితీస్తోందనే అంచనాకు వస్తున్నారు. బహుశా ఇదే పరిస్థితి కేరళలోని వయనాడ్‌ జిల్లాలో వర్ష బీభత్సానికి కారణమై ఉండోచ్చని భావిస్తున్నారు. ఇదే పరిస్థితిని గుర్తించినట్టు అడ్వాన్స్‌డ్‌ సెంటర్‌ ఫర్‌ అట్మాస్‌ఫరిక్‌ రాడార్‌ రీసెర్చ్‌ అండ్‌ టెక్నాలజీ డైరెక్టర్‌ అభిలాష్‌ పేర్కొన్నట్టు ఓ దిన పత్రిక పేర్కొంది.

  • నదిలో తేలిన మృతదేహాలు..
  • వయనాడ్‌ జిల్లాలో ప్రకృతి బీభత్సానికి గల్లంతైన మృతదేహాలు సమీపంలోని నదిలో తేలియాడుతుండడం చూపరును కలిచివేస్తోంది. ఇప్పటికే మలప్పురం చలియార్‌ నదిలో దాదాపు 15 మృతదేహాలను గుర్తించినట్టు తెలిసింది. ఘటనా స్థలానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న నదిలో మృతదేహాలు తేలియాడుతూ కనబడడం కన్నీరుపెట్టిస్తోంది. ఇంకా సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

నేడు వయనాడ్‌కు రాహుల్‌, ప్రియాంక

వయనాడ్‌ జిల్లాలో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలు గురువారం(ఆగస్టు1, 2024) సందర్శించనున్నారు.
–––––––––––––

నోట్‌:  తాజా వార్తల అప్‌డేట్‌ కోసం జనదూత వెబ్‌సైట్‌ను విజిట్‌ చేయండి.

READ MORE: ఇండియా..  ట‌మాటా వైన్ త‌యారీ ..

SILKSMITHA: మ‌ళ్లీ రాబోతున్న సిల్క్‌స్మిత

CHIRANJEEVI : మెగస్టార్‌ చేతికి రక్తపుమరక.. టాలీవుడ్‌ షాక్‌..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *