TOLLYWOOD: టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్కు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. అల్లు అర్జున్పై నంద్యాలలో నమోదైన కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసును తాజాగా హైకోర్టు కొట్టివేసింది. గత అసెంబ్లీ 2024)ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘించారనే కారణంతో నంద్యాల పోలీసులు అప్పట్లో అర్జున్పై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ అర్జున్, మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ అక్టోబరు 25న విచరాణకు వచ్చింది. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఎఫ్ఐఆర్ ఆధారంగా నవంబరు 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి నవంబరు 6న తుది తీర్పు ఇవ్వనున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఈ క్రమంలో నేడు (బుధవారం) కేసు విచారణకు వచ్చింది. విచారించిన కోర్టు అల్లుపై కేసును కొట్టివేసింది. దాంతో అల్లు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
అసలు ఏం జరిగిందంటే..
గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ నంద్యాల శాసనసభ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆయన ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా నంద్యాలలో అర్జున్, రవి ర్యాలీ నిర్వహించారంటూ రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అర్జున్, రవిలపై కేసు నమోదు చేశారు. కేసు విచారించిన హై కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. దాంతో అటు అల్లు, ఇటు శిల్పరవి అభిమానులు సంబరాల్లో మునిగారు.
వెంకన్న సేవలో సాయి ధరమ్ తేజ్..
కలియుగదైవం, ఏడుకొండలవాడైన తిరుమల వేంకటేశ్వర స్వామిని మెగా హీరో సాయి ధరమ్ తేజ్ దర్శించుకున్నారు. అలిపిరి నుంచి ఆయన నడకన తిరుమల చేరుకున్న సన్నిధి చేరుకున్నారు. బుధవారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం తీసుకున్నారు. అనంతరం వెంకన్న తీర్థప్రసాదాలు అందుకున్నారు. పట్టువస్త్రంతో వేద పండితులు సాయిని సత్కరించారు. మరోవైపు అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి కూడా తిరుమలేశుడిని దర్శించుకున్నారు. సాయి దుర్గ తేజ్ కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం 18. రోహిత్ కేపీ దర్శకత్వం (డెబ్యూ) వహిస్తున్న ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని హనుమాన్ మేకర్స్ ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కిస్తున్నారు. కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా(TOLLYWOOD)చిత్రంగా వస్తోంది.
బిగ్బాస్ నుంచి గంగవ్వ ఔట్?
యూ ట్యూబ్ స్టారు గంగవ్వకు బిగ్బాస్ షాక్ ఇచ్చాడు. మాటీవీలో ప్రసారం అవుతున్న బిగ్బాస్ సీజన్-8లో ఆమెకు వీడ్కోలు పలకనుంది. ఇప్పటికే తొమ్మిది వారాలు కంప్లీట్ చేసుకున్న బిగ్బాస్ షో పదో వారంలోకి అడుగు పెట్టింది. ఈ వారం నామినేషన్స్ కూడా రసవత్తరంగా సాగుతున్నాయి. ఈసారి ఏడుగురు నామినేషన్ కంటెస్టెంట్స్ ఉన్నారు. నిఖిల్, పృథ్వీ, యష్మీ, ప్రేరణ, విష్ణుప్రియ, హరితేజ, గౌతమ్ నామినేషన్స్ లిస్టులో ఉన్నారు. ఈ వారం హౌజ్ నుంచి వెళ్లేవారిలో గంగవ్వ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గత సీజన్లో మెయిన్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన గంగవ్వ హౌస్ వాతావరణానికి అలవాటుపడలేకపోయింది. దీంతో మధ్యలోనే బిగ్బాస్ షో నుంచి బయటకు వచ్చింది. మళ్లీ ఈ సీజన్లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. దాంతో ఈసారి గంగవ్వ బిగ్బాస్-8 విన్నర్ అంటూ ఓ దశలో ప్రచారమూ సాగింది. ఈక్రమంలో ఆమెకు బిగ్బాస్ షాక్ ఇవ్వనుందని తెలుస్తోంది. గంగవ్వ వయసు దృష్ట్యా ఫిజికల్ టాస్కులు ,గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడంపై దూరం పెట్టాడు బిగ్ బాస్. హౌజ్లో ఉంటున్న గంగవ్వకు మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు తెలుస్తుంది. ఒళ్లు నొప్పులు, కాళ్ల నొప్పులు తనను ఇబ్బంది పెడుతున్నయంటూ గత శనివారం ఎపిసోడ్లో గంగవ్వ తన బాధను నాగార్జునకు మొరపెట్టుకుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి చూస్తుంటే.. సెల్ఫ్ ఎలిమినేషన్ ద్వారా మళ్లీ హౌస్ నుంచి బయటకు పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ వారం నామినేషన్ అయిన వారిలో ఎక్కువ ఓటింగ్తో గౌతమ్ మొదటి స్థానంలో ఉండగా.. నిఖిల్ రెండో స్థానంలో ఉన్నాడు. మరోవైపు యాంకర్ విష్ణు ప్రియ, హరితేజ చివరి రెండుస్థానలతో డేంజర్ జోన్లో ఉన్నారు.
–ఎక్కువ మంది చదివినవి.. మీరు క్లిక్ చేసి చదవండి–
వాటిని.. డ్రీమ్ గర్ల్ హేమామాలిని బుగ్గలుగా మారుస్తా..
వంద రేప్లు చేశాడు.. వారంతా టాప్ హీరోయిన్స్ అయ్యారు..
తెలుగు వారిని అంత మాటంటావా.. నటి కస్తూరిపై ఫైర్
విస్తరిస్తున్న షుగర్ డాడీ.. ఆ పనికోసమేనా..
మహేష్ బాబు కోసం రాజమౌళి వెతుకులాట
న్యూ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీయార్
మన మెదడు పెరుగుతోంది.. లాభమా .. నష్టమా..