MANCHI/MEDIA: మంచు వారి కుటుంబం వివాదాలు తెలుగునాట హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. గొడవకు అసలు కారణం పూర్తి స్థాయిలో తెలియక పోయినా మీడియాలో రోజుకో కథనం ప్రచారం చేయడంతో ఏది నిజమో.. ఏది అబద్దమో.. తెలియక మరింత గందరగోళం నెలకొంది. మంచు కుటుంబ సమస్యను జనానికి చూపించడంలో మీడియా చేసిన హడావుడి ఇప్పుడు మరో చర్చకు దారితీస్తోంది. మీడియా కూడా ఒక దశలో హద్దులు దాటడం.. తన పరిధిని విస్మరించడం.. ఓ కుటుంబ సమస్యను సమాజానికి చూపించడంలో ఇంతటి అత్యుత్సాహం జర్నలిజానికి కాస్త మరకను తెచ్చినట్టయింది. గతంలో ప్రముఖ నటి శ్రీదేవి మృతి విషయాన్ని ప్రపంచానికి చూపే విషయంలో మీడియా కొత్తపుంతలు తొక్కడం.. అది వికటించి జనం ముందు నవ్వులపాలవడం అందరికీ తెలిసిందే. టీఆర్పీ రేటు కోసమే.. లేక వీవర్స్‌కు కొత్త రకంలో విషయం చెప్పడం కోసమే.. చేసే కొన్ని పనులు జర్నలిజం జర్నలిజాన్నే ప్రశ్నించే స్థాయికి తెస్తోంది. సెలబ్రిటీలు, సున్నితమైన సంఘటన వివరాలను వెల్లడించే విషయంలో ఇప్పటివరకు సోషల్‌ మీడియా ఇష్టారాజ్యంగా వ్యవహరించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పెద్ద మీడియా అని చెప్పునేవారు కూడా సోషల్‌ మీడియాను మించి నియంత్రణ కోల్పోయి అత్యుత్సాహం చూపడం ప్రజల్లో జర్నలిజం విలువలను మరోసారి ప్రశ్నార్థకం చేసింది. పద్మశ్రీ, ఎక్స్‌ రాజ్యసభ సభ్యుడు మంచు మోహన్‌బాబు కుటుంబ వ్యవహారంలో మీడియా చేసిన హడావుడిపై మీడియా స్వీయ నియంత్ర కోల్పోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మంచు ఫ్యామిలీ సెలబ్రిటీ కావచ్చు.. కానీ ప్రస్తుతం జరుగుతున్నది వారి కుటుంబ సమస్య. ఏ కుటుంబంలోనైనా మనస్పర్థలు, గొడవల సహజం. కలిసిపోవడం కూడా అంతే సహజం. ఓ కుటుంబ వ్యవహారంలో ఇంత ఉత్సాహం దేనికన్న ప్రశ్న టీవీల ముందు కూర్చున్న వారికి, పేపర్లు తిరగేసిన వారి మెదడును తొలుస్తోంది.

READ MORE:  హెచ్‌ఐవీకి చెక్‌.. దొరికిన మందు..

ఉత్సాహమా.. అత్యుత్సాహమా…

MANCHI/MEDIA:  సెలబ్రిటీల విషయంలో కొన్ని సందర్భాల్లో మీడియా చూపేది ఉత్సాహమా.. అత్యుత్సాహమా అన్న ప్రశ్న ప్రతీ ఒక్కరి మెదడును తొలుస్తుంటుంది. మంచు మోహన్‌బాబు కుటుంబ విషయంలోనూ అదే జరుగుతోందని అనిపిస్తోంది. ఇప్పటివరకు మంచు కుటుంబం వారి గొడవలకు ఇదే కారణమంటూ స్పష్టంగా అటు మోహన్‌బాబు గానీ, ఇటు మనోజ్‌, విష్ణు కానీ స్పష్టం చేయలేదు. తన కొడుకు మనోజ్‌కు మోహన్‌బాబు ఓ ఆడియో పంపించారు. అందులో మీడియా అంశం రావడం చూస్తే ఏ స్థాయిలో ఆయన మనోవేదన చెందారో తెలుస్తుంది. లేనిది ఉన్నట్టు.. నిజానిజాలు తెలియకుండానే మీడియా ఇష్టం వచ్చినట్టు రాస్తోందని ఆడియోలో స్పష్టం చేశారంటే అది ఆయన్ను ఏస్థాయిలో మనోవేదనకు గురిచేసిందో ఒక్కసారి మీడియా ఆలోచిన చేయాలి.

READ MORE: మెగాస్టార్‌ చిరంజీవికి చేతికి రక్తపు మరక

మోహన్‌బాబు మీడియాపై చిందులు…

MANCHI/MEDIA: నాలుగురోజుల నుంచి మీడియా ఫోకస్‌ మొత్తం మంచు ఫ్యామిలీ గొడవ చుట్టూ తిరుగుతోంది. ఇప్పటివరకు మోహన్‌బాబు ఎక్కడా మీడియా ముందుకురాలేదు. ఈ విషయంలో ఆయన కాస్త సంయమానం పాటించారనే చెప్పాలి. తర్వాత తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం కూడా ఆయన ఎక్కడా మీడియా ముందు చెప్పలేదు. ఆయన కోణంలో అది తన కుటుంబ సమస్యగానే భావించారు. కానీ, మీడియానే అణువణువు ప్రచారం చేస్తుండడంతో ఆయన సహనం కోల్పోయారు. ఫలితంగా మంగళవారం రాత్రి మీడియాపై చిందులు తొక్కారు. ఆయన చేసిన పని తప్పుకావొచ్చు.. కానీ మీడియా సున్నితమైన అంశాన్ని ఇలా చర్చచేయడం ఎంతవరకు సబబు. మీడియాకు కొన్ని ఆంక్షలు, స్వీయ నియంత్రణ ఉంటుందనే విషయం విస్మరిస్తే ఇదిగో ఇలా మీడియా జనం మద్దతను, విశ్వసనీయతను కోల్పోవాల్సి వస్తుంది. మోహన్‌బాబు విషయంలో ఇదే జరిగిందనడంలో ఎలాంటి అనుమానం లేదు. మీడియాపై కోపంతో ఊగిపోయిన మోహన్‌బాబు కాసేపటికే ఆస్పత్రిపాలయ్యారు. మంచు కుటుంబ గొడవను మీడియా అనవసర రాద్ధాంతం చేస్తుందని తెలుగునాట జనం బాహాటంగానే పేర్కొంటున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *