MEGHALAKODA: విశాఖపట్నం: ప్రకృతి అందాలకు నెలవు ఆంధ్ర ప్రదేశ్. ఇక్కడ ఎన్నో ప్రాంతాలు పర్యాటక కేంద్రంగా అలరిస్తున్నాయి. వీటిలో ఒకటి మాడగడ మేఘాలకొండ. దీనికి ఆంధ్రా ఊటీగా పేరుగాంచింది. అరకులోయలో మేఘాల కొండ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పుడు మేఘాల కొండకు అనుకోని కష్టం వచ్చింది. మేఘాల కొండపై అటవీ శాఖ కన్నుపడింది. ఇటీవల దేశవ్యాప్తంగా పర్యాటకపరంగా ఫేమస్ కావడంతో అరకులోయ మండలం మాడగడ మేఘాలకొండకు అటవీశాఖ బ్రేక్ వేసింది. మాడగడ ప్రాంతం తమ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఉందని ఇతరులు ప్రవేశించరాదని అటవీశాఖ బోర్డు పెట్టేసింది. ఈ ప్రాంతానికి సందర్శకులు తాగికి పెరగడంతో రూ.16 కోట్లతో పాడేరు ఐటీడీఏ నిర్మాణ పనులను ఇటీవలే చేపట్టింది. అయితే ఈ ప్రాంతం అడవి శాఖదంటూ ఆ శాఖ బోర్డు పెట్టేసింది. దీంతో పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వందల వాహనాలు, వేల సంఖ్యలో పర్యాటకులు, సందర్శకులో కిటకిటలాడే మేఘాలకొండ ఇప్పుడు వెలవెల బోతోంది. ఈ హఠాత్పరిణామంతో మేఘాల కొండను ఆధారం చేసుకుని బ్రతుకుతున్న మాడగడ గ్రామస్తులు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు.
మేఘాల కొండ అందాలు…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన ప్రాంతంలో ఉంది ఈ మేఘాల కొండ(MEGHALAKODA). దీనికి క్లౌడ్స్ హిల్ గా పిలుస్తారు. ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన వంజంగికి కొండల్లో ఈ ప్రాంతం ఉంది. కొండపైకి వెళితే.. మబ్బు ల్లో ఉన్నట్టు ఉంటుంది. ఎటు చూసినా మబ్బులు(క్లౌడ్) మీది నుంచి వెళ్లడం కొత్త అనుభూతిని కలిగిస్తుంది. చుట్టూ మబ్బులు సముద్రంలా.. అలల్లా కనిపిస్తుండడం విశేషం. అందుకే ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటిడిఎ) మూసివేయడంతో సందర్శకులు నిరాశ చెందుతున్నారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎదురు చూసే పర్యాటకులు.. వేకువజామున కొండల మధ్యలో నుంచి వచ్చే పొగమంచును చూసి పరవశించి పోతుంటారు. అరకులోయ మండలం లంతంపాడు సమీపంలో ఉన్న కొండపై నుంచి చూస్తే తెల్లటి మేఘాలు కొండల మధ్యలో నుంచి వెళ్తూ చూపరులను ఆకట్టుకుంటాయి.
– క్లిక్ చేసి ఇవి కూడా చదవండి-
ఇంటింటి సర్వే డేటా భద్రమేనా.. అసాంఘిక శక్తుల చేతిలోకి వెళ్తే..
కేదార్నాథ్ ఆలయం మూసివేత..ఎప్పుడు.. ఎందుకంటే..
విస్తరిస్తున్న షుగర్ డాడీ.. ఆ పనికోసమేనా..
మహేష్ బాబు కోసం రాజమౌళి వెతుకులాట
న్యూ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీయార్
బీజేపీలో ముసలం.. నెక్ట్స్ బాస్ ఎవరంటే..?