MISS EARTH 2024: మిస్త్‌ ఎర్త్‌ 2024 విజేతగా ఆస్ట్రేలియాకు చెందిన జెస్సికా లేన్‌ నిలిచింది. శనివారం పరానాక్‌ సిటీలో జరిగిన కోవ్‌ మనీలాలో మిస్‌ ఎర్త్‌–24లో జెస్సికా లేన్‌ మిస్‌ ఎర్త్‌ కిరీటాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు కేరింతలతో ఆడిటోరియం దద్దరిల్లింది. మిస్త్‌ ఎర్త్‌–24లో 80 మంది పోటీ పడగా తొలిసారిగా ఆస్ట్రేలియాసుందరి జెక్సినా సొంతం చేసుకుంది. జెస్సికా జర్నలిస్టు, న్యాయవాది కూడా. జెస్సికా పేరు ప్రక‌టించ‌గానే ఆహ్వానితులు కేరింత‌లు, చ‌ప్ప‌ట్ల‌తో అభినంద‌న‌లు తెలిపారు.

మిస్‌ ఎర్త్‌ ..

మిస్‌ యూనివర్స్‌, మిస్‌ వరల్డ్‌, మిస్‌ ఇంటర్నేషన్‌ పోటీల తర్వాత అత్యంత ప్రాధాన్యమున్నపోటీ మిస్‌ ఎర్త్‌(MISS EARTH). కానీ మిస్‌ ఎర్త్‌ ఎంపిక డిఫరెంట్‌గా ఉంటుంది. పర్యావరణపై అవగాహన, న్యాయ వాదాన్ని పెంపొందించిన ఈ పోటీ ప్రధాన ఉద్దేశం. ఈ అందాల పోటీలను ఏప్రిల్‌–3, 2001లో ప్రారంభమైంది. దీని ప్రధానకార్యాలయం మనీలా ఉండగా, కార్యస్థానం ఫిలిప్పీన్స్‌లో ఉంది. దీనికి ప్రెసిడెంట్‌గా రామోస్‌ మోన్జోన్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా లోరైనషూక్‌ వ్యవహరిస్తున్నారు. పర్యావరణ సమస్యలు, స్థిరత్వంపై దృష్టి పెడతారు.

పోటీ దారులు..

మిస్‌ఎర్త్‌ అందాల పోటీలో బరిలో నిలచిన అందగత్తెలు ప్రత్యేక అలవాట్లను కలిగి ఉండాలి. పోటీదారులు ప్రపంచ వ్యాప్తంగా బీచ్‌ల పరిశుభ్రత, చెట్ల పెంపకం, పర్యావరణ విద్య, పర్యావరణ ప్రచారం తదితర కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. విజేత తను పర్యావరణ ప్రతినిధిగా వ్యహరిస్తారు.

మిస్ ఎర్త్ విజేతలు

MISS EARTH : 2001 – సింథియా గైలర్ (ఎక్వడార్), 2002 – కర్లా హెన్రీ (ఫిలిప్పీన్స్), 2003 – డానియెల్ డి లా సీరా (మెక్సికో)
2004 – షాండి ఫినెసీ (యునైటెడ్ స్టేట్స్), 2005 – నటాలీ గ్లెబోవా (కెనడా), 2006 – జెసికా ట్రిస్కో (కెనడా), 2007 – జెసికా న్యూటన్ (పెరూ), 2008 – కవితా చన్నే (భారతదేశం), 2009 – రియో మోరి (జపాన్)
2010 – నికోల్ ఫేరియా (భారతదేశం), 2011 – ఇజా కాళ్జడో (ఫిలిప్పీన్స్), 2012 – బ్రిటనీ బీవిస్ (యునైటెడ్ స్టేట్స్), 2013 – కరోలినా కొర్కి (పోలాండ్), 2014 – మియా మామానూ (ఇండోనేషియా)
2023 – మియా మామానూ (ఇండోనేషియా), 2024- జెస్సికా లేనా

తొలి విజేత సింథియా గైల‌ర్‌..

మిస్ ఎర్త్ పేజెంట్ మొదటి సారి 2001లో ఆరంభ‌మ‌య్యాయి. తొలి విజేత‌గా ఎక్వడార్ కు చెందిన సింథియా గైలర్ నిలిచారు. తన దేశంలో పర్యావరణ స‌మ‌స్య‌ల పరిష్కారాలను తీసుకొచ్చారు. ప్ర‌తీ ఏడాది వేర్వేరు దేశాల నుంచి అభ్యర్థులు పోటీల్లో పాల్గొనడం, పర్యావరణ, సోషల్ ఇష్యూలపై చర్చలు సాగించడం విశేషం.

విజేతల బాధ్యతలు

మిస్ ఎర్త్ విజేతలు కేవలం పర్యావరణ ప్రయోజనాలపై అవగాహన పెంచే కాకుండా, వారు పర్యావరణ రక్షణ కోసం అంతర్జాతీయంగా అనేక చారిటి ప్రాజెక్టులను, ప్రచార కార్యక్రమాలను కూడా ప్రోత్సహిస్తారు. వారు అనేక పర్యావరణ సంస్థలతో కలిసి పనిచేస్తూ, వనరుల నిర్వహణ, కచరా తగ్గింపు, సస్టెయినబుల్ ఎనర్జీ వంటి అంశాలను ప్రోత్సహిస్తారు.

–ఎక్కువ మంది చదివినవి.. మీరు క్లిక్‌ చేసి చదవండి–

విషాదంలో సినీ ఇండ‌స్ట్రీ.. ప్ర‌ముఖ న‌టుడు క‌న్నుమూత‌

మ‌న మెద‌డు పెరుగుతోంది.. లాభ‌మా .. న‌ష్ట‌మా..

కేదార్‌నాథ్ ఆల‌యం మూసివేత‌..ఎప్పుడు.. ఎందుకంటే..

రికార్డు సృష్టించిన అయోధ్య

దొరికిన కుంభకర్ణుడి ఖడ్గం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *