NTPC BAMBOO POWER విద్యుత్రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న జాతీయ థర్మల్ విద్యుత్తు సంస్థ (ఎన్టీపీసీ) మరో అడుగు ముందుకు వేసింది. పర్యావరణ హితంగా విద్యుత్ ఉత్పత్తుకి కీలక నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛ ఇంధన ఉత్పత్తి చేయడంలో భాగంగా దేశంలోనే తొలిసారి వెదురుతో వెదురుతో కరెంట్ తయారు చేసేందుకు రెడీ అయింది. విద్యుదుత్పత్తి కోసం బొగ్గుతోపాటు వెదురును కలిపి మండించి కరెంట్ను తయారు చేస్తారు. ఇందుకోసం మహారాష్ట్రలోని షోలాపూర్లోని థర్మల్ విద్యుత్కేంద్రంలో మొదటిసారిగా ఈ ప్రక్రియను చేపట్టేందుకు సమాయత్తమవుతోంది. ఇదే విషయాన్ని తాజాగా సంబంధిత అధికారులు వెల్లడించడంతో ఎన్టీపీసీ మరో ఘనత సాధించేందుకు రెడీ అయినట్టయింది. షోలాపూర్ ప్లాంట్ 1320 మెగావాట్ల సామర్థ్యంతో రెండు థర్మల్ యూనిట్లతో పనిచేస్తోంది. ఇందులో భాగంగా బ్యాంబు మరియు ఇతర బయోమాస్ లను సహకార ఇంధనంగా ఉపయోగిస్తున్నారు.
షోలాపూర్లోని సూపర్ థర్మల్ విద్యుత్కేంద్రంలో
NTPC BAMBOO POWER ఇక్కడి షోలాపూర్లోని సూపర్ థర్మల్ విద్యుత్కేంద్రంలో బయోమాస్(వెదురు)తో విద్యుత్ ఉత్పత్తి చేయాలంటూ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఎన్టీపీసీకి లేఖ రాశారు. ఉత్పత్తికి అవసరమైన వెదురును రాష్ట్రంతోపాటు, షోలాపూర్ మరియు సమీప ప్రాంతాల్లోని రైతుల నుంచి కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులు కూడా చెబుతున్నారు.
బొగ్గును తగ్గించే ప్రయత్నం…
NTPC BAMBOO POWER థర్మల్ పవర్ తయారుకు విరివిగా బొగ్గుని వినియోగిస్తున్నారు. ఒక కిలో బొగ్గును మండించడం వల్ల సుమారుగా 2.08 కిలోల కార్బన్ వెదజల్లుతుంది. అ లెక్కన ఏటా షోలాపూర్ ప్లాంట్లో 40 లక్షల టన్నుల బొగ్గును వినియోగిస్తున్నారు. అంటే కర్బన ఉద్ఘారాలు భారీస్థాయిలో వెదల్లుతున్నాయి. వీటికి చెక్ పెడుతూ బొగ్గుతోపాటు వెదరును మండించి విద్యుత్ను తయారు చేసేందుకు ఎన్టీపీసీ ముందుకువచ్చింది.
విదేశాల్లో భారీగా తగ్గిన థర్మల్
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా థర్మల్ విద్యుత్ తయారును ఆయా దేశాలు తగ్గించుకుంటూ వస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇండియాలో కూడా ఇప్పటికే పరోగతి సాధించింది. తాజాగా షోలాపూర్ బయోమా్సగా వెదురును వినియోగించాలని నిర్ణయించారు. ఈక్రమంలో వెరుదు ఉత్పత్తిని భారీగా పెంచాలని ఎన్టీపీసీ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రైతులతో ఒప్పందం కుదుర్చుకుని 50ఏళ్ల పాటు వెదురు కొనేలా ఒప్పందం చేసుకునేందుకు ఎన్టీపీసీ ముందుకువచ్చింది. ఎన్టీపీసీ చొరవతో స్థానిక రైతులు ఆనంతం వ్యక్తం చేస్తున్నారు. లక్ష హెక్టార్లలో వెదురు సాగుకు రైతులు ముందుకువస్తారని ఎన్టీపీసీ భావిస్తోంది.
READ MORE: అలెర్ట్.. అలెర్ట్..