నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు తెరంగేట్రం చేయబోతున్నాడు. దీంతో నందమూరి వంశం నుంచి నాలుగోతరం కథానాయకుడిగా వెండితెరపైకి అడుగుపెట్టనున్నాడు. మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌమడు నందమూరి తారక రామారావు నట వారసుడిగా తెరపై మెరవనున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్‌ కుమారుడు బాలకృష్ణ, ఆయన మనవలు జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌, తారకరత్నం, చైతన్యకృష్ణ ఇండస్ట్రీలో ఉన్నారు. ముఖ్యంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ స్టార్‌ హీరోగా స్థిరపడగా, విభిన్న కథనాలతో ప్రొడ్యూసర్‌గా, హీరోగా కల్యాణ్‌రావు తన సత్తా చాటుతున్నాడు. వీరి బాటలో మరో నటవారసుడు తెలుగుతెరపై అడుగుపెట్టనున్నాడు. ఎన్టీఆర్‌ కుమారుడు దివంగత నిర్మాత నందమూరి జానకిరామ్‌ కుమారుడు నందమూరి తారక రామారావు( ఎన్టీఆర్‌) హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రముఖ డైరెక్టర్‌ వైవీఎస్‌ చౌదరి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. న్యూ టాలెంట్‌ రోర్స్‌ పతాకంపై యలమంచి గీత నిర్మిస్తున్నారు. ఈమేరకు చిత్ర యూనిట్‌ యూటూబ్‌లో హీరో న్యూ లున్‌కు రివిల్‌ చేశారు. ఈ మేరకు 95సెకండ్ల వీడియోలో వివిధ లుక్‌లో ఎన్టీయార్‌ లుక్స్‌ను విడుదల చేశారు. ఈనేపథ్యలో డైరెక్టర్‌ వైవీఎస్‌ చౌదరి ఎక్స్‌ వేదికగా నూతనంగా హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఎన్టీయార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ుఇన్‌ గాడ్‌ వీ ట్రస్ట్‌ ఎన్టీఆర్‌ అంటూ పోస్టు చేశారు.

కాగా ఎన్టీఆర్‌ లుక్‌పై సినీ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఎన్టీయార్‌ అచ్చం బాలీవుడ్‌ ఉన్నాడంటూ ప్రచారం సాగుతంది. హిందీ నటుడు టైగర్‌ షరాఫ్‌ లక్‌ కనిపిస్తోందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలం తర్వాత వైవీఎస్‌ దర్శకత్వంలో సినిమా రావడంతో ఆయన ఫ్యాన్స్‌ఖుషీ అవుతున్నారు. అదికూడా నందమూరి నాలుగోతరం నటుడిని హీరోగా పరిచయం చేస్తుండడంతో ఫిదా వుతున్నారు.

ఎన్టీయార్‌ ప్రతిజ్ఞ…
నందమూరి తారకమారావు అనునేను ఊహ తెలిసినప్పటి నుంచి నటన ఇష్టం పెంచుకుని, 18 నెలల నుంచి వైవీఎస్‌ వద్ద వివిధ విభాగాల్లో శిక్షణ పొంది. మన చలన చిత్ర పరిశ్రమ పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని..దాని యొక్క సమగ్రతను కాపాడుతానని.. అంటూ తన గురించి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *