OLYMPICS : ఇప్పుడు మెగా ఈవెంట్కు ఇండియా రెడీ అవుతోంది. అంతర్జాతీయ వేదికపై భారత్ చరిష్మాను చాటేందుకు ఉవ్వీళ్లూరుతోంది. అగ్ర దేశాలకే సొంతమని భావిస్తున్న ఒలంపిక్ నిర్వహణను ఇండియాల విజయవంతంగా నిర్వహించే సత్తా తమకు ఉందని పేర్కొంటోంది. స్పోర్ట్స్ మెగా ఈవెంట్ల నిర్వహణలో ఇండియా ఏ మాత్రం తక్కువకాదని ఇప్పటికే నిరూపించుకుంది. ఇప్పటికే ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ సక్సెస్ ఫుల్గా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒలంపిక్ క్రీడలపై దృష్టి సారించింది. 2036లో జరిగే ఒలంపిక్స్, పారాలింపిక్స్ భారత్లో క్రీడావేడుకలకు ప్రభుత్వం ముస్తాబవుతోంది. ఈమేరకు 2036లో ఒలంపిక్స్, పారాలింపిక్స్ నిర్వహించేందుకు ఆసక్తి చూపుతూ ఒలింపిక్స్ ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ (ఐఓఏ)కే భారత ఒలింపిక్స్ అసోసియేషన్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ పంపింది. ఈమేరకు ఈనెల ఒకటోతేదీనే సదరు లేఖను పంపినట్టు క్రీడావర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటి వరకు ఇండియ ఒక్కసారి కూడా ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యమివ్వలేదు.
ప్రధాన ప్రసంగంతో ఆసక్తి..
ఇదిలాఉంటే స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తూ 2036 నాటి ఒలింపిక్స్, పారాలింప్స్ నిర్వహణకు ఆసక్తి ఉన్నట్టు పేర్కొన్న విషయం తెలిసిందే. క్రీడా నిర్వహణ దిశగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తుండడంతో భారత క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఈవెంట్లతో ఇండియా ప్రతిష్ట మరింత పెరుగుతుందని పేర్కొంటున్నారు. ఇందుకు ఇప్పటి నుంచే తగిన ఏర్పాట్లు చేయాలని క్రీడాకారులు పేర్కొంటున్నారు. నాణ్యమైన క్రీడాకారుల సాధనకు మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు.
ఒలింపిక్ హిస్టరీ…
ఒలింపిక్ క్రీడలు ప్రతి నాలుగేళ్ళకొకసారి జరుగుతాయి. క్రీ.పూ.776 లో ప్రారంభమైన ఒలింపిక్ క్రీడలు క్రీ.శ.393 లో నిలిపి వేసారు. మళ్లి 1896లో ఏథెన్స్ లో ఆరంభమయ్యాయి. మధ్యలో కొంతకాలం ప్రపంచయుద్ధాల కారణంగా అంతరాయం ఏర్పడింది. ప్రాచీన కాలంలో జరిగిన క్రీడలను ప్రాచీన ఒలింపిక్ క్రీడలుగా, పునఃప్రారంభం తరువాత జరుగుతున్న క్రీడలకు ఆధునిక ఒలింపిక్ క్రీడలుగా వ్యవహరిస్తారు. సంక్షిప్తంగా ఈ క్రీడలను ది ఒలింపిక్స్ అని పిలుస్తారు. ఆధునిక ఒలింపిక్ క్రీడలకు ముఖ్యకారకుడు ఫ్రాన్స్ దేశానికి చెందిన పియరె డి కోబర్టీన్. 1924 నుంచి శీతాకాలపు ఒలింపిక్ క్రీడలను కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి 1896లో ప్రారంభమైన ఒలింపిక్ క్రీడలను వేసవి ఒలింపిక్ క్రీడలు అని పిలువవచ్చు. ఇంతవరకు 28 వేసవి ఒలింపిక్ క్రీడలు జరుగగా, 29 వ ఒలింపిక్ క్రీడలు 2008లో చైనా లోని బీజింగ్లో జరిగాయి. 2012లో లండనులో జరిగాయి.
ఒలింపిక్ క్రీడల చిహ్నం..
–ఎక్కువ మంది చదివినవి.. మీరు క్లిక్ చేసి చదవండి–
వంద రేప్లు చేశాడు.. వారంతా టాప్ హీరోయిన్స్ అయ్యారు..
టీడీపీ- జనసేన మధ్య ముదిరిన వార్
మన మెదడు పెరుగుతోంది.. లాభమా .. నష్టమా..
తెలుగు వారిని అంత మాటంటావా.. నటి కస్తూరిపై ఫైర్
మబ్బుల్లో విహారం.. కొత్త చిక్కుతో విచారణం
ఇంటింటి సర్వే డేటా భద్రమేనా.. అసాంఘిక శక్తుల చేతిలోకి వెళ్తే..
కేదార్నాథ్ ఆలయం మూసివేత..ఎప్పుడు.. ఎందుకంటే..
విస్తరిస్తున్న షుగర్ డాడీ.. ఆ పనికోసమేనా..
మహేష్ బాబు కోసం రాజమౌళి వెతుకులాట
న్యూ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీయార్