phule.bharatharatna: స్త్రీ విద్యకు పాటుపడిన సామాజిక సేవకురాలు.. స్త్రీ జనోద్దరణకు నడుంబిగించిన ధీశాలి.. మూఢనమ్మకాలపై చైతన్యపర్చిన మహనీయురాలు.. సావిత్రిబాయి ఫూలేకు భారత దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డు అందించి గౌరవించాలని కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా డిమాండ్‌ వ్యక్తమవుతోంది.

స్త్రీ విద్య కోసం పోరాటం

ఇప్పుడు బాలిక విద్యఅంటే మనందరికి గుర్తుకు వచ్చే మలాలా. కానీ ఏళ్ల క్రితమే సావిత్రిబాయి ఫూలే బాలిక విద్య కోసం ఎనలేని కృషి చేశారు. (phule.bharatharatna)అణగారిన వర్గాల పిల్లలకు విద్యను నేర్పి దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా కీర్తిపొందారు.

 

కుటుంబ నేపథ్యం
1831 జనవరి 3న మహారాష్ట్రలోని ప్రస్తుత సతారా జిల్లా నైగాన్‌లో జన్మించారు. 1897 మార్చి 10న పూణేలో కన్నుమూశారు. కులవ్యవస్థ, అంటరానితనం కోసం పోరాడిన, సత్యశోదక్‌ సమాజ్‌ వ్యవస్థాపకుడు జ్యోతిరావుఫూల్‌ భార్యనే సావిత్రి బాయిఫూలే. సాధారణ ఓ రైతు కుటుంబంలో పుట్టిన సావిత్రి తన తొమ్మిదో యేటనే 1840లో జ్యోతిరావు ఫూలేను వివాహం చేసుకున్నారు. వీరికి సంతానం లేకపోవడంతో ఓ బ్రాహ్మణ వితంతువు కుమారుడుని దత్తత తీసుకున్నారు.

 

సమాజ సేవలో..
నిరక్ష్యరాస్యురాలైన సావిత్రికి భర్తే విద్యాబుద్ధులు నేర్పించాడు. తర్వాతికాలంలో అహ్మదాబాద్‌లో ఉపాధ్యాయ శిక్షణ పొందింది. ఆ తర్వాత తన విద్యను నలుగురికి అందించాలనే ఉద్దేశంలో 1848న బాలికల కోసం తొలిసారిగా ఓ పాఠశాలను ప్రారంభించిన ఉచిత విద్యను అందించింది. దీన్ని తట్టుకోలేని అగ్రవర్ణాలు ఆమెను వేధింపులకు గురిచేశారు. అయనా ఆమె వారిని ఎదిరించి నిలబడింది. తర్వాత కాలంలో 50 వరకు పాఠశాలను నెలకొల్పింది.1852లో మహిళా సేవా మండల్‌ అనే మహిళాసంఘాన్ని స్థాపించి స్త్రీ సంక్షేమం కోసం పాటుపడ్డారు.

 

భర్త మరణంతో..
1890 నవంబరు 28న మహాత్మా జ్యోతిరావు ఫూలే మృతిచెందడంతో ఆమె ఎంతో కుంగిపోయింది. నాటి సామాజిక కట్టుబాట్లను పక్కపెట్టిన తన భర్త చితికి నిప్పు పెట్టి ఆదర్శప్రాయురాలైంది. తర్వాత కాలంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో తుది వరకు పాల్గొన్నారు. 1897లో మహారాష్ట్ర వ్యాప్తంగా ప్లేగు వ్యాధి విజృంబించడంతో ఆమె పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈక్రమంలోనే ఆమె కూడా ప్లేగు బాధితో తుదిశ్వాస విడిచారు.

సావిత్రి సేవలు.. గుర్తింపు. .

  1. 1997లో భారత ప్రభుత్వం సావిత్రి జ్ఞాపకార్థం తపాలా బిళ్లను విడుదల చేసింది.
  2. 1997లో పూణే విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి పేరు పెట్టారు.
  3. సావిత్రి సేవలకు గుర్తుగా ఆమె జయంతి రోజుల మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
  4. 1860 వితంతువులకు శిరోముండనం చేయడాన్ని నిరసిస్తూ క్షురకుల్లో చైతన్యం తీసుకువచ్చారు.
  5. 1873లో సత్యశోధక్‌ సమాజ్‌ సంస్థ ఏర్పాటుచేసిన సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టారు. పురోహితులు లేకుండానే శుభకార్యాలు చేయించారు.

READ MORE: చైనాలో మ‌రో కొత్త వైర‌స్‌

READ MORE: భారీ స్కాంలో టాప్‌ క్రికెటర్లు

READ MORE: జక్కన్న–ప్రిన్స్‌ మూవీ అప్డేట్స్‌

READ MORE :  అల్లు అర్జున్‌ పొలిటికల్‌ ఎంట్రీ?

READ MORE : ట‌వ‌ల్ తో హాట్ డాన్స్ చూశారా..

READ MORE : ప్రిన్స్‌ ఫ్యాన్‌కు రాజమౌళి గుడ్‌న్యూస్‌

READ MORE : భారత్‌కు సొంత స్పేస్‌ స్టేషన్‌

READ MORE : ట‌మాటా వైన్ త‌యారీకి ఇండియా స‌న్నాహం

One thought on “phule bharatharatna/సావిత్రిబాయి ఫూలేకు భారతరత్న ఇవ్వాలి..”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *