DILHI: దేశ రాజధాని ఢిల్లీ ఉక్కిరిబక్కిరి అవుతోంది. కనీసం ఊపిరి పీల్చుకునేందుకు కూడా వీలులేకుండా పోయింది. స్వచ్ఛమైన గాలి, నీరు దొరక్క ఢిల్లీ వాసులు కాలం వెల్లదీస్తున్నారు. వాయు కాలుష్యం తీవ్రం కావడంతో జనం అల్లాడుతున్నారు. గాలి నాణ్యత తగ్గిపోవడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. సోమవారం (ఆగస్టు28) కాలుష్యం కారణంగా పొగమంచు దట్టంగా కమ్ముకుంది. రెండు అడుగుల దూరం ఉన్న మనుషులు, వాహనాలు కనిపించని దుస్థితి నెలకొంది. రహదారులు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పొగమంచు దాటికి జనం బయటికి రాలేని పరిస్థితి. సోమవారం ఉదయం ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 357కు పడిపోయింది. గాలి నాణ్యత పూర్తిగా క్షీణించడంతో శ్వాసకోస సమస్యల్ని ఎదుర్కొంన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇక్కడ మనుగడ సాగించడం కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యమునా నది గతంలోకంటే అధికంగా కాలుష్య కోరల్లో చిక్కుకోవడంతో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నది నీరంతా పూర్తిగా నురగలు కక్కుతూ, దుర్వాసన వెదల్లుతోంది. విషపూరిత నురగుల నుంచి బయటపడేందుకు ఏం చేయాలో తెలియక రాష్ట్రం తలపట్టుకుంటోంది. ప్రతీ ఏటా చలికాలంలో ఇదే సమస్య తలెత్తుతున్నా ఈ సారి సమస్య మరింత జటిలంగా మారిందని పేర్కొంటున్నారు. ఈసారి మాత్రం సమస్య ముందే ఉత్పన్నమైందని చెబుతున్నారు. పంజాబ్‌, హర్యానాలో పెద్ద ఎత్తున పంట వ్యర్థాలకు రైతులు నిప్పు పెడుతుండడంతో ఆ కాలుష్యం ఎఫెక్ట్‌ ఢిల్లీపై పడుతోంది. అక్టోబరు నెలాఖరులోనే పరిస్థితి ఇంత తీవ్రంగాఉంటే జనవరి నెలలో పరిస్థితి ఇంకెంత భయంకరంగా ఉంటుందోనని ఢిల్లీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఢిల్లీ నివాస యోగ్యంకాదని కొద్దినెలల నుంచి జరుగుతున్న ప్రచారం నిజమేనేమో అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా పాలకులు మేల్కొని తగిన చర్యలు తీసుకోకుంటే దేశ రాజధాని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పర్యావరణవేత్తలు, మేధావులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలో యమునా నది విషం చిమ్ముతోంది. ప్రమాదకరస్థితిలో నీటి నది ప్రవహిస్తోంది. పెద్ద ఎత్తున నురగలు కక్కుతోంది.

ఆప్‌ ప్రభుత్వం అప్రమత్తం
ఢిల్లీ(DILHI)లో వాయు కాలుష్యం మితిమీరిపోవడంతో ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈసారి దీపావళికి బాణాసంచాను పూర్తిగా నిలిపివేస్తూ కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. కాలుష్య కోరల నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం రహదారులపై స్వీపింగ్‌, వాటర్‌ స్ర్పెయింగ్‌ను వేగవంతం చేసింది. కాలుష్యం నుంచి తప్పించుకునేందుకు ట్రాఫిక్‌లో గ్రీన్‌ ఆన్‌ రెడ్‌ ఆఫ్‌ అమలు చేస్తోంది. దీని ప్రకారం ట్రాఫిక్‌లో రెడ్‌ లైట్‌ ఉన్నంత సేపు తమ వాహనాలను ఆఫ్‌ చేయాలని సూచిస్తోంది. కాగా, ఢిల్లీలో ఇప్పటికే సరి, బేసి సంఖ్యల క్రమంలో వాహనాలను రోడ్లపైకి అనుమతిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *