Indian T20:టీమిండియా బ్యాట్తో దడ దడలాడించింది.. బాల్తోనూ గింగిరాలు తిప్పింది.. ఫలితంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ–20 మ్యాచ్ను విజయంతో ఆరంభించిన సౌతాఫ్రికాలోని డర్బన్లో జరగుతున్న నాలుగు టీ–20 మ్యాచ్ 1–0తో ముందు వరుసలో ఉంది. ఫస్ట్ బ్యాంటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 202పరుగులు భారీ స్కోర్ చేసింది. తర్వాత బ్యాంటింగ్కు దిగిన సౌతాఫ్రికా ఒత్తిడికిలోనై వరస వికెట్లను కల్పోయి ఓటమిని మూటగట్టుకుంది. 17.5ఓవర్లలో కేవలం 141 పరుగులు చేసి 61 రన్స్ తేడాతో ఇండియ విజయం సాధించింది. కాట్రెజ్ 37 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.మ్యచ్ ఆఫ్ ది ప్లేయర్ సెంచరీ హీరో సంజుశాంసన్ అదుకున్నాడు. అంతకు ముందు టాస్ గెలిచి ఫీలిండ్ ఎంచుకున్న సౌతాఫ్రికా ఆ నిర్ణయం ఎంతో తప్పదమో కాసేపటికే తెలిసివచ్చింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ను తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడారు. అభిషేక్ మరోసారి నిరాశపర్చాడు. వేగంగా పరుగులు చేసే క్రమంలో కేవలం ఏడు పరుగులకే పెవీలియం చేరాడు. మరోవైపు సంజు ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లను బెంబేలెత్తించాడు. కాగా రెండో టీ–20 నెల 10న జరగనుంది.
సంజు రికార్డుల మోత..
Indian T20: సంజు శాంసన్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో సౌత్ ఆఫ్రికా బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 47 బంతుల్లోనే సెంచరీ చేసి, వరుసగా టీ–20లో రెండు సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మొత్తంగా 50 బంతుల్లో 107 పరుగులు(4.7, 6.10) చేశాడు. చివరిసారిగా బంగ్లాదేశ్పై గత నెలలో హైదరాబాద్లో జరిగిన మూడో టీ–20లో సంజు సెంచరీ నమోదు చేశాడు. (India T20)టీ–20లో అత్యంత వేగంగా 7 వేల పరుగులు సాధించిన ఎంఎస్ ధోనీ అధిగమించాడు.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 21(17బంతులు), తిలక్వర్మ 33(18 బంతులు)తో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది.203 లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా దిగగా తొలిఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. టీ–20 ఇండియా స్పెషలిస్టు పేసర్ అర్షదీప్ సింగ్ డేయింజర్ బ్యాటర్ ఆడెమ్మ్ మాక్రమ్ బోల్తా కొట్టించాడు. దాంతో మాక్రమ్ కీపర్ సంజు శాంసన్కు సింపుల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆతర్వాత మిడిల్లో క్లాసెన్, మిల్లర్ దూకుడు పెంచి స్కోర్ బోర్డును పరుగులు పెంచాడు. కానీ, వరుణ చక్రవర్తి 12వ ఓవర్లో వరుసగా ఇద్దరిన పెవీలియం దారి పట్టించడంతో మ్యాచ్ ఇండియా వైపు మొగ్గింది. ఒత్తిడికి తట్టుకోలేక సౌతాఫ్రికా బ్యాటర్లు వరుసగా వికెట్లను కోల్పోయారు. వరుస వికెట్లు కోల్పోవడంతో రన్రేట్ పెరుగుతూ వచ్చింది..వరుణ్ చక్రవర్తి, బిష్ణోయ్లు చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
Indian T20: సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న నాలుగు టీ–20 మ్యాచ్ శుక్రవారం డబ్బన్లో ఆరంభమైంది. తొలిమ్యాచ్లోనే ఇండిన్ బ్యాటర్ సంజుశాంసన్ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. వరుసగా రెండో సెంచరీ నమోదు చేసి తన సత్తా చాటాడు.
– క్లిక్ చేసి చదవండి–
మిస్త్ ఎర్త్ 2024 విజేతగా జెస్సికా లేన్
విస్తరిస్తున్న షుగర్ డాడీ.. ఆ పనికోసమేనా..
నేడే బిగ్ ఫైల్.. ఇండియ బిగ్ ప్లాన్.. సౌతాఫ్రికాతో రెండో టీ20..