TELANGANA: ఉద్దేశం మంచిదేకావచ్చు.. భద్రత, రక్షణ లేకపోతే?.. సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిందే.. కానీ గోప్యత లేకపోతే? .. ప్రజల్ని సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలది.. మారి ఆ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తే? ప్రభుత్వాలు సేకరిస్తున్న వివరాలు ఎంత వరకు గోప్యతను పాటిస్తున్నాయి.. ఆ వివరాలను ఎక్కడ భద్ర పరుస్తున్నారు. మన అసాంఘిక శక్తుల చేతిలోకి వెళితే.. ఇప్పుడిదంతా ఎందుకు అనుకుంటున్నారా.. అదంతా తెలియాలంటే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.
సకల జనుల సర్వే వివరాలు భద్రమేనా..?
సుధీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ దశాబ్దం క్రితం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తొలిముఖ్య మంత్రి కె. చంద్రశేఖర్ రావు సమగ్ర సర్వే చేపట్టారు. ప్రజలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. ప్రభుత్వ పిలుపును అందుకున్న తెలంగాణ సమాజం తమ వివరాలు సంపూర్ణంగా వివరించడం జరిగింది. కానీ, సర్వే వివరాలు ఏమయ్యాయో తెలియక రాష్ట్ర ప్రజలు ఆందోళనకు చెందుతున్నారు. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రశ్నించడం అనుమానాలను మరింత పెంచుతోంది. నాటి సర్వే వివరాలను ఏం చేశారు.. కెసిఆర్ సర్కార్లోని అధికారులు కూడా చెప్పడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంటోంది. అదే నిజమైతే మరి ఆ డేటా ఎక్కడుంది. భద్రంగానే ఉందా అన్న సంశయం తెలంగాణవాసుల్లో నెలకొంది.
నాటి సర్వే వివరాలు ఏం చేశారు..?
తాజా రేవంత్ రెడ్డి (TELANGANA) సర్కారు కుటుంబ సర్వేకు పూనుకుంది. ప్రజల భద్రత కేవలం పార్టీల వ్యవహారం కాదు కదా. ప్రజా వివరాలు ఏమయ్యాయో చెవరు చెబుతారు. సర్వే వివరాలను పబ్లిక్ డాక్యుమెంట్ చేయాలి. కంప్యూటర్లో నిక్షిప్తం చేసి గోప్యత పాటించాలి. ఇదంతా జరిగిందా.. జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం సోషల్ మీడియా ద్వారా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకునే నేతలు ఆనాటి సర్వే వివరాలను వెల్లడించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
తాజా సర్వేను ఏం చేస్తారు..
గత బీఆర్ ఎస్ సర్వే మాట అటుంచుతే. తాజాగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులాల సర్వే ఆధారంగా కులగణనను చేపట్టేందు రెఢీ అయింది. బీసీ కులగణనతో జనంలోకి వెళ్తోంది. ఈనెల 6వ తేదీ నుంచి ఇంటింటికి సమగ్ర సర్వే కు పూనుకుంది. ఈ నేపథ్యంలో కులాలతో పాటు,ప్రజల ఆర్థిక స్థితిగతులు, నిరుద్యోగులు సంఖ్య, అక్షరాస్యుల సంఖ్య, రేషన్ కార్డుల వివరాలు ఇలా మొత్తం వివరాలు సేకరించనున్నారు. దీని ఆధారంగానే ప్రజలకు ఏ పథకం అందాలో..అందకూడదో కూడా తెలుసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ భావన. మరి ప్రజల వ్యక్తి గత వివరాలను సేకరిస్తున్న ప్రభుత్వం వాటిని ఎలా భద్ర పరుస్తుందని ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ప్రస్తుత సర్వే ,కులగణనలో సేకరించే వివరాలు..
తాజాగా చేపట్టే సర్వే ప్రశ్నావళిని ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 56 ప్రధాన ప్రశ్నలు, 19 అనుబంధ ప్రశ్నలతో మొత్తం 75 ప్రశ్నలను ఖరారు చేసింది. పార్ట్-1లో వ్యక్తిగత అంశాలకు చెందిన యజమాని, కుటుంబ సభ్యులకు సంబంధించి 58 ప్రశ్నలు ఉన్నాయి. అలాగే కుటుంబ వివరాలకు సంబంధించి మరో 17 ప్రశ్నలు పార్ట్-2లో పొందుపర్చారు. వీటన్నింటిని ఏడు పేజీల్లో పూర్తి చేయనున్నారు. వ్యక్తిగత వివరాల్లో మతం, సామాజిక వర్గం, కులం, ఉప కులంతో పాటు మాతృభాష, వైవాహిక స్థితి, పాఠశాల రకం, విద్యార్హత, ఉద్యోగం, ఉపాధి, కుల వృత్తి, వార్షిక ఆదాయం, ఐటి రిటర్న్, స్థిరాస్తులు, ధరణి పాసుబుక్ నెంబర్, రిజర్వేషన్తో పొందిన ప్రయోజనాలు, గత ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి లబ్దిపొందిన సంక్షేమ పథకాల పేర్లను వివరించాల్సి ఉంంటుంది. అలాగే రాజకీయ నేపథ్యం, వలస వివరాలను కూడా సేకరిస్తారు. గడిచిన ఐదేళ్లలో తీసుకున్న రుణాలు, స్థిరాస్తి, చరాస్తి వివరాలు, గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డు నెంబర్, మరుగుదొడ్డి, నివాస గృహం రకం, వివరాలు తెలపాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఆధార్ వివరాలు తప్పనిసరి కాదని ఇందులో స్పష్టం చేశారు.
– క్లిక్ చేసి ఇవి కూడా చదవండి-
కేదార్నాథ్ ఆలయం మూసివేత..ఎప్పుడు.. ఎందుకంటే..
విస్తరిస్తున్న షుగర్ డాడీ.. ఆ పనికోసమేనా..
మహేష్ బాబు కోసం రాజమౌళి వెతుకులాట
న్యూ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీయార్
బీజేపీలో ముసలం.. నెక్ట్స్ బాస్ ఎవరంటే..?