TELANGANA: హైదరాబాద్: ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ సర్కారు ఆధునిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలును ఇప్పటికే ముమ్మరం చేసింది. 7,185 ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 60.8 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. ఇందులో 40శాతం వరకు సన్నాలు సాగు చేశారని వ్యవసాయ శాఖ ఆంచనా వేసింది. కొనుగోలు కేంద్రాల సన్న రకాలకు క్వింటా రూ.500 బోనస్ ధరతో కొనుగోలు చేస్తోంది. ఈసారి మొత్తంగా 91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తాయని అధికారులు అంచనా వేశారు. అయితే ధాన్యం నాణ్యత విషయంలో ఆ శాఖ ఇప్పటివరకు దొడ్డు, సన్న నిర్ధారణ ప్రమాణాలు పాటించిన దాఖలాలు లేవు. ఏడాపెడా వడ్లను కొనుగోలు చేసింది. గ్రేడ్-ఏ ధాన్యానికి క్వింటాకు రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 చెల్లించనున్నారు.
బియ్యం గింజగా మార్చేందుకు..
బియ్యం గంజను సన్నగా మార్చేందుకు ప్రభుత్వం(TELANGANA) అధునాతన పరికరాలను అందుబాటులో తెచ్చింది. వడ్లకున్న ఒలిచేందుకు ప్యాడిహస్కర్ యంత్రాల ఏర్పాటు చేసింది. 20వడ్ల గింజలను తీసుకుని యంత్రంలో పోసి తిప్పితే.. పొట్టూడిపోయి బియ్యం గింజలు బయటికొ స్తాయి. పాత కాలంలో వడ్లను చేతితో నలిపే వారు. అప్పుడు నుంచి బియ్యం వచ్చేవి. ఇప్పుడు ప్యాడిహస్కర్ను వినియో గిస్తున్నారు. ఈ బియ్యం గింజలను సుమారు 10 గింజ లను తీసుకుని అన్నింటిని ఒక్కొక్కటిగా గ్రెయిన్ కాలి పర్ మెషీన్లో పెట్టి కొలువనున్నారు.
గ్రెయిన్ కాలిపర్ యంత్రాలు
సన్నధాన్యం గుర్తిం చేందుకు కొనుగోలు కేంద్రాలకు గ్రెయిన్ కాలిపర్ (డయల్ మైక్రోమీటర్) యంత్రాన్ని అందజేస్తు న్నారు. దీంతో సన్న బియ్యం పాడవు, వెడల్పు కొలవనున్నారు. పొడవు 6 మిల్లీమీ టర్ల కంటే తక్కువ, వెడల్పు 2 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉండాలని నిర్ణయించారు. బియ్యం పొడవు, వెడల్పు నిష్పత్తి 2.5 మిల్లీమీ టర్ల కంటే ఎక్కువగా నిర్దేశిత ప్రమాణా లుగా ద్రాల వారికి అవగాహన కల్పించారు. ఇప్పటికే ఈ యంత్రంపై కొనుగోలు కేంద్రాలకు పంపించారు.
33 సన్న రకాలకు బోనస్
ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలను సన్నాలుగా గుర్తించిం ది. బీపీటీ 5204, డబ్లూయజీఎల్ – 44, కేపీఎస్- 2874, జేజీఎల్-27356, జేజీఎల్ 28545, డబ్ల్యూజీఎల్- 14, డబ్ల్యూజీఎల్-32100, జేజీఎల్-11470, జేజేఎల్- 384, , జేజీఎల్-384, జేజీఎల్-3828. తెలంగాణ సోనా, వరంగల్-1119, కేఎల్ఎం- 1638, వరంగల్-962, రాజేంద్రనగర్, రేఎల్ఎం-733, జేజీఎల్-1798, జేజీఎ లై3844, జేజీఎల్ 3855, జేజీఎల్-11118, , సుగంధ సాంబ, శోభిని, సోమనాథ్, ఆర్ఎన్ఆ 5-31379, కేపీ.ఎస్-6251, జేజీఎల్ 33124, హెచ్ఎంటీ సోనా, ఎంజీయూ-1224, ఎంటీయూ 1271 రకాలకు బోనస్ చెల్లించనున్నారు.