హైదరాబాద్: తెలంగాణ ((TELANGANA) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఉదయం అట్టహాసంగా ఆరంభమైంది. జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సర్వేను అధికారికంగా సర్వే రిపోర్ట్ ఆధారంగానే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారుకానున్నాయి. కుల గణన అనంతరం గ్రమా పంచాయతీ ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో రేవంత్ సర్కారు ఉంది. సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలని సర్కారు విజ్ఞప్తి చేస్తోంది. ఎన్యుమరేటర్లకు సర్వే కిట్లను అందజేశారు. నేడు, రేపు, ఎల్లుండి శిక్షణ పొంది ఎను్యమరేటర్లు ఇంటింటి సర్వేలో పాల్గొంటారు. ఈ మూడురోజులు గుర్తించిన ఇంటికి స్టిక్లర్లను అంటిస్తారు. ఈనెల 9 నుంచి స్టిక్లర్ అంటించిన ఇంటికి వెళ్లి సిబ్బంది సంపూర్ణ వివరాలను సేకరిస్తుంది. 150 ఇండ్లకు ఒక ఎన్యుమరెటర్ సర్వే వివరాలు తీసుకోనున్నారు. మొదటి మూడు రోజులు ఇండ్లకు స్టిక్కెర్ అంటిస్తారన్నారు. ఆ తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తారన్నారు. సర్వేకు ప్రజలంతా సహకరించాలని సర్కారు కోరారు.
రాష్ట్రంలో 1.17 కోట్లకు పైగా ఇళ్లు..
కులగణన చేపట్టిన రేవంత్రెడ్డి సర్కారు పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ముందస్తుగా గుర్తించిన రాష్ట్రంలో కోటి 17లక్షల 44 వేల ఇళ్లు ఉన్నాయని గుర్తించింది. తాజా సర్వే కోసం 87,900 ఎన్యుమరెటర్లు సర్కారు ఈమేరకు శిక్షణ ఇచ్చింది. వారంతా ఈ సర్వేలో కుల గణన చేయనున్నారు. ఇదిలా ఉంటే ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 28 లక్షల ఇండ్లు ఉండగా 19 వేలకుపైగా ఎన్యుమరేటర్లు నియమించారు. ఈ సర్వే ద్వారా వచ్చే డేటాతో అన్ని వర్గాల వారికి భవిష్యత్లో న్యాయం జరిగేలా చేస్తామని సర్కారు చెబుతోంది. అందరి సలహా సూచనలు తీసుకున్న తర్వాతనే సర్వే ప్రశ్నలు తయారు చేశామన్నారు. ఆధార్ కార్డు వివరాలు ఆప్షనల్ మాత్రమే అని స్పష్టం చేస్తున్నారు. ఎలాంటి పత్రాల జిరాక్సులు ఇవ్వాల్సిన అవసరం లేదని సర్కారు చెబుతోంది. గ్రేటర్ హైదరాబాద్లో సర్వే కోసం 18, 723 మంది ఇన్యుమరెటర్లు, 1870 మంది సూపర్ వైజర్లను ప్రభుత్వం నియమించింది.
ప్రస్తుత సర్వే ,కులగణనలో సేకరించే వివరాలు..
తాజాగా తెలంగాణ ((TELANGANA) చేపట్టే సర్వే ప్రశ్నావళిని ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 56 ప్రధాన ప్రశ్నలు, 19 అనుబంధ ప్రశ్నలతో మొత్తం 75 ప్రశ్నలను ఖరారు చేసింది. పార్ట్-1లో వ్యక్తిగత అంశాలకు చెందిన యజమాని, కుటుంబ సభ్యులకు సంబంధించి 58 ప్రశ్నలు ఉన్నాయి. అలాగే కుటుంబ వివరాలకు సంబంధించి మరో 17 ప్రశ్నలు పార్ట్-2లో పొందుపర్చారు. వీటన్నింటిని ఏడు పేజీల్లో పూర్తి చేయనున్నారు. వ్యక్తిగత వివరాల్లో మతం, సామాజిక వర్గం, కులం, ఉప కులంతో పాటు మాతృభాష, వైవాహిక స్థితి, పాఠశాల రకం, విద్యార్హత, ఉద్యోగం, ఉపాధి, కుల వృత్తి, వార్షిక ఆదాయం, ఐటి రిటర్న్, స్థిరాస్తులు, ధరణి పాసుబుక్ నెంబర్, రిజర్వేషన్తో పొందిన ప్రయోజనాలు, గత ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి లబ్దిపొందిన సంక్షేమ పథకాల పేర్లను వివరించాల్సి ఉంంటుంది. అలాగే రాజకీయ నేపథ్యం, వలస వివరాలను కూడా సేకరిస్తారు. గడిచిన ఐదేళ్లలో తీసుకున్న రుణాలు, స్థిరాస్తి, చరాస్తి వివరాలు, గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డు నెంబర్, మరుగుదొడ్డి, నివాస గృహం రకం, వివరాలు తెలపాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఆధార్ వివరాలు తప్పనిసరి కాదని ఇందులో స్పష్టం చేశారు.
–ఎక్కువ మంది చదివినవి.. మీరు క్లిక్ చేసి చదవండి–
సర్వే డేటా భద్రమేనా.. ప్రజలకు అనుమానాలు.. ముప్పు ఇదేనా..
వాటిని.. డ్రీమ్ గర్ల్ హేమామాలిని బుగ్గలుగా మారుస్తా..
వంద రేప్లు చేశాడు.. వారంతా టాప్ హీరోయిన్స్ అయ్యారు..
టీడీపీ- జనసేన మధ్య ముదిరిన వార్
మన మెదడు పెరుగుతోంది.. లాభమా .. నష్టమా..
తెలుగు వారిని అంత మాటంటావా.. నటి కస్తూరిపై ఫైర్
మబ్బుల్లో విహారం.. కొత్త చిక్కుతో విచారణం
ఇంటింటి సర్వే డేటా భద్రమేనా.. అసాంఘిక శక్తుల చేతిలోకి వెళ్తే..
కేదార్నాథ్ ఆలయం మూసివేత..ఎప్పుడు.. ఎందుకంటే..
విస్తరిస్తున్న షుగర్ డాడీ.. ఆ పనికోసమేనా..
మహేష్ బాబు కోసం రాజమౌళి వెతుకులాట
న్యూ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీయార్
బీజేపీలో ముసలం.. నెక్ట్స్ బాస్ ఎవరంటే..?
మెడికల్ వార్: ఆయుర్వేదం వర్సెస్ అలోపతి
పడిపోతున్న ఇండియా గ్రాఫ్.. కానీ..