Warangal Danger Zone:  వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లా వాసులను ప్ర‌కృతి ప్ర‌కోపాలు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. అవిభ‌క్త వ‌రంగ‌ల్ జిల్లాలో ఏదో ఓ చోట అనూహ్య ఘ‌ట‌న చేసుకోవ‌డం వారిలో భ‌యాందోళ‌న‌లు నెల‌కొంటున్నాయి. అంతేకాదు ఈ ప్రాంతంలోనే ఎందుకు అసాధార‌ణ ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయో అర్థంకాక కంగారు ప‌డుతున్నారు. వ‌రంగ‌ల్ కేంద్రంగా ఏం జ‌రుగుతోందో తెలియ‌క భ‌యం గుప్పిట్లో ఉన్నారు. వ‌రుస ఘ‌ట‌న‌లు దేనికి సంకేత‌మంటూ వాపోతున్నారు. వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లాలో ఈ వైప‌రిత్యాల ఎందుకు చోటు చేసుకుంటున్నాయో మేధావులు, శాస్త్ర‌వేత్త‌లు అన్వేషిస్తున్నారు. సామాన్యులు మాత్రం ఈ ప‌రిణామాలు ఏ విప‌త్తుకు దారి తీస్తాయోన‌ని జంకుతున్నారు. గ‌త సెప్టెంబ‌రు 4న ములుగు జిల్లా మేడారం అడ‌విలో ఒకేసారి సుమారు 70వేల చోట్లు కుప్ప‌కూలాయి. ఈ విష‌యం దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. తాజాగా (డిసెంబ‌రు4)న ఇదే ప్రాంతంలో భూకంపం చోటుచేసుకుంది. అదికూడా 20 ఏళ్ల త‌ర్వాత ఏకంగా 5.7గా రిక్ట‌ర్ స్కేల్‌పై న‌మోద‌వ‌డం భ‌యానికి కార‌ణ‌భూత‌మ‌వుతోంది. స‌ముద్ర మ‌ట్టానికి అత్యంత ఎత్తులో ఉండే ఈ ప్రాంతం ఉన్న‌ప్ప‌టి ఈ ప‌రిణామాలు ఆందోళ‌న క‌లిగించే అంశ‌మే.

ఇది చ‌ద‌వండి: భూకంప క‌ల‌క‌లం

ఇష్టారాజ్యంగా క్వారీలు..

Warangal Danger Zone:  వ‌రంగ‌ల్ ఉమ్మడి జిల్లా(భూపాల‌ప‌ల్లి, ములుగు, వ‌రంగ‌ల్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, జ‌న‌గామ‌)తోపాటు తెలంగాణ, ఆంధ్ర‌, మ‌హారాష్ట్ర, ఛ‌త్తీస్‌ఘ‌డ్‌ త‌దిత‌ర రాష్ట్రాలో విచ్ఛ‌ల‌విడిగా పెద్ద పెద్ద గుట్ట‌ల్ని తొలుస్తున్నారు. ఇష్టారాజ్యంగా భారీ బ్లాస్టింగ్‌ల భూమిపై పెను ప్ర‌భావం చూపుతున్నాయి. ఆ పేలుళ్ల కార‌ణంగా భూకంపాలు రావ‌డానికి కార‌ణ‌మంటూ మేధావులు పేర్కొంటున్నారు.

విచ్ఛ‌ల‌విడిగా సింగ‌రేణి బ్లాస్టింగ్‌లు..

Warangal Danger Zone:  సింగ‌రేణి అడ్డూఅదుపు లేకుండా బ్లాసింగ్‌లు చేప‌డుతోంది. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో ఓపెన్ కాస్ట్‌లలో పెద్ద పెద్ద పేలుళ్ల ప్ర‌భావం ప్ర‌కృతిపై ప‌డుతోంది. ఇదివ‌ర‌కు సాంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో కార్మికులు అండ‌ర్ గ్రౌండ్‌లో బొగ‌గు కోసం త‌వ్వ‌కాలు జ‌రిపేవారు. పాల‌కుల నిర్ల‌క్ష్యం, ప్ర‌కృతి కాపాడాల‌నే క‌నీస బాధ్య‌త విస్మ‌రిస్తోంది. లాభాపేక్షే ల‌క్ష్యంగా ఓపెన్ కాస్ట్‌ల‌కు పాల్ప‌డుతుడ‌డం ఈ ప్రాంతంలో ప్ర‌కృతి వైప‌రిత్యాల‌కూ కార‌ణ‌మ‌వుతోంది.

ఇటీవ‌ల ఒక్క‌సారిగా కూలిన 70వేల చెట్లు..
ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌లోని ములుగు జిల్లా మేడారం అట‌వి ప్రాంతంలో అక‌స్మాత్తుగా సుమారు 70వేల చోట్లు కుప్ప‌కూలాయి. గ‌త‌సెప్టెంబ‌రు 4న ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. అప్ప‌ట్లో ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. దీనికి గ‌ల కార‌ణాలు ఇంకా పూర్తి స్థాయిలో తెలియ‌రాలేదు. ఇలాంటి ఘ‌ట‌న ప‌రిస‌ర అడ‌వుల్లో సైతం త‌ర్వాతి కాలంలో చోటుచేసుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు అనుమానం సైతం వ్య‌క్తం చేస్తున్నారు.

జోన్ 3లో ఉన్నా భూకంపం ఎందుకు వ‌చ్చింది…

Warangal Danger Zone:  భారతదేశం భూపంకం సంభ‌వించే సంభ‌వించే ప్రాంతాల‌ను ఐదు జోన్లుగా విభ‌జించారు. ఇందులో వ‌రంగ‌ల్ జోన్ -3 ప‌రిధిలో ఉంది. అంటే ఇక్క‌డ భూకంపాలు త‌క్కువ స్థాయిలో ఉండ‌డం, ప్ర‌మాద తీవ్ర కూడా త‌క్కువే ఉంటుంది. స‌హ‌జంగా ఇక్క‌డ 2 నుంచి 3 లోపు అప్పుడ‌ప్పుడు రిక్ట‌ర్ స్కేల్‌ల‌పై న‌మోద‌వుతూ ఉంటుంది. అదికూడా త‌క్కువ స‌మ‌యం ప్ర‌కంప‌న‌లు ఉండ‌డంతో అస‌లు భూకంపం వ‌చ్చిన‌ట్టు అంత‌గా తెలియ‌దు. భూకంపం తీవ్ర పెరిగితే జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై పెను ప్ర‌భావం ప‌డుతుంది. భూకంపం స్థాయి మ‌రింత పెరిగిన కాలేశ్వ‌రం లాంటి ప్రాజెక్టులకు ముప్పు ఉంటుంద‌ని మేధావులు పేర్కొంటున్నారు.

READ MORE : షుగర్‌ డాడీ.. పల్లెలకు విస్తరించిన విష సంస్కృతి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *