TELANGANA SURVAY: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం(నవంబరు-6)నుంచి అధికారికంగా సామాజిక, ఆర్థిక, ఉపాధి, కుల గణనకు శ్రీకారం చుట్టింది. నేటి నుంచి 8 వరకు ఇంటింటి సిబ్బంది వెళ్లి ముందస్తుగా గుర్తించిన ఇళ్లకు స్టక్కర్లు వేస్తారు. నవంబరు 9 నుంచి స్టిక్కరింగ్ చేసిన ఇళ్లకు సిబ్బంది వెళ్లి సమగ్ర సర్వే చేస్తారు. సర్వేకు తెలంగాణ ప్రజానీకం వ్యతిరేకించక పోయినా ఓ ప్రచారం తెలంగాణ వాసులను కలవర పెడుతోంది. ఇప్పటికే రేషన్ కార్డులు (ఫుడ్ సెక్యూరిటీ కార్డు)లు లక్ష్యానికి మించి ఉన్నాయని, ఇప్పటికే చాలామందికి అనర్హులకు రేషన్ కార్డులు దక్కాయనే ప్రచారం కొంత కాలంగా ప్రచారంలో ఉంది. ఇదిలాఉంటే గతంలో పలువురునేతలు, ముఖ్యంగా కొందరు కాంగ్రెస్ నేతలు కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ ఎస్ గవర్నమెంట్లో విచ్చలవిడిగా రేషన్ కార్డులు ఇచ్చారనేది వీరి భావన. కేవలం ఓట్ల రాజకీయం కోసంమే గత ప్రభుత్వం అనర్హులకు రేషన్ కార్డులు ఇచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజా సర్వే రేషన్ కార్డుదారులను ఆందోళనకు గురిచేస్తోంది.
రేషన్కార్డు.. ఆరోగ్యశ్రీ కార్డులకు మంగళం…
తెలంగాణ సర్వే (SURVAY: )రేషన్కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సర్వే తర్వాత భారీగా రేషన్, ఆరోగ్య శ్రీ కార్డులకు కోత విధిస్తారనే ప్రచారం సాగడం వారిని కలవర పెడుతోంది. ఇప్పటి వరకు ఈ అంశాలపై రేవంత్ రెడ్డి సర్కారు ఎలాంటి ప్రకటన చేయపోయినా సదరు కార్డు లబ్ధిదారులో కలవరం పెరుగుతోంది. ఇప్పటి వరకు రేషన్ కార్డు లబ్ధిదారులకే ఆరోగ్య శ్రీ పథకం అమలు అవుతున్న విషయం తెలిసిందే. ప్రత్యేకంగా ఆరోగ్య శ్రీ కార్డులను తీసేయకపోయినా.. రేషన్ కార్డు దారులకే ఆరోగ్య శ్రీ కార్డు పనిచేస్తున్న విషయం తెలిసిందే. దాంతో రేషన్ కార్డులకు చెక్ పెడితే ఆరోగ్య శ్రీ పరోక్షంగా కోత పెట్టినట్టవుతుందని, ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా సర్కారు యోచిస్తోందని తెలంగాణలో ఓ ప్రచారం సాగుతుండడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విదేశీ కార్డుల ఔట్?
ఎవరైనా విదేశాలకు, ఇతర రాష్టాల్రకు వెళ్లారా.. ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారా.. ఇలా మొత్తం 75 రకాల ప్రశ్నలతో వివరాలు సేకరిస్తున్నారు. సర్వేలో కుటుంబ యజమాని, సభ్యుల వివరాలను నమోదు చేయడంతో పాటు కుటుంబంలోని ప్రతిఒక్కరి ఫోన్ నంబరు, వారుచేసే వృత్తి, ఉద్యోగ వివరాలను తీసుకుంటున్నారు. కుటుంబంలో ఎవరైనా విదేశాలకు లేదా ఇతర రాష్టాల్రకు వెళ్తే ఏ కారణంతో వెళ్లారనేది కూడా చెప్పాలి. ఉన్నత చదువు లేదా ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి లేదా ఇతర అవసరాలకు వెళ్లారా.. అని కుటుంబ యజమానిని గణకులు అడుగుతున్నారు. విదేశాల్లో యూకే, అమెరికా, గల్ఫ్, ఆస్టేల్రియా, కెనడాలతో పాటు ఐరోపా దేశాలకు వెళ్లినట్లు చెబితే ఒక్కో దేశానికి ఒక ప్రత్యేక కోడ్ నమోదు చేస్తున్నారు. మరే దేశానికి వెళ్లినా ఇతర దేశం అనే కోడ్ నమోదు చేస్తున్నారు. తెలంగాణ నుంచి ఎందరు వలస వెళ్లారు.. ఏ కారణంతో బయటకు వెళ్లారనే సమగ్ర సమాచారం సేకరించడానికి ఈ ప్రశ్నలు రూపొందించి నట్లు తెలుస్తోంది.
ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు యధాతథం
ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులపై ఎలాంటి చర్యలు ఉండవని, అవి యథాతథంగా ఉంటాయని మంత్రి దుద్దిర్ల శ్రీధర్ బాబు వ్యక్తం చేశారు. కార్డుల ఏరివేతపై వస్తున్న అనుమానాలను ఆయన పటాపంచలు చేశారు. బుధవారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో సర్వేను మంత్రి ప్రారంభించారు. విద్య, ఉపాధి, సామాజిక, రాజకీయ ఆర్థిక ప్రణాళికల కోసం సర్వే చేపట్టినట్లు తెలిపారు. రేషన్కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు పోతాయని దుష్పచ్రారం చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని వెల్లడించారు. ఇంటింటి సర్వేకు ప్రజలందరూ సహకరించాలని శ్రీధర్బాబు కోరారు.
–ఎక్కువ మంది చదివినవి.. మీరు క్లిక్ చేసి చదవండి–
సర్వే డేటా భద్రమేనా.. ప్రజలకు అనుమానాలు.. ముప్పు ఇదేనా..
వాటిని.. డ్రీమ్ గర్ల్ హేమామాలిని బుగ్గలుగా మారుస్తా..
వంద రేప్లు చేశాడు.. వారంతా టాప్ హీరోయిన్స్ అయ్యారు..
టీడీపీ- జనసేన మధ్య ముదిరిన వార్
మన మెదడు పెరుగుతోంది.. లాభమా .. నష్టమా..
తెలుగు వారిని అంత మాటంటావా.. నటి కస్తూరిపై ఫైర్
మబ్బుల్లో విహారం.. కొత్త చిక్కుతో విచారణం
ఇంటింటి సర్వే డేటా భద్రమేనా.. అసాంఘిక శక్తుల చేతిలోకి వెళ్తే..
కేదార్నాథ్ ఆలయం మూసివేత..ఎప్పుడు.. ఎందుకంటే..
విస్తరిస్తున్న షుగర్ డాడీ.. ఆ పనికోసమేనా..
మహేష్ బాబు కోసం రాజమౌళి వెతుకులాట
న్యూ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీయార్
బీజేపీలో ముసలం.. నెక్ట్స్ బాస్ ఎవరంటే..?
మెడికల్ వార్: ఆయుర్వేదం వర్సెస్ అలోపతి
పడిపోతున్న ఇండియా గ్రాఫ్.. కానీ..